వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో ఎంఎస్పి కార్యకలాపాలు

Posted On: 23 NOV 2020 8:15PM by PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) 2020-21లో, ప్రభుత్వం ప్రస్తుత  ఎంఎస్పి పథకాలకు అనుగుణంగా రైతుల నుండి ఖరీఫ్ 2020-21 కాలానికి పంటను, ఉన్న ఎంఎస్పి ప్రకారం సేకరిస్తోంది.  

ఖరీఫ్ 2020-21 కోసం వరి సేకరణ సజావుగా కొనసాగుతోంది పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీఘడ్, జమ్మూ & కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలు కేంద్రపాలితప్రాంతాల నుండి సేకరణ కొనసాగుతోంది. గత సంవత్సరంతో 253.85 ఎల్‌ఎమ్‌టి కొనుగోలుతో పోలిస్తే 22.11.2020 వరకు 298.74 ఎల్‌ఎమ్‌టిల ధాన్యం సేకరణ జరిగింది. మొత్తం 298.74 ఎల్‌ఎమ్‌టి కొనుగోలులో, పంజాబ్ ఒక్కటే 201.99 ఎల్‌ఎమ్‌టిని అందించింది, ఇది మొత్తం సేకరణలో 67.61%.

కొనసాగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల వల్ల 26.30 లక్షల మంది రైతులకు 56,402.42 కోట్ల రూపాయల విలువైన లబ్ది చేకూరింది. 

ఇంకా, రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల కోసం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020 కు గాను 45.10 ఎల్ఎంటి పప్పుదినుసులు, నూనె గింజలను సేకరించడానికి అనుమతి లభించింది. ధర మద్దతు పథకం (పిఎస్ఎస్) కింద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్‌ఎమ్‌టి కొబ్బరి కురిడీ(శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సంబంధిత రాష్ట్రాలు / యుటిలలో నోటిఫైడ్ హార్వెస్టింగ్ కాలంలో మార్కెట్ రేటు ఎంఎస్పి కంటే తక్కువగా ఉంటే ఇతర రాష్ట్రాలు / యుటిల కోసం, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరి కురిడీలను పిఎస్ఎస్ క్రింద సేకరించే ప్రతిపాదనలను స్వీకరించినప్పుడు కూడా ఆమోదం లభిస్తుంది, తద్వారా ఈ పంటల ఎఫ్ఏక్యూ గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి నోటిఫైడ్ ఎంఎస్పి వద్ద రిజిస్టర్డ్ రైతుల నుండి నేరుగా పొందవచ్చు.

22.11.2020 వరకు, ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 71816.04 మెట్రిక్ టన్నుల పెసర, మినుము, వేరుశనగ కాయలు, సోయాబీన్లను సేకరించింది. వీటి  ఎంఎస్పి విలువ రూ .388.40 కోట్లు కలిగి ఉంది, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లలోని 41543 మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. గత సంవత్సరం 65850.05 మెట్రిక్ టన్నుల కొనుగోలు జరగగా, ఇది పప్పుధాన్యాలు మరియు నూనె గింజలకు 9.06% పెరుగుదల.

అదేవిధంగా, రూ .52.40 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొప్రా (శాశ్వత పంట) కర్ణాటక, తమిళనాడులోని 3961 మంది రైతులకు 22.11.2020 లకు లబ్ధి చేకూర్చింది. గత ఏడాది 293.34 మెట్రిక్ టన్నుల కొబ్బరికురిడీ కొనుగోలు చేసింది. కొబ్బరికురిడీ, మినుము‌లకు సంబంధించి, ప్రధాన ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో రేట్లు ఎంఎస్పి కంటే ఎక్కువగా ఉన్నాయి. ఖరీఫ్ పప్పుధాన్యాలు మరియు నూనె గింజలకు సంబంధించి పంట మార్కెట్లోకి వచ్చిన దాని ఆధారంగా ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు సేకరణ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

 

పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్పి కింద సీడ్ కాటన్ (కపాస్) సేకరణ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి. 22.11.2020 వరకు రూ .6440.28 కోట్ల విలువైన 2102116 పత్తి బేళ్లు సేకరణ జరుగగా అది, 419634 మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. 

 

 

****



(Release ID: 1675251) Visitor Counter : 125