ప్రధాన మంత్రి కార్యాలయం
భారత సైనిక బలగాల పరాక్రమాన్నీ, కర్తవ్యభావాన్నీ తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 MAY 2026 11:33AM by PIB Hyderabad
దేశ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పరిరక్షించడంలో భారత సైనిక బలగాలు ప్రదర్శించే ధైర్యం, పరాక్రమం ప్రతి పౌరునికీ గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతమాత కోసం సర్వస్వం అర్పించే వారి త్యాగ నిరతి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం-
‘‘స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధాఛ్చ్రేయో న్యత్క్షత్రియస్య న విద్యతే||’’
ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని గుర్తించినప్పుడు అతడి మనసులో ఎలాంటి సంకోచమూ, భయమూ ఉండకూడదు. ఎందుకంటే, న్యాయపీఠంపై ధర్మాన్నీ, గౌరవాన్నీ కాపాడటానికి చేసే పోరాటమే ఒక యోధుని స్వీయ క్షేమానికి అత్యంత శ్రేష్ఠమైన, గొప్పదైన మార్గమని ఈ శ్లోకం తెలియజేస్తుంది.
(रिलीज़ आईडी: 2259059)
आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam