భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ప్రపంచవ్యాప్తంగా ఇ ఎం బి లతో ఎన్నికల సమగ్రతపై సమిష్టి బృందానికి ఈసీఐ నాయకత్వం; కో లీడ్స్ గా ఈసిఐ తో చేరిన మారిషస్, గ్రీస్ , ఐ ఎఫ్ ఇ ఎస్


సమ్మిళిత ఎన్నికలు ప్రజల సమష్టి సంకల్ప వ్యక్తీకరణను నిజాయితీగా ప్రతిబింబిస్తాయి, ఇది ప్రజాస్వామ్యం ముఖ్య లక్షణం: సిఇసి రాజీవ్ కుమార్

సోషల్ మీడియా సవాళ్లను , ఇ ఎం బి ల పనితీరుతో ఇబ్బందిని వివరించిన సి ఇ సి శ్రీ రాజీవ్ కుమార్

సోషల్ మీడియా వేదికలు తమ 'అల్గోరిథం శక్తిని నకిలీ వార్తలను ముందస్తుగా రెడ్ఫ్లాగ్ చేయడానికి ఉపయోగించాలని ఈఎంబీలు ఆశిస్తున్నాయి: సీఈసీ శ్రీ కుమార్

ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు ఎన్నికల నిర్వహణలో ఈసీఐ నైపుణ్యాన్ని అందిస్తోంది

కోవిడ్ మహమ్మారి వంటి కల్లోల సమయాల్లో కూడా ఓటుహక్కును రద్దు చేయడం ప్రజాస్వామ్యాలకు ఎంపిక కాదు: సీఈసీ

భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియలను పర్యవేక్షించే సమర్థ ఎన్నికల నిర్వహణ సంస్థ కు ఒక నిదర్శనం: ఛార్జ్ డి అఫైర్స్, యునైటెడ్ స్టేట్స్

ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు కు ఫాలో ఆన్ గా ' ఇఎమ్ బిల పాత్ర, ఫ్రేమ్ వర్క్, సామర్థ్యం' అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు కు ఈసీఐ ఆతిథ్యం

Posted On: 31 OCT 2022 1:15PM by PIB Hyderabad

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ శ్రీ అనూప్ చంద్ర పాండేతో కలిసి 'ఎన్నికల నిర్వహణ సంస్థల పాత్ర, పరిధి ,మరియు సామర్థ్యం' అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఈరోజు ఢిల్లీ లో ప్రారంభించారు. 2021 డిసెంబర్ లో జరిగిన 'సమ్మిట్ ఫర్ డెమోక్రసీ'కి కొనసాగింపుగా ఈసీఐ నేతృత్వంలో కోహర్ట్ ఆన్ ఎలక్షన్ ఇంటిగ్రిటీ కింద భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో ఈ సదస్సును ఏర్పాటు చేసింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001VFFP.jpg

 

సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ, ప్రలోభాలు లేని స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, సమ్మిళిత, సరళ ఎన్నికలు ప్రజాస్వామ్య రాజకీయాలకు మూలస్తంభం అని, శాంతి , అభివృద్ధి డివిడెండ్లకు ఒక ముందస్తు షరతు అని అన్నారు. ఈ భావనలు సార్వభౌమత్వం అనేది ఒక దేశ ప్రజల స్వంతం , దాని నుండి ప్రవహిస్తుందనే అవగాహనను కలిగి ఉంటాయి. ముఖ్యంగా సమ్మిళితం అంటే మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, యువ ఓటర్లు, అణగారిన జనాభాకు అసమానతలను సర్దుబాటు చేయడం అని కూడా ఆయన అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EPTP.jpg

 

ప్రారంభోత్సవంలో సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ ప్రసంగం. ఇక్కడ చూడండి:

 

https://youtu.be/YF5niqARHso

 

సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఆలోచనను హైలైట్ చేస్తూ, ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ భారతీయ నైతికతలో ఒక భాగమని, ఒక జీవన విధానం అని అన్నారు. విభిన్న అభిప్రాయాలు, సంభాషణలు, చర్చలు, వసతి, దూకుడు లేకుండా ఉండటం మన సంస్కృతిలో అంతర్లీన  భాగంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలపై ప్రజల విశ్వాసం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాథమిక సూత్రం అని ఆయన అన్నారు.

 

సదస్సు ఇతివృత్తం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, 'ఎన్నికల నిర్వహణ సంస్థల పాత్ర, ఫ్రేమ్ వర్క్ , సామర్థ్యం' 'ఎన్నికల సమగ్రత'కు ప్రధాన నిర్మాణ మూలమని ఎందుకంటే ఇది ఎన్నికల ప్రజాస్వామ్య పునాది , క్రియాత్మక అంశాలను కవర్ చేస్తుందని ఆయన అన్నారు. శిఖరాగ్ర సమావేశం నిబద్ధతలను నిజమైన ఫలితాల దిశగా తీసుకువెళ్ళడానికి ఇసిఐ ఎన్నికల నిర్వహణలో తన నైపుణ్యాన్ని ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు అందించడానికి సిద్ధంగా ఉందని సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ తెలిపారు.

 

నేటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సంస్థ ల ముందు ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వేదికలు ఈఎమ్ బి లతో కలసి పనిచేస్తూ తమకు కంటెంట్ డిస్ ప్లే , పాలసీలు ఉన్నట్టు స్వయంగా ప్రకటించుకుంటాయని, అయితే అవి తమకు గల “అల్గోరిథం శక్తి” తో మోడస్ ఒపెరాండి,  శైలుల ఆధారంగా నకిలీ వార్తలను ముందస్తుగా పసి గట్టి రెడ్ ఫ్లాగ్ చేయాలని ఇ ఎస్ బి లు ఆశించడం తప్పు కాదని ఆయన నొక్కి చెప్పారు. నకిలీ వార్తలను ఎదుర్కోవడానికి ఇటువంటి చురుకైన విధానం విశ్వసనీయమైన ఎన్నికల ఫలితాలను సులభతరం చేస్తుందని, ఇది సోషల్ మీడియా వేదికలు వృద్ధి చెందడానికి,  అవసరమైన 'స్వేచ్ఛలను' కాపాడటానికి సహాయపడుతుందని శ్రీ కుమార్ అన్నారు.

 

కోవిడ్ సమయంలో మనం నేర్చుకున్నట్లే ఈ సమిష్టి బృందం (కోహర్ట్) ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడానికి సరైన వేదిక అని శ్రీ రాజీవ్ కుమార్ అన్నారు. కోవిడ్ మహమ్మారి వంటి కల్లోల సమయాల్లో తాత్కాలికంగా కూడా ఓటుహక్కును ఉపసంహరించుకోవడం ప్రజాస్వామ్యాలకు ఒక ఎంపిక కాదని ఆయన అన్నారు. సందర్భోచిత సవాళ్లు, అవకాశాలపై సహకరించడానికి అనేక సంభాషణలు , సంస్థాగత యంత్రాంగాలకు ఈ బృందం పునాది వేస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

 

ఈ సదస్సులో శ్రీమతి ఎలిజబెత్ జోన్స్, ఛార్జ్ డి అఫైర్స్, యునైటెడ్ స్టేట్స్ మాట్లాడుతూ, భారతదేశంతో సంబంధాలు అత్యంత సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి , ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత , శ్రేయస్సును తీసుకురావడానికి సహకరించడానికి ఈ భాగస్వామ్యం బలంగా ముందుకు వెళుతుందని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్మించడంలో అమెరికా,  భారతదేశం రెండూ గణనీయంగా దోహదపడ్డాయని ఆమె నొక్కిచెప్పారు. సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజాస్వామ్య సూత్రాలను పెంపొందించడంలో ఇసిఐ కీలక విజయాలు సాధించిందని ఆమె అన్నారు.

ఎన్నికల ప్రక్రియలను పర్యవేక్షించే సమర్థ ఎన్నికల నిర్వహణ సంస్థకు భారత ఎన్నికల సంఘం ఒక నిదర్శనం. మీ నాయకత్వం , మీ నైపుణ్యాన్ని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పంచుకోవడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ సంతృప్తి చెందింది. భారత ఎన్నికల నిర్వహణ యంత్రాంగం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాలకు ప్రమాణాలను నిర్దేశించింది" అని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. సమాచార వాతావరణాన్ని తారుమారు చేయడం, మహిళలు అణగారిన వర్గాల భాగస్వామ్యంలో అడ్డంకులు, పౌర స్థలాలను కుదించడం, ఎన్నికల సమగ్రతను బలహీనపరిచే వ్యవస్థాగత అవినీతితో సహా ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న వివిధ సవాళ్లను ఆమె ప్రస్తావించారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036VMD.jpg

రెండు రోజుల పాటు జరిగే ఈ

సమావేశానికి వ చ్చిన ప్రతినిధులకు ఐఐఐడిఎమ్ , సీనియర్ డీఈసీ

శ్రీ ధర్మేంద్ర శర్మ స్వాగతం పలికారు. మారిషస్ ఎన్నికల కమిషనర్ మహమ్మద్ ఇర్ఫాన్ అబ్దూల్ రెహమాన్, గ్రీస్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎలక్షన్స్ అండ్ పోల్ పార్టీస్

డిపార్ట్ మెంట్ హెడ్ శ్రీమతి అగ్గెలికి బరోటా, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ అండ్ సి ఇ ఓ ఆంథోనీ బాన్ బరీ, ఇంటర్నేషనల్ ఐడియా సెక్రటరీ జనరల్ శ్రీ కెవిన్ కాసాస్- జమోరా, ఆర్మేనియా, మారిషస్, నేపాల్, కాబో వెర్డే, ఆస్ట్రేలియా, చిలీ, ఫెడరల్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, గ్రీస్, ఫిలిప్పీన్స్,  కోస్టారికా, ఘనా, జమైకా, అల్బేనియా, నేపాల్, గ్రీస్, మాంటెనెగ్రో, స్పెయిన్, ఇంకా ఈసిఐ , భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, రాయబారులు/హైకమిషనర్లు , ఇతర దౌత్య కార్యాలయాల సభ్యులు ఈ రెండు రోజుల సదస్సుకు హాజరవుతున్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004NXWU.jpg

ఇ ఎం బిల ఉత్తమ చొరవ లను ఆవ్విష్కరిస్తూ, ఓటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కోసం సహకారం , భాగస్వామ్యాలు' అనే ఇతివృత్తంపై ఈసిఐ మ్యాగజైన్ "వాయిస్ ఇంటర్నేషనల్" తాజా ఎడిషన్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.

 

  1. https://eci.gov.in/files/file/14519-eci-to-host-a-two-day-international-conference-on-%E2%80%98role-framework-capacity-of-embs%E2%80%99-as-the-lead-for-the-cohort-on-%E2%80%98election-integrity%E2%80%99-as-a-follow-on-to-the-summit-for-democracy%E2%80%9D/
  2. https://eci.gov.in/ic/democracy-cohort-2022/

****


(Release ID: 1872503)