మంత్రిమండలి

భార‌త‌దేశానికి మ‌రియు మొరాకో కు మ‌ధ్య న్యాయ రంగం లో ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 16 MAY 2018 3:48PM by PIB Hyderabad

భార‌త‌దేశానికి మ‌రియు మొరాకో లు న్యాయం మరియు శాస‌న రంగంలో వాటి యొక్క అనుభ‌వాన్ని మ‌రియు ప్రావీణ్యాన్ని పంచుకోవ‌డానికి అనువుగా న్యాయ రంగంలో ఇరు దేశాల స‌హ‌కారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు పై సంత‌కాల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

న్యాయం మ‌రియు శాసన రంగం లోని అంశాల‌ను చ‌ర్చా స‌భ‌లు, స‌ద‌స్సులు ఇంకా వ‌ర్క్ షాప్ ల ద్వారా చ‌ర్చించేందుకు న్యాయ‌వాదుల‌కు, లా ఆఫీస‌ర్ల కు మ‌రియు న్యాయ శాస్త్ర విద్యార్థుల‌కు ఈ ఎమ్ఒయు ఒక అవ‌కాశాన్ని ఇస్తుంది.

***

 



(Release ID: 1532454) Visitor Counter : 52