జౌళి మంత్రిత్వ శాఖ

ప‌త్తికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పీ)

Posted On: 18 SEP 2020 5:17PM by PIB Hyderabad

కాటన్ అడ్వైజరీ బోర్డు (సీఏబీ) అంచనాల‌ ప్రకారం ప్రస్తుత పత్తి సీజన్ మరియు గ‌త పత్తి సీజన్లలో రాష్ట్రాల వారీగా పత్తి ఉత్పత్తి:-

State

Cotton Production (in lakh bales)

2018-19

2019-20

Punjab

10.00

13.00

Haryana

23.00

22.00

Rajasthan

26.00

25.00

Gujarat

87.50

95.00

Maharashtra

75.50

82.00

Madhya Pradesh

24.00

20.00

Telangana

43.00

53.00

Andhra Pradesh

14.50

20.00

Karnataka

15.00

18.00

Tamil Nadu

5.00

6.00

Orissa

4.50

4.00

Others

2.00

2.00

Total

330.00

360.00

 

 

 

ప్రస్తుత పత్తి సీజన్ 2019-20 మరియు గ‌త‌ పత్తి సీజన్ 2018-19 కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ (ఎఫ్ఏక్యూ) గ్రేడ్ సీడ్ కాటన్ యొక్క కనీస మద్దతు
ధర (ఎంఎస్‌పీ) ఈ కింది విధంగా ఉంది:-

FAQ grade variety

MSP in Rs./Quintal

2018-19

2019-20

Medium Staple Cotton

5150

5255

Long Staple Cotton

5450

5550

 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి పండించే అన్ని రాష్ట్రాల్లో 400 కి పైగా పత్తి సేకరణ కేంద్రాలను నిర్వహించడం ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కార్యకలాపాల కింద పత్తిని కొనుగోలు చేస్తోంది..

ప్రస్తుత పత్తి సీజన్ 2019-20లో రాష్ట్రాల వారీగా సీసీఐ చేత ఎంఎస్పి కార్యకలాపాల క్రింద పత్తిని సేకరించడం కింద‌న‌ ఇవ్వబడింది: -

State

MSP Purchases during cotton season 2019-20 as on 13.09.20
(Qty in Lakh bales)

Punjab

3.56

Haryana

6.23

Rajasthan

3.76

Gujarat

11.05

Maharashtra

26.25

Madhya Pradesh

4.43

Telangana

41.80

Andhra Pradesh

2.68

Karnataka

3.49

Orissa

1.61

Tamil Nadu

0.28

Total

105.14


ప్రతి సంవత్సరం, అధిక తేమతో కూడిన పత్తిని సేకరించాలని వివిధ పత్తి పండించే రాష్ట్రాల రైతుల నుండి డిమాండ్లు ఉన్నాయి. అయితే, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) మార్గదర్శకాల ప్రకారం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) లిమిటెడ్ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ (ఎఫ్ఏక్యూ) గ్రేడ్ కాటన్‌ను మాత్రమే కొనుగోలు చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. పత్తి యొక్క అన్ని సేకరణలో సీసీఐ తరచుగా ఎఫ్ఏక్యూ ప్రమాణాలను పాటిస్తూ వ‌స్తోంది దీని ప్రకారం తేమకు గరిష్ఠంగా అనుమతించదగిన పరిమితి 12 శాతంగా నిర్ణ‌యించ‌డ‌మైంది. రైతులు తమ పత్తికి తగిన ధరలను గురించి తెలుసుకోవ‌డాన్ని ప్రేరేపించడానికి, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలలో (ఎపీఎంసీల‌) పొడి పత్తిని అమ్మకానికి తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామాలు, ఎపీఎంసీ, జీ అండ్ పీ ఫ్యాక్టరీలు వంటి త‌దిత‌ర ప్రముఖ ప్రదేశాలలో సీసీఐ ద్వారా పోస్టర్లు ప్రదర్శించడం ద్వారా ప్ర‌ధానంగా తెలియ‌జేయ‌డ‌మైంది. అంతేకాకుండా, మార్కెట్ యార్డులు, గ్రామాలు మరియు జీ అండ్ పీ ఫ్యాక్టరీ వంటి అన్ని ప్రముఖ ప్రదేశాలతో పాటు ప్రింట్ మీడియా, బ్యానర్లు మరియు పోస్టర్ల ద్వారా దాని ఉనికిని రైతులకు తెలియజేయడానికి
సీసీఐ విస్తృత ప్రచారం చేస్తోంది. చివ‌రి ఎఫ్ఏక్యూ ప‌త్తి విక్ర‌యానికి వచ్చేంత వ‌ర‌కు సీసీఐ ఈ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని హామీని ఇచ్చారు. పత్తి అభివృద్ధి డైరెక్టరేట్, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు 10.09.2020 నాటికి అందించిన పత్తి పంట నివేదిక ప్రకారం.. 2019-20లో జ‌రిగిన పత్తి సాగు 126 లక్షల హెక్టార్ల‌తో పోలిస్తే సుమారు  3% పెరిగి 2020-21 పత్తి సీజన్‌లో 130 లక్షల హెక్టార్లకు పెరిగింద‌ని అంచనా. అందువల్ల, కోవిడ్ -19 కారణంగా పత్తి సాగుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదు.

కేంద్ర జౌళి శాఖ‌ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ స‌మాచారాన్ని తెలియ‌జేశారు. 

***

 

 


(Release ID: 1656520) Visitor Counter : 217
Read this release in: English