గనుల మంత్రిత్వ శాఖ

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిజిగా డాక్టర్ ఎస్ రాజు బాధ్యతలు స్వీకరించారు

Posted On: 01 APR 2022 4:47PM by PIB Hyderabad

  కోల్‌కతాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ ఎస్ రాజు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 31 మార్చి 2022న పదవీ విరమణ పొందిన శ్రీ ఆర్.ఎస్. గర్ఖాల్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పదవిని చేపట్టడానికి ముందు డాక్టర్ రాజు జీఎస్ఐ కేంద్ర కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ మరియు నేషనల్ హెడ్, మిషన్-III & IV పదవిని కలిగి ఉన్నారు.


జీఎస్‌ఐ డీజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  డాక్టర్ రాజు మాట్లాడుతూ "దేశంలో ఖనిజ వనరుల పెంపుదల రంగంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రధాన కార్యక్రమాలపై నిరంతరం దృష్టి కేంద్రీకరించడానికి మరియు మైనింగ్‌తో ఈ రంగంలో సన్నిహిత సంబంధం కలిగిన  పరిశ్రమలు మరియు జాతీయ మరియు అంతర్జాతీయ ఖ్యాతి గల విద్యాసంస్థలతో పరస్పర చర్యలను లక్ష్యంగా చేసుకోవడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉందని'' అన్నారు.  ప్రణాళికాబద్ధమైన మరియు దృష్టి కేంద్రీకరించిన ఆర్&డీ మరియు కార్యాచరణ కార్యకలాపాలకు విశ్లేషణాత్మక సౌకర్యాల అభివృద్ధి మరియు క్షేత్ర కార్యకలాపాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ముఖ్యంగా ఖనిజ అన్వేషణలో మరియు పబ్లిక్ గుడ్ జియోసైన్స్ రంగాలలో జీఎస్ఐ యొక్క స్థిరమైన సేవలను మరియు  దేశ నిర్మాణ ప్రయత్నాలకు నిబద్ధతను నిర్ధారించడానికి కార్యాచరణ-ఆధారిత ఫలితాలను మెరుగైన డెలివరీ కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు.

 

image.png

అడిషనల్ డైరెక్టర్ జనరల్, నేషనల్ హెడ్స్ మిషన్-III & IV గా డాక్టర్. రాజు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ జియోసైంటిఫిక్ ప్రాజెక్ట్‌ల ప్రణాళిక, ప్రోగ్రామింగ్ మరియు అమలును స్టీరింగ్ చేస్తున్నారు. ఆయనప్రసిద్ధ జాతీయ మరియు అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో జియోసైన్స్‌ల యొక్క వివిధ అంశాలపై అనేక ప్రచురణలను చేశారు.


 

****



(Release ID: 1812905) Visitor Counter : 199


Read this release in: English , Urdu , Hindi