వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020 -21 ఖరీఫ్ మార్కెటింగ్ కాలంలో కనీస మద్దతు ధరకు పంటల సేకరణ

Posted On: 09 NOV 2020 5:11PM by PIB Hyderabad

2020 -21 ఖరీఫ్ పంట మార్కెటింగ్  సీజన్ లో కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఖరీఫ్ పంటలను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. గత సీజన్లలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అమలు చేస్తున్న కార్యక్రమం వేగంగా సాగుతున్నది. అమలులో ఉన్న కనీస మద్దతు ధర పథకం కింద ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నది.

 

​వరిని పండిస్తున్న రాష్ట్రాలలో పంట సేకరణ సజావుగా సాఫీగా సాగుతున్నది.  ​ప్రస్తుత ఖరీఫ్ 2020-21 సీజన్ లో 2020 నవంబర్ 8వ తేదీవరకు పంజాబ్, హర్యానా , ఉత్తరప్రదేశ్ , తెలంగాణా, తమిళనాడు, ఉత్తరాఖండ్ , చండీఘర్, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలలో రైతుల నుంచి 252.87 లక్షల మిలియన్ టన్నుల వరిని కొనుగోలు చేయడం జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి రైతుల నుంచి 211.65 లక్షల మిలియన్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఇంతవరకు వరి సేకరణ19.48 % పెరిగింది. కొనుగోలు చేసిన మొత్తం 252.87లక్షల మిలియన్ టన్నుల వరిలో 70.56 శాతం అంటే178.45 లక్షల మిలియన్ టన్నులను ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే కొనుగోలు చేయడం జరిగింది. ఇంతవరకు 47742.55 కోట్ల రూపాయల విలువ చేసే వరిని 21.41 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి కొనుగోలు చేయడం జరిగింది.

 

 

ఇంతే కాకుండా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ కాలం 2020లో రైతుల నుంచి 45.10 లక్షల మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజలను మద్దతు ధర పధకం (పిఎస్ఎస్ ) కింద కొనుగోలు చేయడానికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణా, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితోపాటు 1.23 లక్షల మిలియన్ టన్నుల ఎండు కొబ్బరిని రైతుల నుంచి కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు అనుమతులు జారీ అయ్యాయి.

ప్రతిపాదనలు అందిన వెంటనే ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర మద్దతు పధకం కింద పప్పు ధాన్యాలు,నూనె గింజలు, కొబ్బరిని సేకరించడానికి అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. దీనివల్ల 2020-21 ఖరీఫ్ పంట కాలంలో నిర్ణీత గ్రేడ్ కలిగిన ఈ పంటలను నమోదు చేసుకున్న రైతుల నుంచి ఆయా రాష్ట్రాలలో కనీస మద్దతు ధర కన్నా మార్కెట్ ధర తగ్గినప్పుడు కేంద్రం నియమించే నోడెల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్రాలు నియమించే సేకరణ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు నేరుగా సేకరించడానికి అవకాశం కలుగుతుంది.

2020 నవంబర్ 8 తేదీ వరకు ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా తమిళనాడు,మహారాష్ట్ర మరియు హర్యానా రాష్ట్రాలలో208.81 కోట్ల రూపాయల విలువ చేసే 38980.82 మిలియన్ టన్నుల సెనగలు, వేరుశెనగ, సోయాబీన్ మరియు మినుములను సేకరించింది. దీనివల్ల 22772 మంది రైతులు లబ్ది పొందారు. గత ఏడాది ఇదే సమయానికి 17586.31 మిలియన్ టన్నుల పంటల సేకరణ జరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఇంతవరకుపప్పు ధాన్యాలు, నూనెగింజల సేకరణ 121.65% పెరిగింది.

 

 

ఇదేవిధంగా కర్నాటక మరియు తమళనాడులలో 3961 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి 52.40 కోట్ల రూపాయల విలువ చేసే 5089 మిలియన్ టన్నుల ఎండుకొబ్బరిని నవంబర్ 8వ తీదీనాటికి సేకరించడం జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి 293.34 మిలియన్ టన్నుల కొబ్బరిని సేకరించారు.

కొబ్బరి, మినుములు ఎక్కువగా సాగవుతున్న రాష్ట్రాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు ఖరారు చేసే తేదీ నుంచి ఖరీఫ్ పప్పు ధాన్యాలు నూనె గింజలు మార్కెట్టుకు రావడం ప్రారంభించిన తరువాత సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

2020 -21 ఖరీఫ్ పంట కాలంలో పత్తిగింజల​ ​సేకరణ పంజాబ్, హర్యానా,రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణా,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో ​చురుగ్గా సాగుతున్నది​. నవంబర్ 8వ వ తేదీ​నాటికి ​ కనీస మద్దతు ధర పథకం ​2952.51 కోట్ల రూపాయల విలువ చేసే 1022074 బేళ్ల పత్తిని ​198060 రైతులకు ప్రయోజనం కలిగిస్తూ సేకరించడం జరిగింది.

 

         

***



(Release ID: 1671510) Visitor Counter : 108