గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎనిమిదో విడత గనుల వేలాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి, సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే


కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించిన 20 బ్లాకుల వేలం

प्रविष्टि तिथि: 15 JUL 2026 8:55PM by PIB Hyderabad

ఇండియా మైనింగ్ వీక్-2026 సన్నాహక కార్యక్రమంలో భాగంగా కీలకమైనవ్యూహాత్మకమైన ఖనిజ బ్లాక్‌ల ఈ-వేలం ఎనిమిదో విడతను కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డిబొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే ప్రారంభించారుభారత దేశంలో శుద్ధ ఇంధనంఅధునాతన తయారీరక్షణఏరోస్పేస్ఇతర వ్యూహాత్మక రంగాలకు అవసరమైన కీలకమైన ఖనిజాల భద్రతను బలోపేతం చేయడందిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపటిష్టమైన ఖనిజ సరఫరా వ్యవస్థలను నిర్మించడంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం ఒకటిభారత ప్రభుత్వ ఉన్నతాధికారులురాష్ట్రాల ప్రతినిధులుపారిశ్రామిక దిగ్గజాలుప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), మేధావులుప్రోస్పెక్టివ్ బిడ్డర్లువిలేకరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

image.png

ఈ సందర్భంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి ప్రసంగించారుదేశ మైనింగ్ రంగంలో వృద్ధిని వేగవంతం చేయడానికి విధాన రూపకర్తలనూపరిశ్రమ నాయకులనూపెట్టుబడిదారులనూసాంకేతిక సేవలు అందించేవారినీవిద్యావేత్తలనూ ఒక్కచోట చేర్చే ప్రధాన వేదిక ప్రారంభాన్ని ఇండియా మైనింగ్ వీక్ సూచిస్తుందన్నారుఖనిజ భద్రతను బలోపేతం చేయడంలోనూపెట్టుబడులను ఆకర్షించడంలోనూఅంతర్జాతీయంగా పోటీనిచ్చేలాభవిష్యత్తు అవసరాలకు తగిన మైనింగ్ వ్యవస్థను నిర్మించేలా దేశ ఖనిజ సామర్థ్యాన్ని వెలికి తీయడంలోనూ ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ఈ కీలకమైనవ్యూహాత్మకమైన ఖనిజ బ్లాకుల ఎనిమిదో విడత ప్రారంభం ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు.

దేశ నిర్మాణంలోనూఇంధన భద్రతవికసిత్ భారత్‌ లక్ష్యాన్ని సాధించడంలోనూ మైనింగ్ కీలకంగా నిలుస్తుందని కేంద్ర బొగ్గుగనుల సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే అన్నారువాణిజ్య మైనింగ్డిజిటల్ గవర్నెన్స్ప్రైవేటు రంగ విస్తృత భాగస్వామ్యంతో సహా ఈ రంగంలో చేపట్టిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి ఆయన వివరించారు.  ఈ సంస్కరణలు పారదర్శకతనూసామర్థ్యాన్నీసుస్థిర వృద్ధినీ ప్రోత్సహిస్తున్నాయన్నారుఅదే సమయంలో మైనింగ్ ద్వారా లభించే ప్రయోజనాలు స్థానిక సమాజాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నాయని తెలియజేశారు.

భారత దేశ మైనింగ్ రంగం సామర్థ్యాన్ని ప్రదర్శించడానికీసాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించడానికీప్రభుత్వాలుపరిశ్రమలుపెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించే వార్షిక అంతర్జాతీయ వేదికగా ఇండియా మైనింగ్ వీక్ కార్యక్రమాన్ని పరిగణిస్తున్నట్లు గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ అన్నారుఈ ఎనిమిదో విడత వేలంలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కీలకమైనవ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించిన 20 బ్లాకులున్నాయని వెల్లడించారుదీంతో మొత్తం కీలక ఖనిజాల బ్లాకుల సంఖ్య 88కు చేరుకున్నాయనీవాటిలో 56 బ్లాకుల వేలాన్ని విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారుఇది భారతదేశంలోని సంస్కరణల ఆధారిత మైనింగ్ రంగంపై పరిశ్రమలకు పెరుగుతున్న విశ్వాసాన్ని సూచిస్తుందని చెప్పారు.

ఎనిమిదో విడతలో 20 కీలకవ్యూహత్మక ఖనిజ బ్లాకులను వేలానికి ఉంచారువీటిలో కొత్తగా గుర్తించిన 13  ఖనిజ బ్లాకులున్నాయిఖనిజ (వేలంనియమాలకు అనుగుణంగా మరో ఏడు బ్లాకులను రెండోసారి వేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు

వేలం వేస్తున్న బ్లాకులు వివరాలు:

రాష్ట్రం

బ్లాకుల సంఖ్య

ఖనిజాలు

ఆంధ్రప్రదేశ్

2

మాలిబ్డినమ్గ్రాఫైట్

బీహార్

3

గ్లకోనైట్వెనాడియం– బేరింగ్ మాగ్నటైట్–ఇల్మెనైట్

ఛత్తీస్‌ఘడ్

5

గ్లకోనైట్వెనాడియంగాలియంటైటానియంఅరుదైన ఖనిజాలు (ఆర్ఈఈ), బాక్సైట్అల్యూమినస్ లాటరైట్పాస్ఫోరైట్సున్నపురాయి

మహారాష్ట్ర

2

అరుదైన ఖనిజాలు (ఆర్ఈఈ), వనాడియంగాలియంటైటానియంబాక్సైట్అల్యూమినస్ లాటరైట్

ఒడిశా

3

వెనాడియంటైటానియంమాంగనీస్ గ్రాఫైట్

పంజాబ్

1

పొటాష్హాలైట్

రాజస్థాన్

2

పొటాష్హాలైట్టంగ్‌స్టన్

తెలంగాణ

1

టైటానియంవెనాడియంగాలియంఅల్యూమినస్ లాటరైట్

పశ్చిమ బెంగాల్

1

అరుదైన లోహాలు (లిథియంసీసియంరుబీడియం)

 

శుద్ధ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలువిద్యుత్ వాహన రంగంఅధునాతన తయారీఎరువులురక్షణఏరోస్పేస్ఎలక్ట్రానిక్స్ఇతర వ్యూహాత్మక పరిశ్రమలకు అవసరమైన కీలకమైనవ్యూహాత్మకమైన ఖనిజాలను అందించే బ్లాకులను ఈ విడతలో వేలం వేస్తున్నారుదీని ద్వారా భారత దేశ ఖనిజ భద్రత బలోపేతమవుతుందనీదిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందనీదేశంలో దీర్ఘకాల పారిశ్రామిక వృద్ధికీఇంధన పరవర్తనకు మద్దతు లభిస్తుందనీ అంచనా వేస్తున్నారు.

టెండర్ ప్రతాల విక్రయాలు 2026 జులై 15న ప్రారంభమవుతాయిటెండరు పత్రాలను కొనుగోలు చేయడానికి చివరి తేదీ 2026 సెప్టెంబర్ 14 (సాయంత్రం గంటలు). బిడ్లను (సాంకేతిక బిడ్ప్రతిపాదిత ప్రారంభ ధరదాఖలు చేయడానికి చివరి తేదీ 2026 సెప్టెంబరు 21 (సాయంత్రం గంటలు)

ఈ వేలాన్ని పారదర్శకమైన రెండంచెల అసెండింగ్ ఫార్వర్డ్ పద్దతిని అనుసరిస్తూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారురవాణా చేసిన ఖనిజం విలువపై అత్యధిక శాతం కోట్ చేసిన వారిని ప్రాధాన్య బిడ్డర్‌గా ఎంపిక చేస్తారుబ్లాకులువేలం షరతులుగడువులకు సంబంధించిన పూర్తి సమాచారం ఎంఎస్‌టీసీ ఈ– ఆక్షన్ వెబ్‌సైట్లో ఉంటుంది.

https://www.mstcecommerce.com/auctionhome/mlcln/

ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభించడం ద్వారా అన్వేషణకూతవ్వకానికీ అందుబాటులో ఉన్న కీలకమైనవ్యూహాత్మకమైన ఖనిజ బ్లాకుల వ్యవస్థను గనుల మంత్రిత్వ శాఖ మరింత బలోపేతం చేసిందివికసిత్ భారత్ – 2047 లక్ష్యానికి అనుగుణంగా దేశీయంగా ఖనిజ భద్రతను బలోపేతం చేయడంప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడంపటిష్టమైనఅంతర్జాతీయంగా పోటీనిచ్చే ఖనిజ రంగాన్ని నిర్మించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ఈ కార్యక్రమం తెలియజేస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2285292) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी