నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ఒడిశాలో లైట్ హౌస్ టూరిజం

Posted On: 08 FEB 2022 2:19PM by PIB Hyderabad
పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడ్‌లో ఒడిషా రాష్ట్రంలో కింది ఐదు లైట్‌హౌస్‌ల వద్ద పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది:-
గోపాల్‌పూర్ లైట్‌హౌస్ – గంజాం జిల్లా
పూరి లైట్‌హౌస్ – పూరి జిల్లా
చంద్రభాగ లైట్‌హౌస్ – పూరి జిల్లా
పారాదీప్ లైట్‌హౌస్ - జగత్‌సింగ్‌పూర్ జిల్లా
ఫాల్స్ పాయింట్ లైట్‌హౌస్ – కేంద్రపారా జిల్లా
పైన పేర్కొన్న లైట్‌హౌస్‌ల కోసం ప్రాజెక్ట్ భాగాలు ఖరారు చేయబడ్డాయి మరియు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) క్లియరెన్స్ కోసం రాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ మరియు ఇతర స్థానిక సంస్థల నుండి అవసరమైన అనుమతులు కోరబడ్డాయి.
పై ప్రాజెక్ట్‌లు PPP మోడ్‌లో ఉన్నాయి కాబట్టి, ఎటువంటి నిధుల కేటాయింపు జరగదు.
ఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో అందరికీ తెలిపారు.

 

***



(Release ID: 1796674) Visitor Counter : 126


Read this release in: English , Urdu