ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి

ఈ నెల 5 నుంచి ఉత్సవాలు

నాడు పోస్టు చేయడమైనది: 04 SEP 2026 5:35PM by PIB Hyderabad

శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారుఈ నెల 5వ తేదీన సాయంత్రం గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్... దేశంలోని అగ్రశ్రేణి ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా ఉందివాణిజ్య శాస్త్రంఅర్థశాస్త్రంమేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో ఇది ఒక విశిష్ట విద్యా కేంద్రంగా నిలిచిందిప్రముఖ పారిశ్రామికవేత్తదాత సర్ శ్రీ రామ్ 1926లో ఈ కళాశాలను స్థాపించారుఒక శతాబ్ద కాలంలో ఎందరో విద్యార్థులునిపుణులునిర్వాహకులుపారిశ్రామికవేత్తలువిధాన రూపకర్తలుదేశనిర్మాతలనూ ఈ విద్యాసంస్థ తీర్చిదిద్దింది.

ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటున్న సమయంలోనే ఈ శత వార్షికోత్సవాలూ జరగడం ఈ సందర్భాన్ని మరింత విశేషమైనదిగా చేస్తుంది. తరతరాలను తీర్చిదిద్దడంలోనూసమాజ పునాదులను బలోపేతం చేయడంలోనూ ఉపాధ్యాయులువిద్యావేత్తలు అందించిన సేవలను ఈ సందర్భంలో దేశం గౌరవించుకుంటుంది.

 

****


(రిలీజ్ ఐడి: 2306832) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Malayalam , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Tamil