రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సముద్ర, గగనతల పరమైన సమన్వయ ఆపరేషన్ ద్వారా అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ రాకెట్‌ను పట్టుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్

నాడు పోస్టు చేయడమైనది: 07 FEB 2026 10:53AM by PIB Hyderabad

అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ రాకెట్‌ను భారత తీర రక్షక దళం (ఐసీజీవిజయవంతంగా ఛేదించిందిఫిబ్రవరి 5, 6 తేదీల్లో సముద్రగగనతల బృందాల సమన్వయంతో అత్యంత పకడ్బందీగా చేపట్టిన ఆపరేషన్ ద్వారా యుద్ధంఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల నుంచి పెద్దఎత్తున చమురుచమురు ఆధారిత కార్గోను అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఈ ఆపరేషన్ అడ్డుకుంది.

ఫిబ్రవరి 5, 2026న ముంబైకి పశ్చిమాన సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో మూడు అనుమానాస్పద నౌకలను భారత కోస్ట్ గార్డ్ నౌకలు అడ్డుకున్నాయివాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయటంవాటిలో లభించిన ఎలక్ట్రానిక్ డేటాను విశ్లేషించటంపత్రాల ధ్రువీకరణసిబ్బందిని విచారించటం ద్వారా ఐసీజీ స్పెషలిస్ట్ బోర్డింగ్ బృందాలు ఈ నేరానికి సంబంధించిన పూర్తి వ్యవస్థనునేరగాళ్లు అనుసరించిన పద్ధతిని తెలుసుకోగలిగాయి.

ఈ స్మగ్లింగ్ ముఠా, తక్కువ ధరకు లభించే చమురును సముద్రంలో నౌకల ద్వారా రవాణా చేసిఅంతర్జాతీయ జలాల్లో మోటార్ ట్యాంకర్లలోకి మార్చేవారుఈ ముఠాలో వివిధ దేశాలకు చెందిన హ్యాండ్లర్లు ఉన్నట్లువారు సముద్రం మధ్యలో నౌకల ద్వారా సరుకు అమ్మకాలుబదిలీలను నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

భారత ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్పరిధిలో అనుమానాస్పదంగా ఉన్న మోటార్ ట్యాంకర్‌ను ఐసీజీ అత్యాధునిక సాంకేతిక నిఘా వ్యవస్థలు గుర్తించాయిదీని ఆధారంగా చేపట్టిన డిజిటల్ విచారణనౌకల కదలికల విశ్లేషణలో.. ఆ ట్యాంకర్ వద్దకు మరో రెండు నౌకలు వచ్చినట్లు తెలిసిందిభారత్ సహా తీరప్రాంత దేశాలకు చెల్లించాల్సిన సుంకాలను ఎగ్గొట్టేందుకుచట్టవిరుద్ధంగా ఒక నౌక నుంచి మరో నౌకలోకి చమురును బదిలీ చేస్తున్నట్లు అనుమానం వ్యక్తమైందిఈ నేపథ్యంలోనే ఆపరేషన్‌ను ప్రారంభించారు.

ఫిబ్రవరి 5, 2026న స్వయంగా నౌకల వద్దకు వెళ్లి డిజిటల్ సాక్ష్యాలను ధ్రువీకరించుకున్న తర్వాతమూడు నౌకలను అదుపులోకి తీసుకున్నారుసముద్ర చట్టాలను అమలు చేసే సంస్థల నుంచి తప్పించుకునేందుకు ఈ నౌకలు తరచుగా గుర్తింపును మారుస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందిఅంతేకాకఈ నౌకల యజమానులు విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు ద్వారా తెలుస్తోందిఅదుపులోకి తీసుకున్న ఈ నౌకలను తదుపరి విచారణకు ముంబైకి తరలించే అవకాశముందిచట్టపరమైన చర్యల నిమిత్తం వీటిని భారత కస్టమ్స్ఇతర చట్ట అమలు సంస్థలకు అప్పగించనున్నారు.

అత్యాధునిక డిజిటల్ నిఘా ద్వారా ప్రారంభమైభారత తీరరక్షక దళం విస్తృత సముద్రయాన ఉనికితో అమలైన ఈ ఆపరేషన్సముద్ర తీర ప్రాంతంలో 'ప్రధాన భద్రతా ప్రదాత'గాఅంతర్జాతీయ సముద్ర నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసే శక్తిగా భారతదేశ పాత్రను మరోసారి స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2224876) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam