వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే ఈ ఏడాది 12% అధికంగా గోధుమలు సేకరించబడ్డాయి
ఈ ఏడాది 432.19 ఎల్ఎమ్టి గోధుమలు సేకరించగా గత ఏడాది 385.60 ఎల్ఎమ్టి సేకరించబడ్డాయి
ప్రస్తుతం కొనసాగుతున్న గోధుమల సేకరణ వల్ల సుమారు 48.96 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు
కొనసాగుతున్న కెఎంఎస్ 2020-21, ఆర్ఎంఎస్లో ఎంఎస్పిపై 848.08 ఎల్ఎమ్టి వరి కొనుగోలు 125.19 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది
ప్రభుత్వ సంస్థలు ఎంఎస్పిపై 8,95,855.36 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజలను సేకరించాయి
Posted On:
23 JUN 2021 7:32PM by PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్ఎంఎస్ 2021-22లో గోధుమల సేకరణ సజావుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు (22.06.2021 వరకు) 432.19 ఎల్ఎమ్టి గోధుమలు సేకరించబడ్డాయి (ఇది గతం కంటే అత్యధికం. ఎందుకంటే ఇది మునుపటి గరిష్ట 389.92 ఎల్ఎమ్టిని మించిపోయింది. గత ఏడాది కొనుగోలు 385.60 ఎల్ఎమ్టిలు. ఇక రాజస్థాన్లో గోధుమల సేకరణ గతంలో ఎప్పుడూ లేని విధంగా 22.85 ఎల్ఎమ్టికి చేరుకుంది.
ఇప్పటికే జరుగుతున్న ఆర్ఎంఎస్ సేకరణ కార్యకలాపాల వల్ల సుమారు 48.96 లక్షల మంది రైతులు ఎంఎస్పి ద్వారా రూ 85,356.90 కోట్లు లబ్ధి పొందారు.
వివిధ రాష్ట్రాల్లో ఖరీఫ్ 2020-21లో వరి సేకరణ సజావుగా కొనసాగుతోంది. 848.08 ఎల్ఎమ్టిల వరి ( 22.06.2021 వరకు ఖరీఫ్ సాగు 707.67 ఎల్ఎమ్టి మరియు రబీ సాగు 140.41 ఎల్ఎమ్టిలను కలిగి ఉంది) గత సంవత్సరం 750.11 ఎల్ఎమ్టి కొనుగోలుతో పోలిస్తే ఇది అధికం.
ఇప్పటికే జరుగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల నుండి సుమారు 125.19 లక్షల మంది రైతులు రూ. 1,60,116.84 కోట్లు లబ్ధి పొందారు. వరి సేకరణ కూడా ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయికి చేరుకుంది. ఇది కెఎంఎస్ 2019-20లో మునుపటి గరిష్ట స్థాయి 773.45 ఎల్ఎంటిను అధిగమించింది.
ధరల మద్దతు పథకం ప్రకారం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 & రబీ మార్కెటింగ్ సీజన్ 2021 మరియు సమ్మర్ సీజన్ 2021 యొక్క 108.42 ఎల్ఎంటి పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలను కొనుగోలు చేయడానికి అనుమతి లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల నుండి 1.74 ఎల్ఎంటి కొప్రా(శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది. ఇతర రాష్ట్రాలు / యుటిల నుండి పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు కొప్రాలను పిఎస్ఎస్ క్రింద సేకరించే ప్రతిపాదనలను స్వీకరించినప్పుడు కూడా ఆమోదం లభిస్తుంది. తద్వారా ఈ పంటల యొక్క ఎఫ్ఏక్యూ గ్రేడ్గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి రైతులు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సంబంధిత రాష్ట్రాలు / యుటిలలో నోటిఫైడ్ హార్వెస్టింగ్ కాలంలో మార్కెట్ రేటు ఎంఎస్పి కంటే తక్కువగా ఉంటే నోటిఫైడ్ ఎంఎస్పి వద్ద రిజిస్టర్డ్ నుండి నేరుగా పొందవచ్చు.
22.06.2021 వరకు ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా ఎంఎస్పి విలువ ద్వారా 8,95,855.36 మెట్రిక్ టన్నుల పెసర, మినప, కంది, గ్రామ్, మసూర్, వేరుశనగ , సన్ఫ్లవర్, ఆవాలు సోయాబీన్లను ఖరీఫ్ 2020-21 & రబీ 2021 కింద తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హర్యానా, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొనుగోలు చేశాయి. తద్వారా 5,37,054 మంది రైతులకు రూ. 4,668.57 కోట్ల లబ్ధి చేకూరుతోంది.
అదేవిధంగా ఎంఎస్పి విలువ రూ .52.40 కోట్లు కలిగిన 5,089 మెట్రిక్ టన్నుల కొప్రా (శాశ్వత పంట) 2020-21 పంటల కాలంలో కర్ణాటక, తమిళనాడులలోని 3,961 మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. 2021-22 సీజన్ కొరకు తమిళనాడు నుండి 51,000 మెట్రిక్ టన్నుల కొప్రా కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుండి సేకరణ ప్రారంభమవుతుంది.
పప్పుధాన్యాలు మరియు నూనె గింజల రాక ఆధారంగా ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు సేకరణ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
***
(Release ID: 1729907)
Visitor Counter : 169