కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ప్రపంచ టెలికమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ సొసైటీ డే (డబ్ల్యూటీఐఎస్డీ ) 2022 పాటించటానికి గుర్తుగా "ఐఓటీ/ఎం2ఎం కోసం సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ (సీఓఐ)”పేరుతో సీడాట్ వెబ్‌నార్‌ను నిర్వహించింది.


స్టార్టప్/సొల్యూషన్ ప్రొవైడర్లను గ్లోబల్ సొల్యూషన్ ప్రొవైడర్లుగా మార్చడంలో సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ (సీఓఐ) మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Posted On: 17 MAY 2022 5:47PM by PIB Hyderabad

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్), భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్  ప్రీమియర్ టెలికాం రీసెర్చ్&డెవలప్మెంట్ సెంటర్, 17 మే 2022న “సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ (సీఓఐ) ఫర్ ఐఓటీ/ఎం2ఎం” పేరుతో వెబ్‌నార్‌ను నిర్వహించింది. "వరల్డ్ టెలికమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ సొసైటీ డే’’ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.   ప్రపంచ టెలికమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ సొసైటీ డే -2022 " ఆరోగ్యకరమైన వృద్ధుల కోసం డిజిటల్ సాంకేతికతలు" అనే థీమ్‌పై కేంద్రీకృతమై ఉంది. టెలికమ్యూనికేషన్  ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీలు (ఐసీటీలు) ప్రజలు ఆరోగ్యంగా, అనుసంధానంగా  స్వతంత్రంగా ఉండేందుకు - భౌతికంగా, మానసికంగా,  ఆర్థికంగా  బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆర్థిక  ఆరోగ్య వ్యవస్థలు స్థిరంగా ఉండేలా చూస్తున్నాయి. మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్స్ (ఎం2ఎం)/ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి నవ సాంకేతిక ఆవిష్కరణలు మన జీవితాలను సులభతరం చేస్తున్నాయి. సౌకర్యవంతంగా  సురక్షితంగా మార్చుతున్నాయి. ప్రపంచ టెలికమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ సొసైటీ డే -2022 వెబ్‌నార్ సంబంధిత వాటాదారుల సహకారంతో స్వదేశీ ఎం2ఎం/ఐఓటీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో “ఐఓటీ/ఎం2ఎం కోసం సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్” పాత్రపై దృష్టి సారించింది  పరిశ్రమ, స్టార్టప్‌లు, విద్యాసంస్థలు, టెలికాం కంపెనీల  సోదరభావాన్ని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతిక ఆవిష్కరణలతో డిజిటల్ పరివర్తనకు సహకరించేలా చేస్తోంది.

స్మార్ట్ సిటీల కోసం డిజిటల్ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌ను రూపొందించడంలో ఐఓటీ/ఎం2ఎం  కీలక పాత్రను వెబ్‌నార్ మరింత స్పష్టంగా తెలియజేసింది.  వృద్ధులు,  ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తులతో సహా అందరికీ ఆరోగ్యకరమైన & స్థిరమైన వాతావరణం ఉండాలని కోరుకుంటున్నది.  కార్యక్రమానికి ఎ.కె. తివారీ, సభ్యుడు (టెక్నాలజీ), కేంద్ర డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్  సభ్యుడు (సేవలు) నిజాముల్ హక్ హాజరయ్యారు.   ఎ.కె. తివారీ తన ప్రధాన ప్రసంగంలో మాట్లాడుతూ సాంకేతిక ఆవిష్కరణ,  విస్తరణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో రీసెర్చ్&డెవలప్మెంట్, ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు  స్టార్టప్‌లతో సహా సంబంధిత వాటాదారుల మధ్య సహకార  ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. విభిన్న అప్లికేషన్ల కోసం ప్రమాణాల ఆధారిత ఐఓటీ/ఎం2ఎం సొల్యూషన్‌ల స్వదేశీ అభివృద్ధికి "సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్" సమర్థవంతమైన వేదికని ఆయన వ్యాఖ్యానించారు.  అనంతరం నిజాముల్ హక్ మాట్లాడుతూ  అంతర్లీన సమస్యలను,  సవాళ్లను త్వరితగతిన  సమర్ధవంతంగా పరిష్కరించడానికి "సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్"  చొరవ కింద రూపొందించబడిన సహకార ఫ్రేమ్‌వర్క్  చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. స్వదేశీ ఐఓటీ/ఎం2ఎం పర్యావరణ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడంలో సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ పాత్రపై ప్యానెల్ చర్చ సందర్భంగా ప్రముఖ డొమైన్ నిపుణులు ఐఓటీ/ఎం2ఎం  అభివృద్ధి చెందుతున్న రంగంలో ఇటీవలి పురోగతి  ఇప్పటికే ఉన్న సవాళ్లపై లోతైన సమాచారాన్ని అందించారు. ప్యానలిస్ట్‌లు ఐఓటీ/ఎం2ఎం ల్యాండ్‌స్కేప్‌కు సంబంధించిన వివిధ సమకాలీన థీమ్‌లపై చర్చించారు. ప్యానెల్ చర్చలో సుశీల్ కుమార్, డీడీజీ (ఐఓటీ), టీఈసీ, డాక్టర్. ఇందర్ గోపాల్, ప్రొఫెసర్, ఐఐఎస్సీ, బెంగళూరు,  పమేలా కుమార్, డీజీ, టీఎస్డీఎస్ఐ, ఉమాకాంత్ సోని, సహ వ్యవస్థాపకుడు & సీఈఓ, ఏఆర్టీపీఏఆర్కే ప్రసాద్ పరుశరామన్, సీఈఓ, పైరోక్స్, ఐసిటీ, భూషణ్ సేథీ, ఐఓటీ ఉత్పత్తులు  పరిష్కారాలు, వొడాఫోన్ ఐడియా డాక్టర్ మంజునాథ్ అయ్యర్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్, విప్రో, డాక్టర్ సుబ్రత్ కర్, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ పాల్గొన్నారు. సీడాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్, ప్రపంచ టెలికమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ సొసైటీ డే  2022లో టెలికాం సెక్టార్కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. రీసెర్చ్&డెవలప్మెంట్, విద్యాసంస్థలు  పరిశ్రమలతో సహా అన్ని వాటాదారుల సహకారంతో దేశీయ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సీడాట్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. స్టార్టప్‌లు. అతను ప్రామాణికమైన, సురక్షితమైన  తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాల  స్వదేశీ అభివృద్ధికి సినర్జిస్టిక్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించడంలో సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్  కీలక పాత్రను వివరించారు. ఎం2ఎం ప్రమాణాలు, సీడాట్ స్టాండర్డ్ ఆధారిత ఎం2ఎం ప్లాట్‌ఫారమ్‌లో సీడాట్ ప్రధాన పాత్రపై సీడాట్ డైరెక్టర్ శిఖా శ్రీవాస్తవ వివరణాత్మక ప్రసంగాన్ని అందించారు  ఐఓటీ/ఎం2ఎం కోసం రాబోయే సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ (సీఓఐ)ని పరిశ్రమకు పరిచయం చేశారు. దేశంలో ప్రమాణాల ఆధారిత ఎం2ఎం సొల్యూషన్లను మోహరించడంపై చర్చించారు.

 

సీడాట్ డైరెక్టర్   డేనియల్ జెబరాజ్ ముగింపు ప్రసంగాన్ని అందించారు  వారి సందేశాత్మక ప్రసంగాలకు అతిథులు  వక్తలకు ధన్యవాదాలు తెలిపారు.



(Release ID: 1826574) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Hindi