గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత్ భారత్‌ - 2047 లక్ష్యసాధనకు బలమైన పునాదిగా

ఖనిజ వనరుల వినియోగం, అభివృద్ధి, విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై జాతీయ సమావేశం

प्रविष्टि तिथि: 09 JAN 2026 7:01PM by PIB Hyderabad

వికసిత భారత్ 2047 కోసం భారత గనుల రంగానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తూ గుజరాత్ లోని గాంధీనగర్‌లో రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ మేధోమథనం) 2026 ప్రారంభమైంది. ఈ రంగంలో సమన్వయ సంస్కరణలు ఆవిష్కరణలకు ఈ సమావేశం రంగాన్ని సిద్ధం చేసిందిగుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్  ఈ సమావేశాన్ని ప్రారంభించారుకేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డికేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్పాటిల్బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హాబొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుసమావేశాన్ని సంయుక్తంగా ప్రారంభించిన గౌరవ అతిథులు స్వావలంబన కలిగినసాంకేతికంగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా సుస్థిరమైన ఖనిజ అభివృద్ధిసమర్థవంతమైన ప్రాజెక్టు అమలుశాఖల మధ్య సమన్వయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు

వివిధ రాష్ట్రాల గనుల శాఖ మంత్రులుకేంద్రరాష్ట్ర శాఖల ఉన్నతాధికారులతో కలిసి గనుల రంగానికి సంబంధించిన పలు అంశాలపై సవివరంగా తమ అభిప్రాయాలను వెల్లడించారుప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సవాళ్లుశాఖల మధ్య సమన్వయంరాష్ట్రాల వారీ సమస్యలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారువారు తమ వివరణాత్మక ప్రసంగాలలో ఆచరణాత్మక పరిష్కారాలను ప్రతిపాదించడంతో పాటుఉత్తమ విధానాలను ప్రస్తావించారుగనుల రంగంలో నిర్వహణ తీరును బలోపేతం చేయడంనిర్వాహక సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం కేంద్రంరాష్ట్రాల మధ్య సమన్వయంతో కూడిన చర్చలకు ప్రాతిపదికను అందించారుఅమలులో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడంతో పాటుసాంకేతిక అనుభవాలను పంచుకున్నారుఅలాగేవనరుల సుస్థిర వినియోగానికి దోహదపడే నూతన ఆవిష్కరణాత్మక విధానాలపై కూడా చర్చించారు.

సాయంత్రం సెషన్ లో కేంద్రమంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... చింతన్ శిబిర్ లక్ష్యాలుప్రాముఖ్యతను వివరించారుగనుల రంగంలో శ్రామిక శక్తి నిర్వహణనిర్వహణ పరమైన విధానాలను మెరుగుపరచడానికి లేబర్ కోడ్‌ గురించి అవగాహనను అందించారుగనుల రంగంలో సహకారాన్నివిజ్ఞానాన్ని పంచుకోవడాన్ని మరింత బలోపేతం చేసే విధంగా కేంద్రరాష్ట్ర భాగస్వాముల వాటాదారుల మధ్య అర్థవంతమైన చర్చలుపరస్పర చర్యలతో ఆ రోజు సమావేశం ముగిసింది.

మొదటి రోజు కార్యక్రమం సదస్సుకు బలమైన పునాది వేసిందిరెండో రోజు కార్యక్రమాన్ని ప్రధానంగా జాతీయ కీలక ఖనిజ మిషన్ ఉద్దేశించారుఇది భారతదేశంలోని కీలక ఖనిజాలను గుర్తించడంప్రోత్సహించడంవ్యూహాత్మకంగా వినియోగించడం ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రేరేపించి వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి కీలకం కానుంది


(रिलीज़ आईडी: 2213675) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati