పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావవంత నిర్వహణ కోసం అవగాహన కార్యక్రమం - గ్రీన్ ఇనిషియేటివ్‌, మస్కట్ 'ప్రకృతి' ని ప్రారంభించిన కేంద్ర పర్యావరణ మంత్రి


సైన్స్ కేవలం అభివృద్ధిని మాత్రమే కాకుండా స్థిరమైన అభివృద్ధిని అందించినప్పుడే ఆదర్శ మార్పును సాధించవచ్చు: శ్రీ భూపేందర్ యాదవ్


"వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను మానవత్వం ఎదుర్కోగలదని భారతదేశం నమ్మకంగా, ఆశావాద సందేశాన్ని పంపుతుంది"


ఏదైనా కొత్త ప్రయత్న విజయవంతం కావాలంటే అది సామూహిక చర్య, బాధ్యత వల్లే సాధ్యం; కేంద్ర సహాయ మంత్రి, శ్రీ అశ్విని కుమార్ చౌబే

Posted On: 05 APR 2022 6:25PM by PIB Hyderabad

మెరుగైన పర్యావరణం కోసం మన జీవనశైలిలో స్థిరంగా అవలంబించగల చిన్న చిన్న మార్పులు మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ హరిత కార్యక్రమాలను ఉద్దేశించి కేంద్ర పర్యావరణ, అటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈరోజు 'ప్రకృతి' అనే మస్కటోను ప్రారంభించారు.  కేంద్ర పర్యావరణం, అటవీవాతావరణ మార్పు సహాయమంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB)  ప్రభుత్వ సీనియర్ అధికారుల సమక్షంలో దేశంలో సమర్థవంతమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (PWM)ని నిర్ధారించడానికి   ప్రజలకు మరింత అవగాహన కల్పించారు

ప్లాస్టిక్ కాలుష్యం సవాలును పరిష్కరించడానికి, 2022 నాటికి ఒకేసారి వాడి పడేసే  ప్లాస్టిక్స్ (SUPs)ని దశలవారీగా నిర్మూలిస్తామన్న భారతదేశం ప్రతిజ్ఞను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పనిలో    ప్రజల క్రియాశీల భాగస్వామ్య ఆవశ్యకతను నొక్కిచెప్పారు, కేంద్ర పర్యావరణ మంత్రి, అటవీవాతావరణ మార్పులతోపాటు 'స్వచ్ఛ భారత్ హరిత్ భారత్, హరిత ప్రతిజ్ఞ'ను సభకు అందించారు. ప్లాస్టిక్ నేడు మనం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన పర్యావరణ సమస్యలలో ఒకటిగా మారింది. భారతదేశం ఏటా 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది   గత ఐదేళ్లలో తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి దాదాపు రెండింతలు పెరిగింది. ప్లాస్టిక్ కాలుష్యం, మన పర్యావరణ వ్యవస్థలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది, ఇది వాయు కాలుష్యంతో కూడా ముడిపడి ఉంటుంది.

 

 

ప్లాస్టిక్ కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు, మంచి భవిష్యత్తు కోసం కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ భూపేందర్ యాదవ్ కోరారు. ఇండియా ప్లాస్టిక్ ఛాలెంజ్-హ్యాకథాన్ 2021లో అంకుర పరిశ్రమల వ్యవస్థాపకులు,   విద్యార్థులు అభివృద్ధి చేసిన వినూత్న పరిష్కారాలను ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లక్ష్యాలకు ప్రపంచాన్ని సమలేఖనం చేయడానికి ఉపశమన చర్యలపై దృష్టి సారించే IPCC ఆరవ అసెస్‌మెంట్ రిపోర్ట్ (AR6) ఇటీవల విడుదల చేసిన IPCC వర్కింగ్ గ్రూప్ III సహకారం గురించి   ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు   మనం ఏమి చేయగలము అనేదాని గురించి ఆయన తెలియజేశారు. పారిస్ ఒప్పందం ద్వారా  వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను మానవాళి ఎదుర్కోగలదని   వాతావరణ మార్పులకు పరిష్కారంలో భాగమవుతుందని భారతదేశం ఆశ   ఆశావాద సందేశాన్ని పంపుతుందని కేంద్ర మంత్రి అన్నారు. అంతకుముందు, నైరోబీలో  ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (PWM)కి సంబంధించిన సమస్యలను సులభతరం చేయడానికి ఉద్దేశించిన ఇ-గవర్నెన్స్ పోర్టల్‌, మొబైల్  అప్లికేషన్ లను ప్రారంభించడంలో తన మంత్రిత్వ శాఖ - MoEFCC కృషినీ,    కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు -CPCB ప్రయత్నాలను కేంద్ర మంత్రి అభినందించారు.

రాష్ట్ర మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే తన ప్రసంగంలో MoEFCC   CPCB ఇ-గవర్నెన్స్ పోర్టల్స్ అయిన EPR పోర్టల్   సింగిల్ యూజ్ ప్లాస్టిక్ -SUP ఫిర్యాదుల కోసం మొబైల్ యాప్ ఈరోజు ప్రారంభించారు, ఇవి పూర్తి దశ  నుంచి బయటపడేలా చేయడంలో చాలా దోహదపడతాయని అన్నారు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను వీడాలని,    మన ప్రధానమంత్రి దృష్టిని సాకారం చేసుకోమని,  ఏ కార్యక్రమమైనా సమిష్టి చర్య   బాధ్యతతోనే విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. 'సబ్‌కాసాత్, సబ్‌కావికాస్'తో ప్రధానమంత్రి నొక్కిచెప్పినట్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని దశలవారీగా నిర్మూలించేందుకు జన భాగస్వామ్యం  ఈ సమయంలో అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం ఈ క్రింది హరిత కార్యక్రమాలు ప్రారంభించారు:

  • కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, రాష్ట్ర/కేంద్ర పాలిత  ప్రభుత్వాలతో సహా అన్ని వాటాదారులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్   ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్మూలనపై ఒకే చోటికి తీసుకురావడానికి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) వ్యర్థాల నిర్మూలన, సమర్థవంతమైన నిర్వహణ కోసం సాధించిన పురోగతి ని ట్రాక్ చేయడానికి నేషనల్ డ్యాష్‌బోర్డ్ (MoEFCC)     
  • ప్లాస్టిక్ ప్యాకేజింగ్ (CPCB) కోసం విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత (EPR) పోర్టల్, జవాబుదారీతనం, ట్రేసబిలిటీ, పారదర్శకత మెరుగుపరచడం   ఉత్పత్తిదారులు , దిగుమతిదారులు   బ్రాండ్-యజమానులు EPR బాధ్యతలకు అనుగుణంగా సులభంగా నివేదించడం.
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (CPCB) కోసం మొబైల్ యాప్ పౌరులకు వారి ప్రాంతంలో వాడిపడేసే ప్లాస్టిక్ విక్రయం/వినియోగం/తయారీని తనిఖీ చేయడానికి   ప్లాస్టిక్ ముప్పు అధిగమించడానికి అధికారం ఇస్తుంది.
  • SUP (CPCB), స్థానిక సంస్థలు, SPCBలు/PCCలు   CPCB కోసం మానిటరింగ్ మాడ్యూల్, జిల్లా స్థాయిలో వాణిజ్య సంస్థల్లో SUP ఉత్పత్తి/అమ్మకంవినియోగం వివరాలను కనుగొనడం   SUPపై నిషేధం అమలు చేయడం.
  • ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన  చేయడానికి మరిన్ని పరిశ్రమలను ప్రోత్సహించడానికి వేస్ట్ ప్లాస్టిక్ (G B Pant NIHE సంస్థ, NRDC)  నుంచి గ్రాఫేన్ పారిశ్రామిక ఉత్పత్తిని ప్రోత్సహించడం

ఈ కార్యక్రమంలో ఇండియా ప్లాస్టిక్ ఛాలెంజ్–హ్యాకథాన్ 2021 విజేతలకు సత్కారం కూడా జరిగింది. త్రీస్టార్ట్-అప్లికేషన్లు/ఆంట్రప్రెన్యూర్స్ కేటగిరీ   ఉన్నత విద్యా సంస్థలకు చెందిన నాలుగు విద్యార్థుల బృందాలకు రూ. 5 లక్షలు చప్పున,     ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం   సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల తొలగింపు కోసం వారి వినూత్న ఆలోచనలు   డిజిటల్ పరిష్కారాల కోసం 1 లక్ష చప్పున నగదు బహుమతులు అందించారు.

తరువాత, CPCB ఉద్యోగుల పిల్లల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్ సెంటర్   డేకేర్ ఫెసిలిటీతో పాటు SUP ప్రత్యామ్నాయాలు, సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఎగ్జిబిషన్ ప్రారంభించారు. CPCB ప్రయోగశాలల సందర్శన   శాస్త్రవేత్తలతో పరస్పర చర్చ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల సంఘాలు, ప్లాస్టిక్ తయారీదారుల సంఘాలు, సిమెంట్ తయారీ దారుల సంఘం, పౌర సమాజం, యువ ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, MoEFCCతో సహా    ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలు   విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు, బోర్డు సభ్యులు సహా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ లో పాల్గొన్నారు. CPCB   రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు,   కాలుష్య నియంత్రణ కమిటీలు,   IROల ఛైర్మన్లు,  మెంబర్ సెక్రటరీల  నుంచి వర్చువల్ భాగస్వామ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

*****



(Release ID: 1814028) Visitor Counter : 563


Read this release in: English , Hindi , Manipuri