రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలి; భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడంలో పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో క్రియాశీల ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కీలకం: డెఫ్ ఎక్స్పో 2022 సందర్భంగా డీ ఆర్ డీ ఓ సెమినార్‌లో రక్షా మంత్రి


ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకోవాలని మరియు సాయుధ బలగాలను ఆధునీకరించడం ద్వారా దేశ నిర్మాణానికి సహకరించాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రైవేట్ రంగానికి ఉద్బోధించారు

Posted On: 20 OCT 2022 1:21PM by PIB Hyderabad

భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతున్న వర్తమాన ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా కొత్త లక్ష్యాలను నిర్దేశించాలి పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో క్రియాశీల ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కీలకం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన సంసిద్ధతను సాధించే మార్గం. అక్టోబర్ 20, 2022న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 12వ డిఫెక్స్‌పోలో భాగంగా  'రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో ‘ఆత్మనిర్భర్త  - పరస్పర ప్రయోజన విధానం ’ అనే అంశంపై  డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిర్వహించిన సెమినార్  లో ప్రసంగిస్తూ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు.

 

భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి రక్షణలో కీలకమైన ‘ఆత్మనిర్భర్త’ సాధించడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక విధాన సంస్కరణలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉటంకించారు. డిఫెక్స్‌పోలో 2022 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన 101 అనుకూల స్వదేశీీకరణ జాబితా యొక్క నాల్గవ ప్రకటన గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు, ఇప్పుడు 400 పైగా రక్షణ వస్తువులను దేశీయ విక్రేతల నుండి సేకరించడం చాలా గర్వకారణంగా పేర్కొన్నారు.

 

రక్షణ శాఖ పరిశోధన మరియు అభివృద్ధి రంగం  బడ్జెట్‌లో నాలుగింట ఒక వంతు పరిశ్రమ నేతృత్వంలోని ఆర్ అండ్ డి కి అంకితం చేయాలనే నిర్ణయం గురించి కూడా రక్షణ మంత్రి మాట్లాడుతూ, బలమైన స్వావలంబన కలిగిన రక్షణ పరిశ్రమకు పునాది వేసిన అనేక అంశాలలో ఇవి కొన్ని మాత్రమేనని చెప్పారు.  ప్రయివేటు రంగం చురుకైన భాగస్వామ్యంతో, దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి తాజా ఆయుధాలు/పరికరాలతో సాయుధ దళాలు మెరుగ్గా సిద్ధంగా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

“దేశ రక్షణలో ఆర్ అండ్ డి  స్వావలంబన స్వయం సమృద్ది  వైపు ప్రయాణాన్ని ప్రారంభించింది. మనల్ని గమ్యస్థానానికి చేర్చడంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు రెండూ చక్రాలు, దీనితో ఆర్ అండ్ డి వాహనం పూర్తి స్వావలంబన దిశగా పయనిస్తుంది. ప్రభుత్వం మరియు పరిశ్రమల సహకార ప్రయత్నాలతో, ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ అనే ప్రధాన మంత్రి దార్శనికతను మేము సాకారం చేస్తాము” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

 

భారతదేశ మిషన్ ‘ఆత్మనిర్భర్త’కు ఆజ్యం పోసే దిశగా పరిశ్రమ, విద్యాసంస్థలు మరియు రక్షణ ఆర్ అండ్ డి ప్రయత్నాలను సమన్వయం చేయడంలో డీ ఆర్ డీ ఓ పోషించిన కీలక పాత్రను కూడా రక్షణ మంత్రి ప్రశంసించారు. వివిధ  విశిష్ట  భావికాల ఆవిష్కరణలు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా సాయుధ దళాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహకారం అందించినందుకు ఆయన డీ ఆర్ డీ ఓ ను ప్రశంసించారు. రక్షణ ఆర్ అండ్ డి కోసం సంస్థ ఇకపై ఏకైక సర్వీస్ ప్రొవైడర్ కాదని, అంతర్గత ఆర్ అండ్ డి మరియు ప్రైవేట్ రంగానికి సహకరి గా మారిందని ఆయన తెలిపారు.

 

ఈ సందర్భంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 'డేర్ టు డ్రీమ్ 3' విజేతలను సత్కరించారు మరియు భారతీయ వైజ్ఞానిక సంఘం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 'డేర్ టు డ్రీమ్ 4' పోటీని ప్రారంభించారు. డేర్-టు-డ్రీమ్ 3 విజేతలను ఆయన అభినందించారు మరియు ఈ పోటీ వ్యక్తులు మరియు స్టార్టప్‌లలో కొత్త ఆలోచనలు మరియు వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని అన్నారు.

 

డీ ఆర్ డీ ఓ-పరిశ్రమ-విద్యా సంస్థ - సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (DIA-CoEs) ఏర్పాటు కోసం విద్యాసంస్థలు మరియు నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ (NIIO), ఇండియన్ నేవీతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడానికి కూడా రక్షా మంత్రి అధ్యక్షత వహించారు. విద్యాసంస్థలలో ఐఐటీ  రూర్కీ, ఐఐటీ జోధ్‌పూర్, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీ హెచ్ యూ మరియు భారతీయ విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ కేంద్రాలు భవిష్యత్ సాంకేతికతలకు పునాది నిర్మాణలుగా గుర్తించబడిన అంశాలలో దేశానికి పరిశోధనా కేంద్రాలుగా పనిచేస్తాయి. విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలు రక్షణలో అధునాతన పరిశోధనల కోసం దృష్టి కేంద్రీకరించబడిన రంగాలలో పనిని ప్రారంభిస్తాయి. ప్రస్తుత అవసరాలను పరిష్కరించడానికి మరియు భవిష్యత్ సాంకేతికతలకు పునాదులు వేయడానికి దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక పరిశోధన అభివృద్ధి సమతుల్యం చేయబడతాయి.

 

అదనంగా, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) యొక్క రోటరీ వింగ్ రీసెర్చ్ & డిజైన్ సెంటర్ విభాగం మరియు అకార్డ్ సిస్టమ్స్ మరియు సాఫ్ట్‌వేర్‌లకు డిజైన్ సంస్థాగత ఆమోదం సర్టిఫికేట్‌లు లభించాయి. మానవ విశ్వసనీయత అంశాలు మరియు మానవ విశ్వసనీయత  అంచనాల మదింపు పై మార్గదర్శకాలను  రక్షణ పరిశోధనా అభివృద్ధి రంగం ఆవరణ వ్యవస్థలోని  లబ్దిదారుల ప్రయోజనం కోసం రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ విడుదల చేశారు. డీ ఆర్ డీ ఓ మాజీ శాస్త్రవేత్తలు రచించిన రెండు మోనోగ్రాఫ్‌లను కూడా రక్షణ శాఖ సహాయ మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్ స్కీమ్ సర్టిఫికెట్లను అందజేశారు.

 

‘డీ ఆర్ డీ ఓ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (2014-2022)  8 సంవత్సరాల ప్రధాన విజయాల సంకలనం’ అనే పుస్తకాన్ని కూడా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ పుస్తకంలో ప్రధాన లాంచ్‌లు, ఫ్లైట్ ట్రయల్స్, టీ ఓ టీ లు, డీ ఆర్ డీ ఓ-ఇండస్ట్రీ-అకాడెమియా భాగస్వామ్యం   డీ ఆర్ డీ ఓ యొక్క వివిధ విజయాలు మొదలైన వాటి గురించి క్లుప్తంగా వివరించే వ్యాసాలు ఉన్నాయి.

 

రెండవ సెషన్‌కు సెక్రటరీ డిడిఆర్ అండ్ డి డాక్టర్ సమీర్ వి కామత్ అధ్యక్షత వహించారు, ఇందులో డిఫెన్స్ ఆర్ అండ్ డి యొక్క అన్ని లబ్ధిదారులచే ప్రదర్శనలు జరిగాయి. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి ఈ చర్చలకు అధ్యక్షత వహించారు. సెమినార్‌లో సీనియర్ విశిష్ట సేవా అధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, ఐఐటీ డైరెక్టర్లు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, డీ ఆర్ డీ ఓ శాస్త్రవేత్తలు మరియు ఇతరులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1869587) Visitor Counter : 132


Read this release in: English , Urdu , Hindi