ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 ప్రభావం నుండి భారతదేశంలోని పేదలను, ఆ వ్యాధి సోకే అవకాశమున్న వారినీ రక్షించడం కోసం 400 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుపై సంతకం చేసిన - భారత ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు

Posted On: 16 DEC 2020 8:24PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పేదలు, బలహీన కుటుంబాలవారికి సామాజిక సహాయం అందించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా భారత ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు ఈ రోజు 400 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుపై సంతకం చేశాయి. ఇందుకోసం చేపట్టిన రెండు వరుస కార్యక్రమాలలో ఇది రెండవది.  750 మిలియన్ డాలర్ల మొదటి భారీ కార్యక్రమం 2020 మే నెలలో ఆమోదం పొందింది.  కోవిడ్-19 మహమ్మారి వల్ల కలిగే కష్టనష్టాల నుండి పేదలకు, ఇతర బలహీన కుటుంబాలకు సమన్వయంతో, తగిన సామాజిక రక్షణ కల్పిస్తున్న భారతదేశంలోని జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం బలోపేతం చేస్తుంది.

ఆర్ధిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సి.ఎస్. మహాపాత్ర ఈ విషయమై మాట్లాడుతూ, వలసదారులు మరియు పట్టణ పేదలు ఎదుర్కొంటున్న నష్టాలను మరియు ఈ ప్రకృతి యొక్క భవిష్యత్తు విపత్తులకు ప్రభుత్వాల సంసిద్ధతను బలోపేతం చేయవలసిన అవసరాన్ని, కోవిడ్-19 సంక్షోభం, తెరపైకి తెచ్చిందని, అన్నారు.  ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా పట్టణ మరియు పెరి-పట్టణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు సహాయం చేయడం ద్వారా భారతదేశ సామాజిక రక్షణ వ్యవస్థల కవరేజీని మరింత విస్తరించడానికి మరియు లోతుగా చేయడానికి సహాయపడుతుంది.

ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరపున డాక్టర్ మహపాత్రా, ప్రపంచ బ్యాంకు తరపున భారతదేశ యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ ఎం.ఎస్. సుమిలా గుల్యానీ సంతకం చేశారు.  భారతదేశం అంతటా ప్రతినిధి గృహ సర్వే ద్వారా మొదటి ఆపరేషన్‌ను ట్రాక్ చేయడం ద్వారా వచ్చిన ప్రారంభ ఫలితాలు భారతదేశ సామాజిక రక్షణ వ్యవస్థ యొక్క బలాలు మరియు సవాళ్లను హైలైట్ చేస్తాయి. ఈ రోజు సంతకం చేసిన రెండవ వేగవంతమైన భారతదేశ కోవిడ్-19 సామాజిక రక్షణ ప్రతిస్పందన కార్యక్రమం మొదటి కార్యక్రమం సాధించిన మార్పులపై ఆధారపడుతుంది.

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొంటూ, భారత ప్రభుత్వం అప్పటి సామాజిక రక్షణ వ్యవస్థను చురుకుగా బలోపేతం చేస్తోందని భారతదేశంలోని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ మిస్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. ప్రపంచ బ్యాంకు చేసిన మొట్టమొదటి ఆపరేషన్ ప్రక్రియ, అత్యవసర ఉపశమనం కోసం ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను పెంపొందించడానికి ప్రభుత్వానికి దోహదపడింది.  ఈ రెండవ ఆపరేషన్ భారతదేశ భద్రతా నికర కార్యక్రమాల విస్తరణకు ఒక పోర్టబుల్ సామాజిక రక్షణ వేదికను రూపొందించడానికి నిరుపేద గృహాలు, పట్టణ వలసదారులు మరియు రాష్ట్ర సరిహద్దుల్లోని అసంఘటిత రంగ కార్మికులకు ఆహారం మరియు నగదు సహాయాన్ని నిర్ధారిస్తుంది.

భారతదేశంలో ఖండం లాంటి పరిమాణం మరియు భిన్నత్వం కారణంగా, కోవిడ్-19 అనంతర ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఉప-జాతీయ, సమాజ మరియు గృహ స్థాయిలలో భిన్నంగా ఉండే అవకాశం ఉంది.   ఈ నూతన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు, వారి ప్రత్యేక అవసరాలను తీర్చడానికి వీలు కల్పిస్తుంది, అదే సమయంలో వలసదారులు, వ్యవస్థీకృతం కాని కార్మికులు మరియు పట్టణ పేదల అవసరాలను తీర్చగలిగే విధంగా ఉంటుంది.  కోవిడ్-19 మరియు భవిష్యత్ విపత్తులకు తగిన సామాజిక రక్షణ ప్రతిస్పందనలను రూపొందించి, అమలు చేయడానికీ, విపత్తు ప్రతిస్పందన నిధుల నుండి సౌకర్యవంతమైన నిధులను పొందటానికీ, ప్రతిపాదిత సంస్కరణలు, రాష్ట్రాలను అనుమతిస్తాయి. భారతదేశంలో కోవిడ్-19 కేసులు ప్రస్తుతం, పట్టణ మరియు పెరి-అర్బన్ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్నందున, ఈ హాట్-స్పాట్ జిల్లాలకు భౌగోళికంగా లక్ష్యంగా ఉన్న మద్దతు పట్టణ ప్రాంతాలలో సామాజిక రక్షణ సేవలను మరింతగా పెంచడానికి సహాయపడుతుంది.

ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏ.డి.బి);  ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ (ఏ.ఎఫ్.డి); మరియు క్రెడిటాన్ ‌స్టాల్ట్ ఫర్ వైడెరాఫ్‌బావు (కె.ఎఫ్.డబ్ల్యూ) సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

400 మిలియన్ డాలర్ల ఈ ఋణ సహాయం - ప్రపంచ బ్యాంకు యొక్క రాయితీ రుణాల విభాగం - ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐ.డి.ఐ) నుండి లభిస్తుంది. 

*****



(Release ID: 1681339) Visitor Counter : 146


Read this release in: English , Urdu , Hindi