గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశమంతటా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల నిర్మాణంలో పురోగతిపై కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి సమీక్ష

నాడు పోస్టు చేయడమైనది: 05 MAY 2026 9:04PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల (ఈఎమ్ఆర్ఎస్)ల నిర్మాణంలో పురోగతిని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జువల్ ఒరామ్ అధ్యక్షత వహించారు.


ఈ సమావేశాన్ని గిరిజన వ్యవహారాల శాఖ నిర్వహించిందిఈ సమావేశంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లుకేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ)ల సీఎమ్‌డీలుఎమ్‌డీలుసీనియర్ అధికారులతో పాటు అస్సాంఛత్తీస్‌గఢ్మేఘాలయమిజోరమ్ఒడిశారాజస్థాన్త్రిపురపశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రతినిధులు దృశ్య మాధ్యమ పద్ధతిలో పాల్గొన్నారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలుచేస్తున్న పథకాల్లో ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల (ఈఎమ్ఆర్ఎస్)లు ఒక ప్రధాన పథకంఈ పథకాన్ని దూర ప్రాంతాల్లోని షెడ్యూల్డు తెగ (ఎస్‌టీ)ల విద్యార్థులకు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు నాణ్యమైన ఆశ్రమ విద్యను బోధించడానికి ఉద్దేశించారుగిరిజన బాలబాలికల్లో విద్య పరమైన అంతరాల్ని తొలగించివారి సమగ్ర వికాసాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.
గిరిజన బాలబాలికల సమగ్ర వికాసంలో భాగంగా వారికి విద్యాబుద్ధులు చెప్పిక్రీడలలో ఆసక్తిని పెంచివారిలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతారు.
ఈఎమ్ఆర్ఎస్ నిర్మాణ పనుల్లో భౌతిక పురోగతినీఆర్థికసహాయ సంబంధిత పురోగతినీ గౌరవ కేంద్ర మంత్రి విస్తృత స్థాయిలో సమీక్షించారుసమావేశంలో సీపీడబ్ల్యూడీహెచ్ఎస్‌సీఎల్టీసీఐఎల్డబ్ల్యూఏపీసీఓఎస్బీ అండ్ ఆర్ఈపీఐఎల్ఎమ్ఏఎన్ఐడీసీఓఎమ్‌టీడీసీఎన్‌పీసీసీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల వంటి ప్రధాన కార్యాచరణ సంస్థలు తమ పనుల్లోని ప్రగతిని గురించిఆయా పనులను పూర్తి చేయడానికి ఖరారు చేసిన గడువులను గురించి వివరించాయి.
ఏజెన్సీవారీరాష్ట్రం వారీ పనితీరును సమీక్షించారుదీనిలో భాగంగా గడువునాణ్యత ప్రమాణాలుఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంపైన కూడా దృష్టిని కేంద్రీకరించారు.
దూర ప్రాంతాలప్రయోజనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోతున్న ప్రాంతాల్లో గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలది కీలక పాత్ర అనీఈ కారణంగా ఈ పాఠశాలల పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సివుందనీ గౌరవ కేంద్ర మంత్రి స్పష్టం చేశారుపీఎస్‌యూలుసీపీడబ్ల్యూడీరాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సహా అన్ని కార్యాచరణ ఏజెన్సీలు ప్రాజెక్టు స్థలాల్లో జనశక్తితో పాటు వనరుల్ని కూడా సమర్థంగా వినియోగించుకుంటూ నిర్మాణ పనుల్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఆయన ఆదేశాలిచ్చారుపనులను దగ్గరుండి పర్యవేక్షించడానికి తరచుగా క్షేత్ర పర్యటనలను చేపట్టాలని సీనియర్ అధికారులను ఆదేశించారు.

 


రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అంశాలన్నిటినీ ప్రాధాన్యం ప్రాతిపదికన పరిష్కరించాల్సిందిగా గౌరవ కేంద్ర మంత్రి రాష్ట్రాల అధికారులకు ఆదేశాలిచ్చారుఈ అంశాల్లో భూమిఅడవులకు సంబంధించిన క్లియరెన్సులు కూడా ఉన్నాయి.
ఈఎమ్ఆర్ఎస్ వారీ అంశాలతో పాటుపనులను అనుకున్న సమయానికే పూర్తి చేయడానికి సంబంధించిన కార్య ప్రణాళికలు సహా అన్ని వర్తమాన ప్రాజెక్టులకు చెందిన తాజా వివరాలతో కూడిన నెలవారీ ప్రగతి నివేదికలను మంత్రిత్వ శాఖకూనేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్‌టీఎస్‌)కూ సమర్పించాల్సిందని నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారుఆయా ప్రాజెక్టుల్లో జాప్యం జరిగితే సంబంధిత నిర్మాణ ఏజెన్సీని బాధ్యులను చేయనున్నారు.
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గౌరవ కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారుఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు ఒక పరివర్తన పూర్వక కార్యక్రమమనీఈ కార్యక్రమం ఉద్దేశం గిరిజనుల పిల్లలకు అధిక నాణ్యత కలిగిన ఆశ్రమ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి వారికి సాధికారతను కల్పించడమనీ ఆయన వివరించారు.
వికసిత్ భారత్‌ను 2047కల్లా సాధించాలనేదే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  దృష్టి కోణమని గౌరవ కేంద్ర మంత్రి గుర్తు చేశారుదీనిలో సమ్మిళిత అభివృద్ధికీసమానావకాశాలను అందించడానికీ విశేష ప్రాధాన్యం ఉందని చెప్పారుదేశ నిర్మాణంలో గిరిజన యువత చురుకైన భాగస్వామ్యాన్ని పంచుకోవాలంటే గిరిజన ప్రాంతాల్లో విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందనీదీంతో అభివృద్ధి చెందినస్వయంసమృద్ధసాధికార పూర్వక భారత్ దిశగా పయనించగలమనీ మంత్రి అన్నారు.
గిరిజన మంత్రిత్వ శాఖ ప్రధాన పథకాల్లో ఈఎమ్ఆర్ఎస్ ఒకటని ఆ శాఖ కార్యదర్శి శ్రీమతి రంజనా చోప్రా అన్నారుఅప్రోచ్ రోడ్లునీటి ఎద్దడిహెచ్‌టీఎల్‌టీ విద్యుత్తు లైన్లను వేరే ప్రాంతాలకు మార్చాల్సిరావడం వంటివి ఈ ప్రాజెక్టు పురోగతిపై ప్రభావం చూపుతున్న అంశాలనీవీటిని అతి త్వరగా పరిష్కరించడంపై శ్రద్ధ తీసుకోవాలనీ ఆమె స్పష్టం చేశారుఈ సమస్యల్ని నిర్ణీత కాలంలో పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతోజిల్లా అధికార యంత్రాంగాలతో సన్నిహిత సమన్వయాన్ని నెలకొల్పుకోవాల్సిందిగా కార్యాచరణ ఏజెన్సీలకు ఆమె విజ్ఞప్తి చేశారుఈఎమ్ఆర్ఎస్ ప్రాజెక్టుల విషయంలో పీఎమ్ గతి శక్తి పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు.

నిర్మాణ పనుల సమగ్ర స్థితితో పాటు పనులు పూర్తి చేయడానికి సంబంధించిన నిర్ణీత కార్య ప్రణాళికను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్‌టీఎస్కమిషనరు డాక్టర్ ప్రతిమా వర్మ సమావేశంలో వివరించారుమంత్రిత్వ శాఖ 728 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలకు ఆమోదం తెలిపిందనీవాటిలో 428 పాఠశాల భవనాల నిర్మాణం పూర్తయిందనీ, 249 పాఠశాల భవనాల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయనీ సమావేశం దృష్టికి ఆమె తీసుకువచ్చారు. 46 పాఠశాల భవనాలు పూర్వ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.  వేగవంతమైన కార్యాచరణనీనాణ్యతా పూర్వక నిర్మాణాన్నీ నిర్ధారించడానికి ఎన్ఈఎస్‌టీఎస్ తీసుకున్న చర్యల్ని కూడా ఆమె ప్రస్తావించారు.
గిరిజన వ్యవహారాల శాఖలో ఈఎమ్ఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి శ్రీ బి.ఎన్ప్రసాద్ వందన సమర్పణ చేయడంతోసమావేశాన్ని ముగించారు.

***


(రిలీజ్ ఐడి: 2258374) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी