ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్‌డేట్‌


రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఇప్ప‌టివ‌ర‌కు 47.48 కోట్ల వాక్సిన్ డోస్‌లు స‌మ‌కూర్చ‌డం జ‌రిగింది.

2.88 కోట్ల‌కు పైగా మిగులు , వాడ‌ని వాక్సిన్ డోస్‌లు, రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ప్రైవేటు ఆస్పత్రుల వ‌ద్ద వాడ‌కానికి సిద్దంగా ఉన్నాయి.

Posted On: 29 JUL 2021 10:47AM by PIB Hyderabad

కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సిన్ కార్య‌క్ర‌మాన్ని వేగవంతం చేసేందుకు క‌ట్టుబ‌డి ఉంది.   కోవిడ్ -19 సార్వ‌త్రిక వాక్సినేష‌న్‌కు సంబంధించిన కొత్త ద‌శ‌2021 జూన్ 21 నుంచి ప్రారంభ‌మైంది. మ‌రిన్ని వాక్స‌న్‌లు అందుబాటులోకి తీసుకురావ‌డం ద్వారా వాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేశారు. మ‌రింత మెరుగైన ప్ర‌ణాళిక ద్వారా వాక్సిన్ అందుబాటుకు సంబంధించిన ముంద‌స్తు స‌మాచారం అందించ‌డంతోపాటు, వాక్సిన్ అందుబాటును రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు పెంచ‌డం జ‌రిగింది.

దేశ వ్యాప్త వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలొ భాగంగా, భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కోవిడ్ వాక్సిన్‌ల‌ను ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. కోవిడ్ -19 వాక్సినేష‌న్ నూత‌న ద‌శ‌లో  కేంద్ర ప్ర‌భుత్వం , వాక్సిన్ ఉత్ప‌త్తిదారులు ఉత్ప‌త్తి చేసే వాక్సిన్‌లో 75 శాతం వాక్సిన్‌ను సేక‌రించి దానిని ఉచితంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది.

 

 

వాక్సిన్ డోస్‌లు          

 

( 29 జులై 2021 నాటికి)

 

స‌ర‌ఫ‌రా చేసిన‌వి        

 

47,48,77,490

 

పంపిణీ ద‌శ‌లో ఉన్న‌వి

 

53,05,260

 

వినియోగించిన‌వి  

 

44,74,97,240

 

మిగులు అందుబాటులో ఉ న్న‌వి

 

 

2,88,55,050


ఇప్ప‌టివ‌ర‌కు 47.48 కోట్ల‌కు పైగా (47,48,77,490) వాక్సిన్ డోస్‌లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు పంపిణీ చేయ‌డం జ‌రిగింది. మ‌రో 53,05,260 డోస్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
ఇప్ప‌టివ‌ర‌కు అంటే ఈ ఉద‌యం 8 గంట‌ల‌వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం , ప్ర‌భుత్వం పంపిణీచేసిన వాటిలో , వృధా అయిన వాటితో క‌లిపి మొత్తం 44,74,97,240 వాక్సిన్ డోస్‌లు వాడ‌డం జ‌రిగింది.
2.88 కోట్లకుపైగా వాక్సిన్ డోస్‌లు (2,88,55,050) వాడ‌నివి రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ప్రైవేటు ఆస్ప‌త్రుల వ‌ద్ద ఇంకా వాడ‌కానికి మిగిలి ఉన్నాయి.

 

***

 


(Release ID: 1740232)