పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిషిద్ధ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లు, గాలి నాణ్యత నిర్వహణకు పర్యావరణ ప్రత్యామ్నాయాలపై స్టార్టప్ సదస్సు


నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాల లభ్యత చాలా ముఖ్యమైనది; శ్రీ అశ్విని కుమార్ చౌబే

స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను అందించడమే కాకుండా
దేశ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నారు: శ్రీ చౌబే

Posted On: 27 SEP 2022 4:23PM by PIB Hyderabad

నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, గాలి నాణ్యత నిర్వహణకు పర్యావరణ ప్రత్యామ్నాయాలపై పనిచేస్తున్న స్టార్టప్‌లు, ఇన్నోవేటర్ల కాన్ఫరెన్స్‌ను సెప్టెంబర్ 27న చెన్నైలోని చెన్నై ట్రేడ్ సెంటర్‌లో పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు, వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్ర పర్యావరణ, వాతావరణ మార్పు, యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి శ్రీ శివ వి మెయ్యనాథన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టార్టప్ కాన్ఫరెన్స్‌ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాయి.

 

  

నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు పర్యావరణ ప్రత్యామ్నాయాల అభివృద్ధితో సహా అనేక పర్యావరణ సవాళ్లకు పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు పాలుపంచుకున్నారు.

నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాల లభ్యత చాలా ముఖ్యమైనదని పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రధానంగా ప్రస్తావించారు. 

స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు ఈ సవాలును స్వీకరించారు మరియు పర్యావరణ ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేశారు. ఒక అంకుర సంస్థ బియ్యం పొట్టు నుండి ప్యాకేజింగ్ మెటీరియల్‌ని తయారు చేసింది. ఈ ఆవిష్కరణ ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడమే కాకుండా వరి పొట్టును కాల్చడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మరో స్టార్టప్ సముద్రపు కలుపు మొక్కల నుండి సౌకర్యవంతమైన ప్యాకేజింగ్ మెటీరియల్‌ని అభివృద్ధి చేసింది. స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లు పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను అందించడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నాయని ఆయన అన్నారు. స్టార్టప్ ఇండియా మిషన్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంపై భారత ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలు, గాలి నాణ్యత నిర్వహణలో పని చేస్తున్న దేశవ్యాప్తంగా అనేక స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు స్టార్టప్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు. ఇన్నోవేషన్‌లు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, తయారీదారుల కోసం ఆర్థిక సమీకరణలో కీలకమైన బ్యాంకులకు మద్దతు ఇస్తున్న సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఎక్స్‌పోలో పాల్గొంటున్నారు. స్టార్టప్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

స్టార్టప్‌ల కాన్ఫరెన్స్ ఆవిష్కర్తలు, సంస్థలు, దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలకు మద్దతిచ్చే ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల మధ్య సానుకూలమైన ఏర్పాటు, అభిప్రాయాల మార్పిడికి వేదికను అందిస్తుంది, ఆవిష్కరణలను పెంచడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం కోసం తీసుకున్న చర్యలపై. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లకు ప్రత్యామ్నాయాల రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లు, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న స్టార్టప్‌ల అనుభవాన్ని పంచుకునే సెషన్‌లు  కాన్ఫరెన్స్ లో జరుగుతాయి. .

స్టార్టప్‌లను పెంచడంలో ఆర్థిక సంస్థల పాత్రపై ప్రత్యేక సెషన్‌ను స్టార్టప్ ఇండియా మిషన్, బ్యాంకులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఏర్పాటు చేశారు. నిర్వహణలో లేని, చెత్తాచెదారంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను విషయంలో ఒక పరిష్కారం చూపడానికి ప్రభుత్వం కొన్ని వ్యూహాలను అవలంభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు.. ఎక్కువ చెత్తను సేకరించే సామర్థ్యం, తక్కువ ప్రయోజనం ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై ఉత్పత్తిదారు బాధ్యతను పెంచడం ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.

****


(Release ID: 1862724)
Read this release in: English , Urdu , Hindi