కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్య సదుపాయాలు

Posted On: 04 AUG 2022 3:44PM by PIB Hyderabad

ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) లబ్దిదారుల సంఖ్య పెరుగుతున్నందున వైద్య ప్రయోజనాలను అందించడానికిఈఎస్ఐ కార్పొరేషన్76 కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 160 ఈఎస్‌ఐ ఆసుపత్రులున్నాయి.

అదనంగాఈఎస్ఐ ఆసుపత్రి లేదా నిర్దిష్ట ఆసుపత్రిలో అంతర్గత వైద్య సేవలు అందుబాటులో లేనట్లయితేలబ్ధిదారులకు నగదు రహిత ఇన్-పేషెంట్ వైద్య సేవలను అందించడానికి ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.

దేశంలోని ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అందుబాటులోని ఆసుపత్రుల ద్వారా ఈఎస్ఐ లబ్ధిదారులకు ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ వైద్య సేవలను అందించడానికి ఈఎస్ఐ కార్పొరేషన్ ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY)తో కూడా సహకరించింది.

ఈఎస్ఐ ఆసుపత్రులు మందులుసర్జరీస్త్రీ ప్రసూతిఆర్థోపెడిక్స్పీడియాట్రిక్స్ మొదలైన వివిధ విభాగాలలో సెకండరీ కేర్ వైద్య సేవలను అందిస్తాయి. ఆసుపత్రులలో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఈఎస్ఐ కార్పొరేషన్ అనేక చర్యలు తీసుకుందిఅవి:

  • ఈఎస్ఐసీ ఆసుపత్రులకు మంజూరైన సిబ్బంది సంఖ్యను పెంచడం.
  • వరుసగా గత మూడు సంవత్సరాలుగా ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ 70% కంటే ఎక్కువగా ఉంటే50% బెడ్ల పెంపుదల.
  • రాష్ట్ర ఈఎస్ఐ సొసైటీల ఏర్పాటుతద్వారా రాష్ట్రాలు వైద్య సేవల మెరుగుదలకు నిర్ణయం తీసుకునే ఆర్థిక మరియు పరిపాలనా స్వేచ్ఛను కలిగి ఉంటాయి.

·         రాష్ట్ర ఈఎస్ఐ పథకాల కోసం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ (PIP) కింద అదనపు బడ్జెట్ కేటాయింపు.

·         ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.200/- సీలింగ్‌కు పైబడి అందజేస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఈఎస్ఐసీ ఆసుపత్రులలో బెడ్ ఆక్యుపెన్సీ 70% కంటే ఎక్కువగా ఉంది.

ఈ విషయాన్ని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

******

 

(Release ID: 1848830)
Read this release in: English , Urdu