సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మెగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్-2022 మొదటి దశ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ముగిసింది.


సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు, సాహిత్య కార్యక్రమాలతో చిరస్మరణీయమైన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం.

సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు సాహిత్య కార్యక్రమాలతో చిరస్మరణీయమైన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని అందించిన సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు, సాహిత్య కార్యక్రమాలతో కనులవిందుగా సాగిన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం.

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2022 6:43PM by PIB Hyderabad

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఫెస్టివల్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం 2022 మొదటి పార్శ్వం, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, రాజమహేంద్రవరం, ఆంధ్ర ప్రదేశ్ లో ఈరోజు ముగిసింది. ఈ ఉత్సవాన్ని 26 మార్చి 2022న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక  డోనర్ శ్రీ జి. కె. రెడ్డి ప్రారంభించారు. ఈ ఉత్సవాన్ని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు.

మార్చి 26  27 తేదీల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో లో రెండు రోజుల పాటు నిర్వహించిన  ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డివై సిఎం శ్రీ ఎం. శ్రీనివాసరావు,   పర్యాటక  సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ఎం. శ్రీనివాసరావు తో పాటుగా  ఇతర ప్రముఖ మంత్రులు , శ్రీ మార్గాని భరత్, MP, రాజమండ్రి; శ్రీ ఎం. మోహన్ బాబు, సినీ నటుడు  మాజీ ఎంపీ; శ్రీమతి జయప్రద, సినీ నటి  మాజీ ఎంపీ;  శ్రీమతి  ఆదిరెడ్డి భవాని, ఎమ్మెల్యే, రాజమండ్రి నగర  ప్రముఖులు పాల్గొన్నారు.

 

రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం శ్రీ గంగాధర శాస్త్రి గారిచే భగవద్గీత ఉపన్యాసం తో శుభారంభం అయింది. ఈ సందర్భంగా అలోకా కనుంగో, తాల్ వాద్య కచేరి చే శాస్త్రీయ ఒడిస్సీ నృత్య ప్రదర్శన, పి. జయ భాస్కర్ సంగీత విన్యాసం ప్రేక్షకులను ఉర్రూతలూగించగా,  భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్, శ్రీ ఘంటసాల, శ్రీ S.P. బాలసుబ్రహ్మణ్యం,  శ్రీ సిరివెన్నెల సీతారాం శాస్త్రిలకు నివాళులు అర్పిస్తూ ప్రముఖ గాయకులు శ్రీ ఎస్.పి.చరణ్, శ్రీమతి. S.P. శైలజ, శ్రీ వందేమాతరం శ్రీనివాస్, యు. సునీత,  ఆ భారత చలనచిత్ర దిగ్గజాల  కొన్ని అజరామరమైన  మెలోడీ పాటలతో సమావేశాన్ని అలరించారు.

అంతకుముందు, శనివారం, తన ప్రారంభోపన్యాసం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ, రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం వంటి పండుగలు మన సంస్కృతి  సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయని వారు విశ్వాసం వెలిబుచ్చారు.

ప్రారంభ కార్యక్రమంలో, కేంద్ర ఈశాన్య ప్రాంత సంస్కృతి, పర్యాటక  అభివృద్ధి మంత్రి (DoNER), శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం సాంస్కృతిక  మంత్రిత్వ శాఖ  ప్రధాన పండుగ, భారతదేశపు ఘన  సాంస్కృతిక వారసత్వాన్ని  సంరక్షించడం, ప్రోత్సహించడం  ప్రాచుర్యం లోకి తీసుకురావడం  లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  ప్రతిష్టాత్మకమైన “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” లక్ష్యాన్ని బలోపేతం చేస్తూ ఒక రాష్ట్రానికి చెందిన జానపద  గిరిజన కళలు, నృత్యం, సంగీతం, వంటకాలు  సంస్కృతిని ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించడంలో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం కీలకపాత్ర పోషిస్తోందని దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని స్థానిక జనాభాకి  భారతదేశంలోని ఇతర ప్రాంతాల విభిన్న సంస్కృతికి పరిచయం చేస్తుందని, కేంద్ర మంత్రి అన్నారు.

భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 540 మందికి పైగా జోనల్ జానపద కళాకారులు  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 280 మంది జానపద కళాకారులు 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని రంగుల సాంస్కృతిక కోలాహలం ద్వారా ప్రదర్శించడం మహోత్సవ్‌లోని హైలైట్. జీవితాంతం గుర్తుండిపోయే  మహోత్సవం ఇది. అన్ని మండల సాంస్కృతిక కేంద్రాల నుంచి వచ్చిన వాద్యకారుల చేత మంత్ర ముగ్ధ  ప్రదర్శనలు  రెండో రోజు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల జానపద యుద్ధ విద్యలను   ప్రదర్శనార్హం  చేయడం కార్యక్రమం  ముఖ్య లక్షణం.

మహోత్సవ్‌లో ప్రతి ప్రాంతీయ  సాంస్కృతిక శాఖ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే రంగురంగుల అంగళ్ళలో ఏర్పాటు చేసిన కళాత్మక  ఎగ్జిబిషన్ లో  హస్తకళల విక్రయాలు కూడా జరిగాయి. 30 వంటకాల స్టాల్స్ ను ఏర్పాటు చేసిన ‘ఫుడ్ ఫెస్టివల్’ ద్వారా    స్థానిక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వంటకాలను కూడా ప్రజలు ఆస్వాదించారు. ZCC కి చెందిన దాదాపు 140 మంది కళాకారులు తమ ఉత్పత్తులను  ప్రదర్శిస్తుండగా, ఆంధ్రాలోని 40 మంది కళాకారులు కూడా వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన అంగళ్ళలో  పాల్గొన్నారు.

మహోత్సవంలో భాగంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘గోదావరి జిల్లాల సాహిత్య, సాంస్కృతిక వారసత్వం’ అనే అంశంపై ఒక రోజు సాహిత్య సదస్సు కూడా నిర్వహించారు

రాజమండ్రిలో జరిగిన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ దక్షిణాది రాష్ట్రాల గొప్ప వారసత్వాన్ని ఘనంగా ప్రదర్శించింది  భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోని విభిన్న సంస్కృతి, చేతి వృత్తుల కళాఖండాలు, వంటకాలను ఒకే వేదిక  ప్రదేశంలో స్థానిక  ప్రజానీకానికి  పరిచయం చేసింది. సాధారణ ప్రజల గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి మహోత్సవ్‌కు ప్రవేశాన్ని ప్రజలకు  ఉచితంగా అందించారు.

 

RSM  రెండవ  మూడవ దశలు వరంగల్  హైదరాబాద్‌లో వరుసగా మార్చి 29-30  ఏప్రిల్ 1-3 తేదీల్లో జరుగుతాయి.

 

 *****


(రిలీజ్ ఐడి: 1810840) సందర్శకుల సూచీ సంఖ్య : : 285
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी