సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 28 SEP 2021 11:32AM by PIB Hyderabad

ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా చేసిన ట్వీట్‌లో ప్ర‌ధాన‌మంత్రి, ఆజాదీ కె మ‌హాన్ సేనానీ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ కో ఉన్‌కా జ‌న్మ జ‌యంతి ప‌ర్ విన‌మ్ర శ్ర‌ద్ధాంజ‌లి (గొప్ప స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు అయిన ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు విన‌య‌పూర్వ‌క నివాళి) అంటూ శ్ర‌ద్ధాంజ‌లి అర్పించారు. సాహ‌సి అయిన భ‌గ‌త్ సింగ్ ప్ర‌తి భార‌తీయుని హృద‌యంలో స‌జీవంగా ఉన్నారు. ఆయ‌న సాహ‌సోపేత‌మైన త్యాగం, లెక్క‌లేనంత‌మంది ప్ర‌జ‌ల‌లో దేశ‌భ‌క్తి జ్వాల‌ను ర‌గిల్చింది. ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా విన‌య‌పూర్వ‌కంగా వంద‌నం చేస్తూ, ఆయ‌న మ‌హోన్న‌త ఆద‌ర్శాల‌ను గుర్తు చేసుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. 

***



(Release ID: 1759028) Visitor Counter : 152