పర్యటక మంత్రిత్వ శాఖ
భారత పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చాటేలా పీహెచ్డీసీసీఐ ఆధ్వర్యంలో నేషనల్ యంగ్ షెఫ్ కాంపిటీషన్
ఢిల్లీలో ఘనంగా సన్నాహక కార్యక్రమం.. సంప్రదాయాన్నీ సృజననూ మేళవిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిభావంతులకు ప్రోత్సాహం
Posted On:
16 JUL 2025 10:39AM by PIB Hyderabad
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో కలిసి పీహెచ్డీ వాణిజ్య, పారిశ్రామిక మండలి (పీహెచ్డీసీసీఐ) అధికారికంగా నేషనల్ యంగ్ షెఫ్ కాంపిటీషన్ (ఎన్వైసీసీ)ను ప్రారంభించింది. న్యూఢిల్లీలోని పీహెచ్డీ హౌస్లో సన్నాహక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆతిథ్య రంగంలోని చివరి సంవత్సరం విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభావంతులను గుర్తించడం, మార్గనిర్దేశం చేయడంతోపాటు వారి ప్రతిభను చాటుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా (ఐఏఎస్) మాట్లాడుతూ.. భారత పాక సంప్రదాయాలు ప్రాభవం కోల్పోకుండా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. “సాంస్కృతిక విజ్ఞానం, ప్రాంతీయ నైపుణ్యాలు మన పాకశాస్త్ర ప్రావీణ్యానికి ప్రాతిపదికలు. మనం ఈ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు అత్యుత్తమ వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా భారత పాకశాస్త్ర ఘనతను చాటాలి” అని అన్నారు. యువ షెఫ్లు సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అంతర్జాతీయ వేదికలపై ఆత్మవిశ్వాసంతో భారత్కు ప్రాతినిధ్యం వహించాలని పిలుపునిచ్చారు.
భారత పాకనిపుణుల సంఘాల సమాఖ్య (ఐఎఫ్సీఏ), పర్యాటక, ఆతిథ్య నైపుణ్య మండలి (టీహెచ్ఎస్సీ) సంయుక్తంగా ఎన్వైసీసీని నిర్వహిస్తున్నాయి. ‘భారత పాకశాస్త్ర ప్రావీణ్యం: సంప్రదాయం, సృజనాత్మకతల మేళవింపు’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జోనల్ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో న్యూఢిల్లీలోని ఐహెచ్ఎం, పూసాలో జరిగే ఫైనల్ పోటీతో ఇది ముగుస్తుంది.
జోన్లవారీ షెడ్యూల్:
• నార్త్ జోన్: 2025 ఆగష్టు 2025, ఏఐహెచ్ఎం, చండీగఢ్
• ఈస్ట్ జోన్: 2025 సెప్టెంబరు 18, ఐహెచ్ఎం, కలకత్తా
• వెస్ట్ జోన్: 2025 నవంబరు, ఐహెచ్ఎం, ముంబయి
• సౌత్ జోన్: 2025 డిసెంబరు 18, ఐహెచ్ఎం, కోవలం
ప్రతీ జోనల్ వేదిక వద్ద ప్రధాన పోటీలతోపాటు 11వ, 12వ తరగతి విద్యార్థులకు ఎన్వైసీసీలో భాగంగా కెరీర్ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఆతిథ్య విద్యలో విద్యార్థుల నమోదును పెంచడంతోపాటు పాకశాస్త్ర సంబంధిత ఉద్యోగావకాశాలను విద్యార్థులకు పరిచయం చేయడం వంటి అంశాలపైనా చర్చిస్తారు.
పీహెచ్డీసీసీఐ పర్యాటక కమిటీ కో చైర్మన్ శ్రీ రాజన్ సెహగల్ మాట్లాడుతూ.. భారతీయ పాకశాస్త్ర ఘనతను చాటేలా పరిశ్రమలు, విద్యావ్యవస్థ, యువతను ఏకం చేసే ‘ఉద్యమం’గా ఎన్వైసీసీని అభివర్ణించారు. “ఎన్వైసీసీ ఓ పోటీ మాత్రమే కాదు. ఇదొక సాంస్కృతిక పునరుజ్జీవం. వైవిధ్యభరితమైన భారత ఆహార వారసత్వాన్ని కాపాడుకుని, ఆధునికీకరించే దిశగా పిలుపునిస్తోంది’’ అని ఐఎఫ్సీఏ అధ్యక్షుడు డాక్టర్ మన్జీత్ గిల్ వ్యాఖ్యానించారు.

షెఫ్ సుధీర్ సిబల్, షెఫ్ అనిల్ గ్రోవర్, శ్రీ రాజన్ బహదూర్ (టీహెచ్ఎస్సీ), ప్రొఫెసర్ కమల్ కాంత్ పంత్ (ఐహెచ్ఎం, పూసా), శ్రీ అమర్ జిత్ సింగ్ అహుజా (లే మెరిడియన్) కార్యక్రమంలో పాల్గొన్నారు. పీహెచ్ డీసీసీఐకి చెందిన శ్రీమతి శాలిని ఎస్ శర్మ పోటీ విధివిధానాలను వివరించారు.
130కి పైగా ఆతిథ్య సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీనస్ ఇండస్ట్రీస్, నెస్లే ప్రొఫెషనల్, వాఘ్ బక్రీ టీ గ్రూప్, క్రెమికా, మెక్ కెయిన్ ఫుడ్స్ తదితర ప్రముఖ సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. విజేతలకు నగదు బహుమతులు, ఇంటర్న్ షిప్లు, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తాయి. ‘బెస్ట్ సస్టెయినబుల్ డిష్’కు ప్రత్యేక అవార్డు అందిస్తారు.
***
(Release ID: 2145132)