వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతులకు ప్రయోజనకారిగా జాతీయ వ్యవసాయ మార్కెట్ ( ఈ-నామ్ )

వ్యవసాయ ఉత్పత్తులకు " ఒక దేశం ఒకే మార్కెట్" లక్ష్య సాధన దిశగా అడుగులు

కొత్తగా మరో 1000 మార్కెట్లకు విస్తరణ

Posted On: 04 FEB 2021 6:03PM by PIB Hyderabad

రైతుల వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు పారదర్శకంగా జరిగేలా చూసిఉత్పత్తుల అమ్మకాలకు అవసరమైన మార్కెట్లను గుర్తించి దేశంలో ఎక్కడైనా వాటిని విక్రయించడానికి వీలు కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన జాతీయ వ్యవసాయ మార్కెట్ ( ఈ-నామ్)ను మరింత విస్తరించడానికి రంగం సిద్ధం అయ్యింది. ఒక దేశం ఒకే మార్కెట్" వ్యవస్థను నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించేలా చూడాలన్న లక్ష్యంతో జాతీయ వ్యవసాయ మార్కెట్ పనిచేస్తోంది. 

ఇంతవరకు ఈ-నామ్ లో 18 రాష్ట్రాలుమూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో 1000 మార్కెట్లు అనుసంధానం అయ్యాయి. ఈ-నామ్ కింద కార్యకలాపాలను నిర్వహించుకోడానికి 1.69 కోట్ల మంది రైతులు, 1.55 లక్షల మంది వ్యాపారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. పారదర్శకంగా ఆన్ లైన్ విధానంలో జరుగుతున్న బిడ్డింగ్ ప్రక్రియ రైతులకువ్యాపారులకు ప్రయోజనం కలిగించే విధంగా వుంది. దీనితో ఈ-నామ్ ద్వారా జరుగుతున్న వ్యాపార లావాదేవీలు పెరుగుతున్నాయి. ఇంతవరకు ఈ-నామ్ ద్వారా దాదాపు 1.22 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే  4.13 కోట్ల మెట్రిక్ టన్నుల వస్తువులు, 3.68 కోట్ల కొబ్బరికాయలువెదురుల క్రయవిక్రయాలు జరిగాయి. ఈ పద్దతిలో రైతులకు నేరుగా చెల్లింపులు జరుగుతున్నాయి. 

ఈ-నామ్ విజయవంతం కావడంతో దీనిని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా మరింత విస్తరించడానికి కృషి ప్రారంభమయ్యింది. ఇంతవరకు ఈ-నామ్ 1000 మార్కెట్లలో అందుబాటులో ఉండగా దీనిని మరో 1000 మార్కెట్లకు విస్తరించాలని నిర్ణయించారు. దీనివల్ల ఈ-నామ్ మరింత సమర్ధంగా పనిచేస్తుందని అంటున్నారు. 

కోవిడ్ -19 సమయంలో ఈ-నామ్ లో ఎఫ్పీఓ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సౌకర్యం వల్ల రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్లకు ప్రత్యక్షంగా తీసుకురాకుండానే వాటి సేకరణ ప్రాంతాల నుంచి విక్రయించడానికి వీలు కల్పించింది. ఇంతవరకు ఈ-నామ్ లో 1844  ఎఫ్పీఓ లు వున్నాయి. ఇంతేకాకుండా గిడ్డంగుల నుంచి  వ్యాపారం సాగించడానికి ఈ-నామ్ లో  ఇ-ఎన్‌డబ్ల్యుఆర్ సౌకర్యాన్ని పొందుపరిచారు. 

మార్కెట్ల మధ్యఅంతరాష్ట్ర వ్యాపార లావాదేవీలను  సరళంగా పనిచేసే  ఇ-ఎన్‌డబ్ల్యుఆర్ ప్రోత్సహిస్తుంది. తాము పంపిన వస్తువులు రవాణాలో ఎక్కడ వున్నాయన్న అంశాన్ని  ఇ-ఎన్‌డబ్ల్యుఆర్ ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది. కర్ణాటక రాష్ట్ర రీఎమ్ఎస్ తో ఈ-నామ్ ను అనుసంధానం చేయడంతో ఇతర మార్కెట్ వేదికల సభ్యులు ఈ-నామ్ ద్వారా విక్రయాలు సాగించి తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. 

దేశంలో వ్యవసాయ కార్యకలాపాలను సాగిస్తున్న అన్ని వ్యస్థలను అనుసంధానం చేయడంద్వారా ( సేవలురవాణాభీమా,ప్యాకింగ్  తదితర సేవలు) రైతులు తమ ఉత్పత్తుల విలువలను పెంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. 

ఈ-నామ్ అనేది ఒక పథకం కాదు. ప్రతి ఒక్క రైతు తన ఉత్పత్తులను సరైన ధరను పొందడానికి సాగించే పయనం. ఈ విధానం వల్ల రైతుల ఆదాయం పెరగడంతో పాటు పనులకు సరైన ధరలు పారాదర్శక విధానంలో రవాణా కోసం అదనంగా వెచ్చించకుండానే లభిస్తాయి. 

***



(Release ID: 1695392) Visitor Counter : 207


Read this release in: English , Bengali