సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం మరియు విజయాలను స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం యొక్క చొరవే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్: శ్రీ సత్యేంద్ర ప్రకాష్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్, బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్, న్యూఢిల్లీ


ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లను ముందుకు తీసుకెళ్లడానికి LED డిజిటల్ డిస్‌ప్లే వాహనాలను సంయుక్తంగా ప్రారంభించిన శ్రీ సత్యేంద్ర ప్రకాష్, మరియు సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, శ్రీ విక్రమ్ సహాయ్

Posted On: 04 MAR 2022 6:30PM by PIB Hyderabad

భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం మరియు దాని ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి మరియు విజయాలను పురస్కరించుకుని, స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ని ప్రారంభించింది అని బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్, న్యూఢిల్లీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ సత్యేంద్ర ప్రకాష్ అన్నారు.
 
భారతదేశం పరిణామం చెందే క్రమంలో ఇంత దూరం ప్రయాణించడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా, స్ఫూర్తితో కూడిన భారతదేశం 2.0ని సక్రియం చేయాలనే ప్రధాని మోదీ దార్శనికతను ఎనేబుల్ చేసే శక్తి మరియు సామర్థ్యాలను కలిగి ఉన్న భారత ప్రజలకు ఈ ఆత్మనిర్భర్ భారత్ మహోత్సవ్ అంకితం అని ఆయన అన్నారు.
 
శ్రీ సత్యేంద్ర ప్రకాష్, మరియు సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, శ్రీ విక్రమ్ సహాయ్ సంయుక్తంగా కోవిడ్ అవగాహన మరియు టీకాలతో సహా ప్రభుత్వం యొక్క వివిధ ప్రధాన కార్యక్రమాల సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి LED- ఎనేబుల్డ్ డిజిటల్ డిస్‌ప్లే వాహనాలను ప్రారంభించారు.
 
ఆంధ్రప్రదేశ్, విజయవాడ ప్రాంతీయ ఔట్రీచ్ బ్యూరోచే ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా 2022 మార్చి 2వ తేదీన విజయవాడలో ప్రారంభించబడిన డిజిటల్ డిస్‌ప్లే ప్రచారానికి సంబంధించిన మొబైల్ వ్యాన్‌లు ప్రస్తుతం తూర్పుగోదావరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన ప్రచారాలను చేపడుతున్నాయి. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలపై పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాల్లో 10 రోజులు ఈ వాహనాలు సంచరిస్తూ అవగాహన కల్పించనున్నాయి.

***



(Release ID: 1803150) Visitor Counter : 133


Read this release in: English