గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పట్టణ స్వచ్ఛత కోసం యువత పెద్దఎత్తున సమీకరణ


చెత్త రహిత నగరాల కోసం ర్యాలీ చేయడానికి 5,00,000 మందికి పైగా యువత మొట్టమొదటి భారతీయ స్వచ్ఛతా లీగ్‌లో చేరారు

Posted On: 19 SEP 2022 7:43PM by PIB Hyderabad

నగరాలను చెత్త రహితంగా మార్చే దిశగా స్వచ్ఛ-భారత్-మిషన్-అర్బన్ చేస్తున్న ప్రయత్నాలు కొత్త ఊపును అందుకుంటున్నాయి.   కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించిన, ఎస్.బి.ఎం-అర్బన్ 2.0 యొక్క తొలి ఎడిషన్ 'భారతీయ-స్వచ్ఛతా-లీగ్' శుభ్రమైన, పచ్చని, చెత్త రహిత నగరాలను రూపొందించే లక్ష్యం దిశగా, దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువ విద్యార్థులు, స్వచ్చంద కార్యకర్తలు, యువనాయకులు, ప్రముఖులను సమీకరించింది.    2022 సెప్టెంబర్, 17 వ తేదీ, సేవా దివాస్ నుంచి 2022 అక్టోబర్, 2 వ తేదీ గాంధీ జయంతి వరకు పక్షం రోజుల పాటు కొనసాగుతున్న 'స్వచ్ఛ-అమృత్-మహోత్సవ్' వేడుకల్లో భాగంగా, చెత్త లేని బీచ్‌ లు, కొండలు, పర్యాటక ప్రదేశాల కోసం ర్యాలీ నిర్వహించడానికి, 1,800 కు పైగా నగరాల నుండి యువత శక్తిని,  ఈ ఇంటర్-సిటీ, లీగ్ ఆధారిత స్వచ్ఛతా ఛాలెంజ్ విజయవంతంగా వినియోగించుకుంది.

 

 

వివిధ సృజనాత్మకమైన,  అద్వితీయమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నగర బృందాలు స్వచ్ఛత పట్ల తమ అభిరుచిని ప్రదర్శించాయి.   పంజాబ్‌ లోని లూథియానా, మహారాష్ట్ర లోని పన్వేల్ మరియు పూణే, అస్సాం లోని పాత్సాలా, ఛత్తీస్‌ గఢ్‌ లోని బిలాస్‌పూర్‌ ల నుంచి నగరాల జట్లు;  యువత తో సైకిల్ ర్యాలీలు నిర్వహించడం ద్వారా పరిశుభ్రత మరియు ఆరోగ్యం రెండింటి గురించి ప్రచారం చేశాయి. 

 

 

భోపాల్, మధ్యప్రదేశ్, చండీగఢ్‌ లోని యువజన బృందాలు చెత్త ను వేరు చేయడం గురించి సందేశాన్ని అత్యంత ప్రత్యేకమైన పద్ధతిలో వ్యాప్తి చేశాయి.  టీమ్ బేమిశాల్ భోపాల్ కు చెందిన దాదాపు 5,000 మంది యువ విద్యార్థులు మెరుగైన వ్యర్థాల నిర్వహణ కోసం ఆరు-చెత్త బుట్టల వ్యవస్థ గురించి అవగాహన కల్పించడం కోసం మానవ హారాన్ని ఏర్పాటు చేశారు.  కాగా, టీమ్ చండీగఢ్ ఛాలెంజర్సు కు చెందిన 2,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు నాలుగు చెత్త బుట్టల వ్యవస్థ గురించి అవగాహన కల్పించడం కోసం ప్రదర్శనలు నిర్వహించారు. 

 

 

ఈ యువ బృందాలు సంయుక్తంగా సముద్రతీరాలను శుభ్రపరిచే కార్యక్రమాలను కూడా చేపట్టాయి.   మహారాష్ట్ర లోని గ్రేటర్ ముంబై లో దాదాపు 4,000 మంది కార్యకర్తలు 50 కిలోమీటర్లకు పైగా దూరం నడిచి,  8 ప్రముఖ ప్రదేశాలలో విస్తరించి ఉన్న 49 సముద్రతీరాల నుండి ముప్పై టన్నుల వ్యర్థాలను సేకరించారు.   పూరి మరియు కేరళ నుండి వచ్చిన బృందాలు పరిశుభ్రమైన ప్లాస్టిక్ రహిత సముద్రతీరాలపై అవగాహన కల్పించడానికి ఇసుకతో కళాకృతులను సృష్టించాయి.    టీమ్ మంగళూరు స్వచ్ఛతా సైనికులు 11 వేర్వేరు సముద్రతీరాలు శుభ్రం చేయడానికి 5,000 మంది చురుకైన యువకులను మోహరించారు.  తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన యువత, కేంద్ర పాలిత ప్రాంతమైన పోర్ట్ బ్లెయిర్ కు చెందిన టీమ్ ప్రిస్టీన్ పోర్ట్ బ్లెయిర్ సభ్యులు కూడా భారతీయ స్వచ్ఛతా లీగ్ తొలి ఎడిషన్‌ లో చురుకుగా పాల్గొన్నారు.

 

 

లక్షలాది మంది యువత పరిశుభ్రమైనచెత్త లేని పర్వత ప్రాంతాల కోసం శ్రమించారు.   జమ్మూ-కశ్మీర్‌ లోని గందర్‌ బల్, పహల్గామ్, అనంత్‌ నాగ్, దూరువేరి నాగ్, బిజ్‌-బెహరా వంటి పలు నగరాల్లో స్వచ్ఛత గురించి అవగాహన కల్పించడానికి వేలాది మంది పౌరులతో ర్యాలీలు జరిగాయి.   ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, త్రిపుర, అస్సాం, సిక్కిం, నాగాలాండ్‌ లలో యువశక్తి భారతీయ స్వచ్ఛతా-లీగ్ చుట్టూ జాతీయ ఉత్సాహం వెల్లివిరిసింది. 

 

 

భారతదేశ వ్యాప్తంగా ఈ బృందాలు సామూహిక చెత్త ఏరివేత, పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాయి.  లక్షలాది మంది యువకులు తమ నగరంలోని బృందాలకు మద్దతుగా నిలిచారు.  జార్ఖండ్‌కు చెందిన జమేషెడ్‌పూర్ జాగ్వార్స్ జట్టు, ఒడిశాకు చెందిన టీమ్ పారాదీప్ టైటాన్స్, తమిళనాడుకు చెందిన టీమ్ కోయంబత్తూరు, టీమ్ రామేశ్వరం, తెలంగాణా కు చెందిన టీమ్ సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్ నుంచి టీమ్ స్వచ్ఛ విశాఖ వారియర్స్ ఐ.ఎస్.ఎల్. కి విశేషమైన కృషిని అందించాయి.

 

 

యువకుల నేతృత్వంలో జరిగిన ఈ పోటీలో ఉత్తమ జట్లను జాతీయ ఖ్యాతి ఉన్న జ్యూరీ సభ్యులతో కూడిన స్వతంత్ర ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు.  ఈ పోటీల పాల్గొనే బృందాల స్థాయి, కార్యాచరణ ప్రత్యేకత, పరిశుభ్రత కార్యక్రమాల ప్రభావం ఆధారంగా, విజేతలఎంపిక జరుగుతుంది.  పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతల క్షేత్ర స్థాయి అమలు పై ప్రచార ప్రభావం ఆధారంగా యువత మరింత దృష్టి సారించే భాగస్వామ్యాన్ని ఈ మిషన్ ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు.

 

 

*****



(Release ID: 1860766) Visitor Counter : 91


Read this release in: English , Urdu , Hindi