బొగ్గు మంత్రిత్వ శాఖ
విజయవంతంగా సీఎంపీడీఐ, ఎంఎస్ఎంఈ- అభివృద్ధి కార్యాలయం రాంచీ సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల విక్రేతల అభివృద్ధి కార్యక్రమం ముగింపు
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 7:14PM by PIB Hyderabad
కోల్ ఇండియా లిమిటెడ్కు చెందిన మినీ రత్న అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్, డిజైన్ ఇనిస్టిట్యూట్ (సీఎంపీడీఐ), కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖకు చెందిన రాంచీలోని ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యాలయం సంయుక్తంగా 2026 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రాంచీలో రెండు రోజుల ‘విక్రేతల అభివృద్ధి కార్యక్రమం,ఉత్పత్తుల ప్రదర్శన–2026’ను నిర్వహించాయి.
ఈ కార్యక్రమాన్ని 2026 సెప్టెంబర్ 9న కార్యక్రమ చైర్మన్, సీఎంపీడీఐ సీఎండీ శ్రీ చౌదరి శివరాజ్ సింగ్, ముఖ్య అతిథి సీసీఎల్ సీఎండీ శ్రీ నీలేందు కుమార్ సింగ్తో పాటు ఇతర ప్రముఖులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎంపీడీఐ సీఎండీ శ్రీ చౌదరి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. విక్రేతల అభివృద్ధి కార్యక్రమం కేవలం కొనుగోలుదారులు, విక్రేతల సమావేశం మాత్రమే కాదని, కార్పొరేట్ సంస్థలు, ఎంఎస్ఎంఈల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించే వేదిక అని పేర్కొన్నారు. స్వదేశీకరణ, ఆవిష్కరణలు, ప్రత్యేక పరిష్కారాలను ప్రోత్సహించడంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. తమ నైపుణ్యాలను కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేసుకోవడం ద్వారా వికసిత్ భారత్ దిశగా కొత్త అభివృద్ధి అవకాశాలను సృష్టించుకోవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
అన్వేషణ, జియోమాటిక్స్ నుంచి పర్యావరణ సేవలు, గని మూసివేత వరకు సీఎంపీడీఐ అందిస్తున్న విస్తృత శ్రేణి సేవలను ప్రస్తావిస్తూ.. ఎంఎస్ఎంఈలు ఈ అవకాశాలను, తమ ప్రత్యేక నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ సింగ్ సూచించారు. తద్వారా స్థానిక సంస్థల స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో పోటీపడగల సంస్థలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన సీసీఎల్ సీఎండీ శ్రీ నీలేందు కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు కీలక పాత్ర పోషించగలవని అన్నారు. వారికి సాధ్యమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, కాలానుగుణంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులు, సంస్థలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.
రాంచీలోని ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యాలయం డైరెక్టర్ శ్రీ ఇంద్రజిత్ యాదవ్, కార్యక్రమ లక్ష్యాలు, రూపరేఖల గురించి పాల్గొన్న వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ రంగ సంస్థల అధికారులతో సూక్ష్మ, చిన్న పారిశ్రామికవేత్తలు నేరుగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.
విజిలెన్స్ అవగాహన ప్రచారం–2026లో భాగంగా నిర్వహిస్తున్న ఈ విక్రేతల అభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వ సేకరణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికతను ప్రోత్సహిస్తుందని సీసీఎల్, సీఎంపీడీఐ ముఖ్య విజిలెన్స్ అధికారి శ్రీ పంకజ్ కుమార్ తెలిపారు.
ఎంఎస్ఎంఈలు కొనుగోలుదారులు, కార్పొరేట్ సంస్థలతో నేరుగా పరస్పరం చర్చించి, వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని సీఎంపీడీఐ డైరెక్టర్ (టీ,సీఆర్డీ) శ్రీ నృపేంద్ర నాథ్ అన్నారు. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలు చురుకుగా పాల్గొని, వ్యాపార అభివృద్ధికి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రోత్సహించారు.
మొదటి రోజు నిర్వహించిన ‘సాంకేతిక సెషన్లు, కొనుగోలుదారు–విక్రేతల సమావేశం’లో సీఎంపీడీఐ, సీసీఎల్, బీఎస్ఎల్/సీఏఐఎల్, బొకారో, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, ఆగ్నేయ రైల్వే, జీఏఐఎల్, ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్, జీఈఎంలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా సంస్థల సేకరణ ప్రక్రియలు, జీఈఎం (ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్రాంతాల్లో) విక్రేతల నమోదు ప్రక్రియలపై వారు సమగ్ర సమాచారాన్ని అందించారు. అలాగే టీఆర్ఈడీఎస్ (వర్తక వసూళ్ల డిస్కౌంటింగ్ వ్యవస్థ) గురించి పాల్గొన్న వారికి వివరించారు.
రెండో రోజు నిర్వహించిన కార్యక్రమంలో కొనుగోలుదారు–విక్రేతల పరస్పర చర్చా సమావేశం, సాంకేతిక సమావేశాల్లోరాంచీకి చెందిన సీఎంపీడీఐ, యూసీఐఎల్, ఎస్ఐడీబీఐ, ఎంఈసీఓఎన్ లిమిటెడ్ అధికారులు తమ సంస్థలకు అవసరమైన ఉత్పత్తులు, సేవల సేకరణకు సంబంధించిన ప్రక్రియలను ప్రజా సేకరణ విధానం కింద వివరించారు. ఎన్ఎస్ఎస్హెచ్, ఎన్ఎస్ఐసీ, రాంచీ ప్రతినిధులు, ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యాలయం, రాంచీ అధికారులు సాధారణ, మహిళా, ఎస్సీ, ఎస్టీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం అయిదు (05) ప్రభుత్వ రంగ సంస్థలు, 15 సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు ప్రదర్శన స్టాళ్ల ద్వారా తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. 200 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు సాంకేతిక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా వారు అధికారులతో నేరుగా పరస్పరం చర్చించి, తమ సందేహాలకు వివరణలు పొందారు.
***
(రిలీజ్ ఐడి: 2308974)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5