రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 14 నుంచి న్యూఢిల్లీలో భారత నౌకాదళం తొలి కమాండర్ల సదస్సు-2026

నాడు పోస్టు చేయడమైనది: 12 APR 2026 11:30AM by PIB Hyderabad

ఏప్రిల్ 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు భారత నౌకాదళ తొలి ద్వైవార్షిక కమాండర్ల సమావేశం-2026 న్యూఢిల్లీలోని నౌసేనా భవన్‌లో నిర్వహిస్తారుజాతీయ సముద్ర ప్రయోజనాలను కాపాడేందుకు నౌకాదళ సంసిద్ధతను సమగ్రంగా సమీక్షించటంసామర్థ్య అభివృద్ధిజాతీయ భద్రతా లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించటంపై ఈ అత్యున్నత స్థాయి సమావేశం దృష్టి సారిస్తుంది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలుహిందూ మహాసముద్ర ప్రాంతంలో అంతర్జాతీయ దళాల మోహరింపు నేపథ్యంలో భారత ఇంధన భద్రతను కాపాడేందుకు చేపట్టిన వేగవంతమైన నౌకాదళ కార్యాచరణ దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 'ఆపరేషన్ సిందూర్తర్వాత నౌకాదళ కార్యాచరణ సిద్ధాంతాన్ని స్పష్టం చేయటానికిత్రివిధ దళాల మధ్య సమన్వయంసాంకేతికత ఆధారంగా ప్రతిస్పందన వ్యవస్థలను బలోపేతం చేయటానికి కీలకంగా ఈ సమావేశం నిలుస్తుంది.

ఈ సదస్సులో భాగంగా త్రివిధ దళాధిపతిహోంశాఖ కార్యదర్శి ప్రసంగాలతో పాటు నౌకాదళం సీనియర్ అధికారుల స్థాయిలో చర‌్చలు జరుగుతాయిత్రివిధ దళాల మధ్య పరస్పర సహకారాన్నిసమగ్రతను పెంపొందించటం ఈ చర్చల ప్రధాన లక్ష్యంజాతీయ స్థిరత్వంభద్రతా వ్యవస్థభవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనే విధానాలపై విస్తృత అవగాహనను పెంపొందించుకోవటానికి ఈ చర్చలు సహకరిస్తాయిఈ సదస్సు జాతీయ నాయకత్వంతో సన్నిహిత సంభాషణలకు వేదికగా నిలుస్తూ.. నౌకాదళ ప్రణాళికలకు వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుంది.

ప్రస్తుత భౌగోళిక వ్యూహాత్మక వాతావరణంలోని వివిధ సవాళ్లను ఎదుర్కోవటానికి అవసరమైన ప్రణాళికలను నౌకాదళాధిపతికార్యాచరణ కమాండర్లుసీనియర్ నౌకాదళ నాయకత్వంతో కలిసి రూపొందిస్తారుభద్రతతో పాటు నిర్ణయాత్మక కార్యాచరణ విజయాన్ని సాధించటంమహాసముద్రంలో సామర్థ్యాన్ని పెంపొందించటంశిక్షణమానవ వనరుల నిర్వహణస్థిర నిర్వహణ పద్ధతులుమానవ రహిత వ్యవస్థల సమర్థవంతమైన వినియోగంకార్యాచరణ నిర్వహణయుద్ధ సంసిద్ధతను పెంచే కీలక అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించనున్నాయినౌకాదళంలో సమస్యల పరిష్కారానికి ఏఐ రోడ్‌మ్యాప్‌ అమలునిరంతర కార్యకలాపాల కోసం డేటా ఆధారిత సాంకేతికతపైనా చర్చలు జరుగుతాయి.

భారత నౌకాదళ సిద్ధాంతం (ఐఎండీ)లో వివరించిన నావికాదళ నాలుగు కీలక పాత్రలకు అనుగుణంగాప్రభుత్వ ఆదేశాల మేరకు సైనిక విజయాన్ని అందించేందుకు సన్నద్ధతను నౌకాదళ అగ్ర నాయకత్వం సమీక్షిస్తుందినిరంతర కార్యకలాపాలుఅంతర్జాతీయ సహకారాన్ని విస్తరించటంభారత ప్రభుత్వ విజన్ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ ఎక్రాస్ రీజియన్స్ (మహాసాగర్)ను ముందుకు తీసుకెళ్లటంస్వదేశీ పరిజ్ఞానంఆవిష్కరణల వైపు సాగించే ప్రయత్నాలపై దృష్టి సారిస్తుందిఐఓఆర్ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత గల భద్రతా భాగస్వామిగా భారత నౌకాదళాన్ని నిలబెట్టటమే లక్ష్యంగా ఈ సదస్సులో చర్చలు జరుగుతాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2251308) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati