సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఛత్తీస్‌గఢ్ మరియు హర్యానాలో 31 ఖాదీ ప్రకృతి పెయింట్ యూనిట్ల ఏర్పాటు

Posted On: 23 NOV 2021 2:55PM by PIB Hyderabad

ఆవు పేడను ముడి పదార్థంగా ఉపయోగించి ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసీ) అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన ఖాదీ ప్రకృతి పెయింట్‌ను ఛత్తీస్‌గఢ్ మరియు హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు స్థిరమైన ఉపాధికి నమూనాగా స్వీకరించాయి. ఛత్తీస్‌గఢ్‌లో 25 మరియు హర్యానాలో 6 మొత్తం 31 ప్రాకృతిక్ పెయింట్ తయారీ యూనిట్లను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో ఏర్పాటు చేయనున్నాయి, దీని కోసం కెవిఐసీతో సాంకేతిక బదిలీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 21 నవంబర్ 2021న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బఘెల్ సమక్షంలో కెవిఐసీతో MOU సంతకం చేసింది. హర్యానా ప్రభుత్వంతో ఎమ్ఒయు 12 నవంబర్ 2021న సంతకం చేయబడింది.



9b79baa9-8b13-4e3c-a3e9-7783dd9aa99a.png


హర్యానాలో మొదటి ప్రకృతి పెయింట్ యూనిట్ చండీగఢ్ సమీపంలోని పింజోర్‌లో ఏర్పాటు చేయబడింది, ఇక్కడ ఇప్పటికే 6000 లీటర్లకు పైగా ప్రకృతి పెయింట్ ఉత్పత్తి చేయబడింది. మార్చి 2022 నాటికి మరో 5 పెయింట్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయబడతాయి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 25 పెయింట్ తయారీ యూనిట్లతో పాటు, ప్రకృతిక్ పెయింట్‌లో ప్రధాన భాగం అయిన కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్ (సిఎంసి) తయారీకి 75 యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తుంది.

ఈ కొత్త పెయింట్ తయారీ యూనిట్లు ప్రతిరోజూ 500 లీటర్ల పెయింట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోని 31 కొత్త ప్రకృతి పెయింట్ యూనిట్లు అనేక ఇతర అనుబంధ రంగాలకు మద్దతునిస్తూ దాదాపు 500 ప్రత్యక్ష ఉపాధిని సృష్టిస్తూ, సంవత్సరానికి 50 లక్షల లీటర్ల పెయింట్ ఉత్పత్తి చేస్తాయి. ప్రకృతిక్ పెయింట్‌ను అభివృద్ధి చేసిన జైపూర్‌లోని కెవిఐసీకు చెందిన కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇన్‌స్టిట్యూట్ (కెఎన్‌హెచ్‌పిఐ) ఆ రాష్ట్రాల నుండి వచ్చిన నైపుణ్యం కలిగిన కార్మికులకు ఆవు పేడ పెయింట్‌ను తయారు చేయడంలో శిక్షణను అందిస్తుంది.

కెవిఐసీ చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ ఖాదీ ప్రకృతి పెయింట్ అనేది సుస్థిర ఉపాధికి ప్రభావవంతమైన నమూనా అని, ఛత్తీస్‌గఢ్ మరియు హర్యానా ఇతర రాష్ట్రాలకు ఆవు పేడ ఆధారిత ప్రకృతి పెయింట్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఉదాహరణగా నిలుస్తాయని అన్నారు. “ఖాదీ ప్రకృతిక్ పెయింట్ అనేది పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న ఉత్పత్తి, ఇది సుస్థిర ఉపాధిని సృష్టించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం వంటి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది ప్రధానమంత్రి దార్శనికత అని చెప్పారు. ఆవుపేడ పెయింట్‌ను అభివృద్ధి చేయడం యొక్క ప్రధాన లక్ష్యం ఉపాధి కల్పన. ఇది ఖాదీ యొక్క ప్రాథమిక ఆవరణ. ప్రకృతిక్ పెయింట్ తయారీ కోసం రైతులు మరియు ఆవు షెడ్‌ల నుండి ఆవు పేడ కొనుగోలు చేయడం ద్వారా ప్రతి జంతువుకు సంవత్సరానికి దాదాపు 30,000 రూపాయల అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుంది, ”అని సక్సేనా చెప్పారు.

ఖాదీ ప్రకృతిక్ పెయింట్ 12 జనవరి 2021న ప్రారంభించబడింది. ఈ పెయింట్ వాటర్‌ప్రూఫ్ మరియు శుభ్రం చేయదగినది మాత్రమే కాకుండా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు నేచురల్ థర్మల్ ఇన్సులేషన్ ప్రాపర్టీస్ వంటి ఆవు పేడ యొక్క సహజ ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ పెయింట్ పర్యావరణ అనుకూలమైనది, విషపూరితం కానిది, వాసన లేనిది మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది.



 

****



(Release ID: 1774382) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Hindi