మంత్రిమండలి

బిలాస్‌పుర్ లో కొత్త ఎఐఐఎమ్ఎస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 03 JAN 2018 2:34PM by PIB Hyderabad

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని బిలాస్‌పుర్ లో కొత్తగా ఎఐఐఎమ్ఎస్ ను ప్ర‌ధాన మంత్రి స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న (పిఎమ్ఎస్ఎస్‌వై) లో భాగంగా ఏర్పాటు చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  ఈ ప‌థ‌కానికి 1351 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారు.

ముఖ్యాంశాలు :

•     కొత్త ఎఐఐఎమ్ఎస్ ను 48 మాసాల లోప‌ల దీనిని పూర్తి చేస్తారు;  దీని ముంద‌స్తు నిర్మాణ ద‌శ 12 నెల‌లుగాను, నిర్మాణ దశ 30 నెలలుగాను, స్థిరీకరణ/ అప్పగింత దశ 6 నెలలుగాను ఉంటుంది.  
 
•     ఈ సంస్థ‌లో 750 ప‌డ‌క‌ల సామర్థ్యం కలిగివుండే ఆసుప‌త్రి మరియు గాయాల చికిత్స సదుపాయాలు కలిగివుండే కేంద్రం భాగంగా ఉంటాయి.
 
•     ఒక్కో సంవ‌త్స‌రానికి 100 మంది విద్యార్థులకు అవ‌కాశం ల‌భించే వైద్య క‌ళాశాల కూడా ఉంటుంది.
 
•     అలాగే, ఒక్కొక్క సంవ‌త్స‌రానికి 60 మంది బి. ఎస్‌సి. (న‌ర్సింగ్ కోర్సు) విద్యార్థులతో కూడిన న‌ర్సింగ్ క‌ళాశాల కూడా ఉంటుంది.
 
•     స్థూలంగా న్యూ ఢిల్లీ లోని ఎఐఐఎమ్ఎస్ ను పోలి ఉండే  నివాస భ‌వ‌న స‌ముదాయాలు మ‌రియు తత్సంబంధిత స‌దుపాయాలు/ సేవ‌లు కూడా ఉంటాయి.

 
•     15 ఆప‌రేష‌న్ థియేటర్ లతో స‌హా 20 స్పెషాలిటీ/సూప‌ర్ స్పెషాలిటీ డిపార్ట్ మెంట్ లు ఈ ఆసుప‌త్రిలో భాగంగా ఉంటాయి.

•     సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధ‌తిలో చికిత్స స‌దుపాయాలు స‌మ‌కూర్చేట‌టువంటి ఆయుష్ విభాగం సైతం ఇందులో భాగంగా ఉంటుంది.  ఈ విభాగంలో 30 ప‌డ‌క‌లు ఉంటాయి.

ప్రభావం:

ప్ర‌జ‌ల‌కు సూప‌ర్ స్పెషాలిటీ ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను అందించ‌డంతో పాటు, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వైద్యులు మ‌రియు ఇత‌ర ఆరోగ్య కార్య‌కర్త‌ల ద‌ళాన్ని ఏర్పాటు చేయ‌డంలో తోడ్ప‌డ‌డం నూత‌న ఎఐఐఎమ్ఎస్ స్థాప‌నలో ముఖ్యోద్దేశంగా ఉంటుంది.  నేశనల్ హెల్త్ మిశన్ (ఎన్‌హెచ్ఎమ్)లో భాగంగా ప్రాథ‌మిక మ‌రియు మాధ్య‌మిక స్థాయి సంస్థ‌లు/ స‌దుపాయాలకు వీరి సేవ‌లు ల‌భ్య‌మ‌వుతాయి.

పూర్వ‌రంగం:

ఈ ప‌థ‌కంలో భాగంగా భువ‌నేశ్వ‌ర్, భోపాల్, జోధ్‌పుర్‌,  ప‌ట్నా, రాయ్‌పుర్‌, ఇంకా రుషికేశ్‌ ల‌లో ఎఐఐఎమ్ఎస్ ల‌ను నెల‌కొల్పారు.  కాగా, రాయ్‌ బ‌రేలీ లో ఎఐఐఎమ్ఎస్ నిర్మాణ ప‌నులు పురోగ‌మిస్తున్నాయి.  అంతేకాకుండా 2015వ సంవ‌త్స‌రంలో 3 ఎఐఐఎమ్ఎస్ ల‌ను- మ‌హారాష్ట్ర లోని నాగ్‌పుర్‌, ప‌శ్చిమ బెంగాల్ లోని క‌ళ్యాణి మ‌రియు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మంగ‌ళ‌గిరి ల‌లో- మంజూరు చేశారు.   మ‌రో రెండు ఎఐఐఎమ్ఎస్ ల‌ను 2016వ సంవ‌త్స‌రంలో బఠిండా మ‌రియు గోర‌ఖ్‌పుర్‌ ల‌లో మంజూరు చేయ‌డ‌మైంది.

***



(Release ID: 1515355) Visitor Counter : 167


Read this release in: English , Kannada