ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఐఐటీ హైదరాబాద్లో రెండు రోజుల ఎన్హెచ్సీఎక్స్ ఇన్నోవేషన్ మీట్కు ముగింపు పలికిన ఎన్హెచ్ఏ: తాము రూపొందించిన పరిష్కారాలను ప్రదర్శించిన ఎన్హెచ్సీఎక్స్ హ్యాకథాన్ ఫైనలిస్టులు
నాడు పోస్టు చేయడమైనది:
07 MAR 2026 3:54PM by PIB Hyderabad
ఐఐటీ హైదరాబాద్లో నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) నిర్వహిస్తున్నఎన్హెచ్సీఎక్స్ ఇన్నోవేషన్ మీట్ ముగిసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) పరిధిలో పరస్పరం ఆధారపడి పనిచేసే, నియంత్రణలకు అనుగుణంగా ఆరోగ్య పరిష్కారాల స్వీకరణను ముందుకు తీసుకెళ్లేలా నియంత్రణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక దిగ్గజాలు, సాంకేతిక ఆవిష్కర్తలు, విద్యాసంస్థలను ఈ కార్యక్రమం ఒక్కచోట చేర్చింది.
2026 మార్చి 6, 7 తేదీల్లో ఈ కార్యక్రమం జరిగింది. 2026 ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించిన ఎన్హెచ్సీఎక్స్ హ్యాకథాన్ పోటీల గ్రాండ్ ఫినాలేను కూడా ఈ రెండు రోజుల కార్యక్రమం సూచిస్తుంది. ఇక్కడ విజేతలుగా నిలిచిన బృందాలు తమ పరిష్కారాలను విశిష్ట అతిథుల ముందు ప్రదర్శించారు.
ఏబీడీఎం పరిధిలో పని చేేసే మూడు సంస్థల్లో నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్హెచ్సీఎక్స్) ఒకటి. దేశ వ్యాప్తంగా ఆరోగ్య బీమా క్లెయిముల ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రామాణికీకరణ కోసం ఇది ఏర్పాటైంది. ఆసుపత్రులు, బీమా సంస్థలు, రోగుల మధ్య క్లెయిముల డేటాను సులభంగా మార్చుకోవడానికి వీలుగా ఏకీకృత డిజిటల్ మౌలిక వసతులను ఈ సంస్థ అందిస్తుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (జీఐసీ), నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ ఈహెచ్ఆర్ స్టాండర్డ్స్ (ఎన్ఆర్సీఈఎస్), ఇన్స్యూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ), నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్), ఐఐటీ హైదరాబాద్, గూగుల్, ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్ (ఐఐఏ), ఎన్ఏటీహెల్త్ సంయుక్తంగా ఈ హ్యాకథాన్ నిర్వహించాయి. క్లెయిముల ప్రక్రియను సులభతరం చేసే దిశగా సహకారాత్మక విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

(ఎడమ నుంచి కుడికి) ఐఐటీ హైదరాబాద్ డీన్ ప్రొఫెసర్ జీ నరహరి శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్, అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (ఏహెచ్పీఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జ్ఞాని, ఏబీడీఎం జేఎస్, ఎండీ శ్రీ కిరణ్ గోపాల్ వస్కా
ఎన్హెచ్సీఎక్స్ ఇన్నోవేషన్ మీట్ రెండో రోజు ప్రారంభ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్, అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (ఏహెచ్పీఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జ్ఞాని, ఐఐటీ హైదరాబాద్ డీన్ ప్రొఫెసర్ జీ నరహరి శాస్త్రి, ఇతర విశిష్ట అతిథులు, పారిశ్రామిక, విద్యా ప్రతినిధులు పాల్గొన్నారు.
భారత ఇన్స్యూరెన్స్ రంగంలో ఆరోగ్య క్లెమయిలు సంక్లిష్టత అనేది అత్యంత దీర్ఘకాలంగా ఎదురవుతున్న సమస్య అని డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్ తన ప్రసంగంలో వివరించారు. అలాగే మిలియన్ల మంది పౌరులను ప్రభావితం చేసే ప్రక్రియకు ప్రామాణీకరణ, పరస్పరం ఆధారపడే విధానాన్ని తీసుకురావడంలో ఎన్హెచ్సీఎక్స్ పాత్రను వివరించారు.
‘‘ఆసుపత్రులు, బీమా సంస్థలకు మాత్రమే నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్ పరిమితం కాలేదు. ఇది రోగులు, ఆరోగ్యసేవలు అందించేవారు, బీమా సంస్థలు, సాంకేతిక ఆవిష్కర్తలతో సహా మొత్తం వ్యవస్థకు సేవలు అందించేందుకు రూపొందించిన వ్యవస్థ. యూపీఐ లాంటి డిజిటల్ మౌలిక వసతుల మాదిరిగానే ఎన్హెచ్సీఎక్స్కు దీర్ఘకాలిక లక్ష్యం కూడా ఉంది. వ్యవస్థను ఏ సంస్థ నిర్వహిస్తుందో తెలియనప్పటికీ అది సజావుగా, నమ్మకమైన సేవలు అందిస్తే ప్రజలు ఆ వేదికను విశ్వసిస్తారు.’’
- డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్, సీఈవో, నేషనల్ హెల్త్ అథారిటీ

విస్తృత స్థాయిలో అందించే నాణ్యమైన సేవలను మెరుగుపరిచేందుకు డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ, డేటా ఆధారిత వ్యవస్థలే కేంద్రంగా ఉన్నాయనే ఏకాభిప్రాయం విశిష్ట అతిథుల ప్రారంభోపన్యాసాల్లో వ్యక్తమయింది.
‘‘డిజిటల్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాథమిక బ్లాకులను నిర్మించే శక్తిని ఆంధ్రప్రదేశ్లో మేం బలంగా విశ్విస్తున్నాం. రాష్ట్రంలో జనాభా అంతటికీ ఏబీహెచ్ఏ సంఖ్యలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది. అలాగే దీనికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇది డిజిటల్ ప్రజా మౌలిక వసతులను బలోపేతం చేయడంలోనూ, డిజిటల్ ఆరోగ్య రంగంలో ప్రతి పౌరుడికీ భాగస్వామ్యం అందించడంలోనూ మా అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది.’’
- శ్రీ సౌరభ్ గౌర్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి
పోటీలకు సమర్పించిన 110 పరిష్కారాలను ఐఐటీ హైదరాబాద్, ఎన్ఆర్సీఈఎస్, జీఐసీ, గూగుల్, ఐఐఏ, ఎన్ఏటీహెల్త్, ఎన్హెచ్ఏ ప్రతినిధులతో కూడిన స్వతంత్ర నిపుణుల జ్యూరీ మూల్యాంకనం చేసింది. ఆరోగ్య బీమా క్లెయిములకు సంబంధించిన కీలకమైన సమస్యలను పరిష్కరించే వినూత్న ఆవిష్కరణలను గుర్తిస్తూ హ్యాకథాన్ విజేతలను సత్కరించారు.

దేశవ్యాప్తంగా ఏబీడీఎంను స్వీకరించేందుకు సహకారాన్ని బలోపేతం చేయడం, భాగస్వాములు చేసిన కృషిని గుర్తించడమే లక్ష్యంగా మూడు భాగస్వామ్యాలను ఎన్హెచ్ఏ ఈ సందర్భంగా ప్రారంభించింది. చెల్లింపులు, సేవల వ్యవస్థ అంతంటా ఎన్హెచ్సీఎక్స్ను అమలు చేయడంలోనూ, విస్తరించడంలోనూ తమ వంతు పాత్రను అంకితభావంతో పోషించిన సంస్థలను ఎన్హెచ్సీఎక్స్ ఛాంపియన్స్ గుర్తిస్తుంది. ప్రభుత్వ మార్గాల ద్వారా మాత్రమే కాకుండా, తమ పరిధిలో ఏబీడీఎంపై అవగాహన పెంచిన సంస్థలు, నైపుణ్య విభాగాలను ఏబీడీఎం అంబాసిడర్స్ గుర్తిస్తుంది. ఎన్హెచ్సీఎక్స్ ద్వారా సమర్పించిన పీఎం-జేఏవై క్లెయిములను అందించేందుకు విజయవంతమైన మాడ్యూళ్లను తయారు చేసిన సంస్థలను ఎన్హెచ్సీఎక్స్-పీఎంజేఏవై ఎర్లీ ఇంటిగ్రేటర్స్ సత్కరిస్తుంది. తద్వారా ప్రామాణికమైన, పరస్పర ఆధారిత క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్ పరిధిలోకి ప్రభుత్వం నిధులు అందిస్తున్న, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య భరోసా పథకాన్ని తీసుకువస్తుంది. ఈ మూడు కార్యక్రమాల పరిధిలో మొదటి విడత పురస్కార గ్రహీతలను ఇన్నోవేషన్ మీట్లో ప్రకటించారు.
ప్రభుత్వం, నియంత్రణ, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు చెందిన వారిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్యానెల్ చర్చలు ఇన్నోవేషన్ మీట్లో జరిగాయి. క్లెయిముల సవాళ్లకు సంబంధించి సాంకేతిక, కార్యాచరణ కోణాలపై మొదటి రోజు చర్చలు జరిగాయి. క్లెయిము సెటిల్మెంట్లకు ప్రామాణీకరణ, ఏఐ, సాంకేతికత ద్వారా ఆరోగ్య బీమా వ్యవస్థ రూపాంతరం లాంటి అంశాలపై చర్చించారు. రెండో రోజు విస్తరణ, స్వీకరణపై రెండో రోజు దృష్టి సారించారు. అలాగే క్లెయిముల ప్రక్రియ భవిష్యత్తు, ఎన్హెచ్సీఎక్స్ను ఆసుపత్రులు స్వీకరించడంలో ఎదురయ్యే నిర్దిష్ట అడ్డంకులు, ప్రోత్సహకాలను పరిశీలించారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్హెచ్ఏ జాయింట్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్(ఏబీడీఎం) శ్రీ కిరణ్ గోపాల్ వస్కా ముగించారు. ఈ రెండు రోజుల్లో నిర్వహించిన చర్చల సారాంశాన్ని ఆయన సమర్పించారు. అనంతరం ఐఆర్డీఏఐ ఛైర్మన్ శ్రీ అజయ్ సేథ్ ముగింపు ఉపన్యాసం చేశారు. ఆరోగ్య వ్యవస్థ ఆధారిత ఆవిష్కరణలు, అత్యున్నత స్థాయి విధాన చర్చలు, క్షేత్రస్థాయిలో ఎన్హెచ్సీఎక్స్ స్వీకరణను ప్రోత్సహించే సంస్థలకు గుర్తింపు మేలు కలయికతో ఇన్నోవేషన్ మీట్ జరిగింది. ఇది భారత్లో డిజిటల్ ప్రాధాన్యమైన, పరస్పర ఆధారిత ఆరోగ్య క్లెయిముల వ్యవస్థకు గణనీయమైన వేగాన్ని అందిస్తుందని అంచనా వేస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2236420)
సందర్శకుల సూచీ సంఖ్య : : 30