ఆర్థిక మంత్రిత్వ శాఖ

బెంగళూరు, హైదరాబాద్‌లోని రెండు స్థిరాస్తి గ్రూపులపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 11 JUL 2022 7:43PM by PIB Hyderabad

బెంగుళూరు,  హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూపులపై ఆదాయపు పన్ను శాఖ  సోదాలు మ‌రియు  జ‌ప్తు  కార్యకలాపాలను నిర్వహించింది, వాణిజ్య/నివాస స్థలాల నిర్మాణం/అమ్మకం/ అద్దె మరియు విద్యా, ఆతిథ్య సేవల వ్యాపారంలో గ్రూపు నిమగ్నమై ఉంది. బెంగుళూరు, హైదరాబాద్ మరియు చెన్నైలో ఉన్న  40 కి పైగా ప్రాంగణాలలో ఐటీ శాఖ సోదాలు జ‌రిగాయి. సోదాల సందర్భంగా పలు నేరారోపణ పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సాక్ష్యాల ప్రాథమిక విశ్లేషణలో భూ యజమానులు బెంగళూరుకు చెందిన డెవలపర్‌తో జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కుదుర్చుకున్నట్టుగా తేలింది. వివిధ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం డెవలపర్‌కు ఇచ్చిన భూమికి బదులు వారు డెవలపర్ నుండి సూపర్ బిల్ట్-అప్ ఏరియాను పొందారు. అయితే, ప్రాజెక్ట్‌ల పూర్తి ధ్రువీకరణ పత్రాలు పొందినప్పటికీ, లావాదేవీ ద్వారా వచ్చిన మూలధన లాభాలను ప్రకటించడంలో భూ యజమానులు విఫలమయ్యారు. ఇలా వెల్లడించని మూలధన లాభాల మొత్తం రూ. రూ.400 కోట్ల కంటే ఎక్కువ‌గా అంచ‌నావేయ‌డ‌మైంది.  స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రాథమిక విశ్లేషణలో కూడా
ఈ గ్రూపులు రియల్ ఎస్టేట్ రంగంలో యూనిట్ల విక్రయం ద్వారా రూ.90 కోట్ల  మేర గుర్తించదగిన ఆదాయాన్ని త‌క్కువ చేసి చూపిన‌ట్టుగా తేలింది. ఇంకా, రెండు గ్రూపులు నిర్మాణ మరియు అభివృద్ధి వ్యాపారంలో ఖర్చుల ద్రవ్యోల్బణం ద్వారా రూ.28 కోట్ల మేర పన్ను-ఎగవేతలు చేసిన‌ట్టుగా తేలింది. బోగస్ కొనుగోళ్లను క్లెయిమ్ చేయ‌డం నిర్మాణ సామగ్రి కోసం ఓవర్ ఇన్‌వాయిస్‌కు సృష్టించ‌డం వంటి చేసిన‌ట్టుగా తేలింది. వడ్డీతో కూడిన రుణం తీసుకున్న నిధులను రెండు గ్రూపులకు చెందిన ప్రధాన సంస్థలు వ్యాపారేతర ప్రయోజనాల కోసం సంబంధిత సంస్థలు/పార్టీలకు మళ్లించినట్లు కూడా ఆదాయ‌పు ప‌న్ను శాఖ చేసిన సోదాల‌లో కనుగొనబడింది. గ్రూప్ కంపెనీల మధ్య అడ్వాన్స్‌లు/రుణాలతో కూడిన లావాదేవీల దాఖ‌లాలు కూడా కనుగొనబడ్డాయి, ఇవి డీమ్డ్ డివిడెండ్ పాత్రను కలిగి ఉంటాయి.ఆదాయంగా పన్ను విధించబడతాయి. ఈ సోదాల‌లోపి చర్యలో కవర్ చేయబడిన ట్రస్ట్ విషయంలో, ట్రస్ట్ పేర్కొన్న అనుమతించదగిన సమయ పరిమితిలోపు సేకరించిన‌ రూ.40  రిజిస్టర్డ్ ట్రస్ట్ డీడ్ ల‌క్ష్యాల మేర‌కు  ప్రకారం సొమ్మును వ్య‌యం చేయ‌లేద‌ని తేలింది.  ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ.3.50 కోట్ల నగదు, రూ.18.50 కోట్ల బంగారు, వెండి, నగలు స్వాధీనం చేసుకున్నారు.  తదుపరి విచారణలు కొన‌సాగుతోంది.
                                                               

****



(Release ID: 1840837) Visitor Counter : 191


Read this release in: English , Urdu , Hindi