యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మథియాస్ బోను బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్గా తిరిగి నియమించుకోవడానికి టాప్స్ ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది; ఆసియా ఛాంపియన్షిప్లలో పాల్గొనేందుకు షట్లర్లకు కూడా మద్దతు అందించబడింది.
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2022 3:40PM by PIB Hyderabad
ఆసియా క్రీడలు మరియు కామన్వెల్త్ క్రీడల సన్నాహాలను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా భారత డబుల్స్ కోచ్గా మథియాస్ బోను తిరిగి నియమించుకోవడానికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) నెలకు రూ. 7 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. ఆయన ప్రత్యేకంగా పురుషుల డబుల్స్ జంట సాత్విక్ మరియు చిరాగ్ శెట్టి మరియు డబుల్స్ జట్టులోని ఇతర సభ్యులను కూడా చూసుకుంటారు. బోయ్ నియామకం 2022 ఆసియా క్రీడల వరకు జరిగింది.

ఫిలిప్పీన్స్లో ఏప్రిల్ 26న ప్రారంభం కానున్న ఆసియా ఛాంపియన్షిప్లలో షట్లర్లు పాల్గొనేందుకు సహకరించేందుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్రతిపాదనలు కూడా గురువారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశంలో ఆమోదించబడ్డాయి.
మహిళల సింగిల్స్ క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్, మహిళల డబుల్స్ జంట అశ్విని భట్ మరియు శిఖా గౌతమ్, మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో మరియు ఇషాన్ భట్నాగర్, పురుషుల డబుల్స్ జంట విష్ణువర్ధన్ గౌడ్ పి మరియు కృష్ణ ప్రసాద్తో పాటు అర్జున్ ఎమ్ ఆర్ మరియు ధృవ్ కపిలకు మద్దతు అందించబడింది.
ప్రస్తుతం ప్రపంచ ర్యాంక్లో 52వ స్థానంలో ఉన్న ఆకర్షి కశ్యప్ను కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా గేమ్స్ జట్టులో చేర్చారు. ఈ క్రమంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "ఇది సాధ్యమైనందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను (కామన్వెల్త్ మరియు ఆసియా క్రీడల జట్లలో పేరు పొందడం). ఇది పూర్తిగా నా జట్టు మరియు కోచింగ్ సిబ్బంది నుండి వచ్చిన మద్దతు వల్లనే." అని తెలిపారు.
వచ్చే వారం ఫిలిప్పీన్స్లో జరగనున్న టోర్నమెంట్ మరియు సవాళ్లతో కూడిన ఓపెనింగ్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ, "టాప్స్కి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే వారు చివరి నిమిషంలో సహాయం కోసం నా అభ్యర్థనను అంగీకరించారు. ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2022 గెలిచిన అకానె యమగుచితో మొదటి రౌండ్లో నేను ఆడుతున్నందున అక్కడ నాకు కఠినమైన డ్రా ఉంది. నేను నా వంతు ప్రయత్నం చేస్తాను కానీ నేను ఎక్కువ మ్యాచ్లు ఆడితే, నాకు ఎక్కువ ఎక్స్పోజర్ లభిస్తుంది మరియు ఇవన్నీ పెద్ద కారణానికి సహాయపడతాయి." అని తెలిపారు.
ఆకర్షి ఈ సంవత్సరం ముందున్న సవాళ్లకు సిద్ధమవుతుండగా ఆమె తన రాబోయే పరీక్షలలో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసేలా చూసుకుంటున్నారు. రాబోయే పెద్ద టోర్నమెంట్ల నుండి ఆమె ఆశయాలను వెల్లడిస్తూ బిఏ 3వ సంవత్సరం విద్యార్థి ఇలా అన్నారు "నేను అంతర్జాతీయ సర్క్యూట్లో చాలా టోర్నమెంట్లు ఆడినందుకు గర్వపడుతున్నాను మరియు నాకు చాలా అవసరమైన ఎక్స్పోజర్ ఉంది. నేను కామన్వెల్త్ గేమ్స్ నుండి భారతదేశానికి పతకాన్ని సాధించగలనని నేను భావిస్తున్నాను మరియు ఆసియన్ గేమ్స్లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నాను " అని చెప్పారు.
ప్రస్తుత కోచ్ పార్క్ టే సాంగ్ స్థానంలో ఫిలిప్పీన్స్లో జరిగే ఆసియా ఛాంపియన్షిప్లో క్రీడాకారిణితో పాటు వచ్చే విధి చౌదరికి సహాయం అందించాలని ఒలింపిక్స్ డబుల్ పతక విజేత పివి సింధు చేసిన అభ్యర్థనను టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అంగీకరించింది. కొరియా కోచ్ ప్రస్తుతం మే వరకు వార్షిక సెలవులో ఉన్నారు. ఎన్ఐఎస్ క్వాలిఫైడ్ కోచ్ చౌదరి సుచిత్ర అకాడమీ హైదరాబాద్లో సింధుకు శిక్షణ ఇస్తున్నారు.
*******
(రిలీజ్ ఐడి: 1819183)
సందర్శకుల సూచీ సంఖ్య : : 214