వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే వరి సేకరణలో 16.37% పెరుగుదల

ఈ ఏడాది మొత్తం 663.68 ఎల్‌ఎమ్‌టి వరిని సేకరించారు. గత ఏడాది 570.30 ఎల్‌ఎమ్‌టి కొనుగోలు జరిగింది.

పంజాబ్ ఒక్కటే 202.82 ఎల్‌ఎమ్‌టిని అందించింది. మొత్తం సేకరణలో ఇది 30.56%

ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 3,09,347.50 మెట్రిక్ టన్నుల పెసర, మినప, కంది, వేరుశనగ మరియు సోయాబీన్లను రూ.1,666.07 కోట్ల ఎంఎస్‌పీకు కొనుగోలు చేసింది. తద్వారా 1,67,782 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.

సుమారు 91,72,124 కాటన్ బేల్స్ విలువ రూ. 26,717.10 కోట్లు. తద్వారా 18,96,762 మంది రైతులకు లబ్ధి కలిగింది.

Posted On: 27 FEB 2021 3:48PM by PIB Hyderabad

ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) 2020-21లో మునుపటి సీజన్లలో చేసినట్లుగా ప్రస్తుతమున్న ఎంఎస్పీ పథకాల ప్రకారం రైతుల నుండి ఎంఎస్పి వద్ద ఖరీఫ్ 2020-21 పంటలను ప్రభుత్వం సేకరిస్తూనే ఉంది.


ఖరీఫ్ 2020-21  వరి సేకరణ సజావుగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ & కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, అస్సాం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు త్రిపురలలో 26.02.2021 వరకు 663.68 ఎల్‌ఎమ్‌టిల వరిని కొనుగోలు చేశారు. ఇది గత ఏడాది 570.30 ఎల్‌ఎమ్‌టి కొనుగోలుతో పోలిస్తే 16.37% పెరుగుదల. మొత్తం 663.68 ఎల్‌ఎమ్‌టి కొనుగోలులో పంజాబ్ ఒక్కటే 202.82 ఎల్‌ఎమ్‌టిని అందించింది. ఇది మొత్తం సేకరణలో 30.56%.


సుమారు 96.40 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న  ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్  సేకరణ కార్యకలాపాల నుండి లబ్ధి పొందారు. వాటి ఎంఎస్‌పీ విలువ రూ.1,25,302.79 కోట్లు.

ఇంకా రాష్ట్రాల ప్రతిపాదనల ఆధారంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల కోసం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020 యొక్క 51.92 ఎల్ఎంటీ పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల కొనుగోలుకు అనుమతి లభించింది. మరియు ధర మద్దతు పథకం (పిఎస్ఎస్) కింద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్‌ఎమ్‌టి కొప్రా (శాశ్వత పంట) సేకరణకు అనుమతి ఇచ్చారు. ఇంకా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల ఆధారంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల కోసం రబీ మార్కెటింగ్ సీజన్ 2020-2021 యొక్క 29.82 ఎల్ఎంటీల పప్పులు మరియు నూనె గింజల కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది. ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు కొప్రాలను పిఎస్ఎస్ క్రింద సేకరించే ప్రతిపాదనలు సమర్పిస్తే వాటికి కూడా ఆమోదం లభిస్తుంది. రైతులు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సంబంధిత రాష్ట్రాలు/యూటిలలో నోటిఫైడ్ హార్వెస్టింగ్ కాలంలో మార్కెట్ రేటు ఎంఎస్పి కంటే తక్కువగా ఉంటే ఆ పంటల యొక్క  ఎఫ్‌ఏక్యూ గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి నోటిఫైడ్ ఎంఎస్పి వద్ద రిజిస్టర్డ్ నుండి నేరుగా పొందవచ్చు.

26.02.2021 వరకు, ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 3,09,347.50 మెట్రిక్ టన్నుల పెసర, మినప, కంది, వేరుశనగ మరియు సోయాబీన్లను ఎంఎస్పి విలువ రూ .1,666.07 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఖరీఫ్ 2020-21 కాలంలో  తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 1,67,782 రైతలుకు ప్రయోజనం కలిగింది. రబీ 2020-21 కింద ఆంధ్రప్రదేశ్‌లోని 23 మంది రైతులకు లబ్ధి చేకూర్చే రూ.0.19 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన 37.85 మెట్రిక్ టన్నుల శెనగను కొనుగోలు చేశారు.

అదేవిధంగా 26.02.2021 వరకు రూ.52.40 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొప్రా (శాశ్వత పంట) కొనుగోలు కర్ణాటక, తమిళనాడుల్లోని 3961 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పప్పుధాన్యాలు మరియు నూనె గింజల రాక ఆధారంగా ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు సేకరణ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్పి ఆధ్వర్యంలో సీడ్ కాటన్ (కపాస్) సేకరణ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి. 26.02.2021 వరకు రూ. 26,717.10 కోట్ల విలువగ 91,72,124 కాటన్ బేల్స్‌ సేకరించారు. తద్వారా 18,96,762 మంది రైతులు ప్రయోజనం పొందారు.

***



(Release ID: 1701402) Visitor Counter : 130


Read this release in: English , Hindi , Manipuri , Punjabi