వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

గత ఏడాదికంటే 19.92శాతం పెరిగిన ధాన్యం సేకరణ

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 21.09లక్షలమంది
ధాన్యం రైతులకు ప్రయోజనం

Posted On: 08 NOV 2020 3:41PM by PIB Hyderabad

  ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 2020-21 సంవత్సరపు ఖరీఫ్ పంటల సేకరణ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న రైతుల కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి.) పథకాల ప్రకారం రైతులనుంచి పంటలను సేకరిస్తున్నారు.

  2020-21సంవత్సరపు ఖరీఫ్ సీజన్ కు ధాన్యం సేకరణ సజావుగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్ము కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా 2020, నవంబరు 7వరకూ 248.99లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే సమయంలో 207.63లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగింది. అంటే,.. గత ఏడాదికంటే 19.92శాతం ఎక్కువ ధాన్యం సేకరణ జరిగిందన్నమాట. కొనుగోలు చేసిన మొత్తం 248.99లక్షల మెట్రిక్ టన్నులకుగాను, ఒక్క పంజాబ్ లోనే175.24లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగింది., ఇది మొత్తం ధాన్యం కొనుగోలులో 73.37శాతం.

  ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కొనసాగుతున్న ధాన్యం సేకరణ కార్యకలాపాల ద్వారా దాదాపు 21.09లక్షల రైతులకు ఇప్పటికే ప్రయోజనం చేకూరింది. రూ. 47010.10 కోట్ల రూపాయల కనీస మద్దతుధర వారికి లభించింది.

  దీనికితోడు,..వివిధ రాష్ట్రాలనుంచి అందిన ప్రతిపాదనలమేరకు, 2020 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కుసంబంధించి 45.10లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసుల, నూనె గింజల సేకరణకు ఆమోదం లభించింది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరల మద్దతు పథకం కింద పప్పు దినుసులు, నూనెగింజల సేకరణకు అనుమతి లభించింది. అంతేకాక,.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించి, 1.23లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బెర, కొబ్బెర కురిడీలసేకరణకు కూడా అనుమతి ఇచ్చారు. ఇక ఇతర రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పప్పు దినుసులు, నూనె గింజలు, కొబ్బెర, కొబ్బెర కురిడీల సేకరణకు ఆయా రాష్ట్రాలనుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా అనుమతి ఇస్తారు. 2020-21వ సంవత్సరానికి నోటిఫై చేసిన కనీస మద్దతుధర ప్రకారం ధరల మద్దతు పథకం కింద నమోదైన రైతులనుంచి నేరుగా ఎఫ్.ఎ.క్యు. గ్రేడ్ పంటల సేకరణ జరపడానికి అనుమతి ఇస్తారు. ఆయా రాష్ట్రాల్లో మార్కెట్ ధర కనీస మద్దతుధరకంటే తక్కువగా ఉన్న పక్షంలో నోటిపై చేసిన కనీస మద్దతు ధరకు ఆయా పంటలను సేకరిస్తారు. కేంద్ర నోడల్ ఏజెన్సీలు ఎంపికచేసిన సేకరణ సంస్థల ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తాయి.

    ఇక 2020 నవంబరు 7 నాటికి, ప్రభుత్వం వివిధ నోడల్ ఏజెన్సీల ద్వారా రూ. 171.60 కోట్ల కనీస మద్దతు ధరకు సమాన విలువ కలిగిన 31,988.25 మెట్రిక్ టన్నుల పెసలు, ఉద్ది పప్పు, వేరుశనగ కాయలు, సోయాబీన్ వంటి పంటలను ప్రభుత్వం సేకరించింది. దీనివల్ల  తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 18,949 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. గత ఏడాది ఇదే సమయానికి 17,586.31 మెట్రిక్ టన్నుల పప్పుదినుసుల, నూనె గింజల సేకరణ జరిగింది. అంటే 81.89శాతం ఎక్కువగా ఈ సేకరణ జరిగింది.

  అలాగే,...రూ. 52.40కోట్ల కనీస మద్దతు ధర విలువకు సమానమైన 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరి, కొబ్బరి కురిడీల సేకరణ 2020, నవంబరు 7వరకూ జరిగింది. దీనితో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 3,961మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. గత ఏడాది ఇదే సమయానికి 293.34 మెట్రిక్ టన్నుల కొబ్బరి, కొబ్బరి కురిడీల కొనుగోలు జరిగింది. ఆయా రాష్ట్రాల్లో కొబ్బరి, కొబ్బరి కురిడీల మార్కెట్ ధర,.. కనీస మద్దతుధర కంటే ఎక్కువగా ఉంది. ఖరీఫ్ సీజన్ పప్పు దినుసులు, నూనె గింజల సేకరణ ప్రారంభించేందుకు ఇప్పటికే సంబందిత రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయా పంటలు అందుబాటులోకి వచ్చే అవకాశాన్నిబట్టి, సేకరణ ప్రారంభించవలసిన తేదీని నిర్ణయిస్తారు.   

 

   ఇక, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కనీస మద్దతుధర ప్రకారం పత్తిగింజల  సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతోంది. 2020 నవంబరు 7వరకూ,  రూ. 2952.51కోట్ల విలువైన 10,22,074 బేళ్ల పత్తిని సేకరించారు. అంటే ఈ సేకరణవల్ల 1,98,060 మంది రైతులకు ప్రయోజనం కలిగింది.

 

********



(Release ID: 1671360) Visitor Counter : 120