సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘‘మూడు కొత్త క్రిమినల్ చట్టాలు’’ పై వార్తాలాప్ పేరిట మీడియా వర్క్‌షాప్ నిర్వహించిన ఏపీ రీజియన్ పత్రికా సమాచార కార్యాలయం.


జూలై 1, 2024, నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాలు. శిక్ష కంటే న్యాయం పైనే ఇవి దృష్టి పెట్టనున్నాయి.

‘‘అందరికీ న్యాయం అందించడం’’ అనడం ద్వారా సమకాలీన మరియు సాకేంతికతలకు అనుగుణంగా పొందుపరిచిన కొత్త నిబంధనలు.

Posted On: 22 MAY 2024 6:45PM by PIB Hyderabad

దేశంలో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు తీసుకోనున్న చర్యలలో భాగంగా; కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు - భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం. ఈ మూడు చట్టాలు రానున్న జూలై 1, 2024 నుండి అమలులోకి రానున్నాయి. 

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ మూడు చట్టాలు భారత శిక్షా స్మృతి (IPC), 1860; క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), 1973; మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 లను రీప్లేస్ చేయనున్నాయి. ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగింది.

ఈ మూడు కొత్త చట్టాలు నేరస్థులకు శిక్ష వేయడం కంటే బాధితులకు న్యాయం అందించడం పైనే దృష్టి పెడతాయి. సత్వర న్యాయం అందించడం, న్యాయవ్యవస్థ మరియు న్యాయస్థాన నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా 'అందరికీ న్యాయం అందించడం' పై దృష్టి సారించనున్నాయి. ఈ మూడు కొత్త చట్టాలకు డిసెంబర్ 21, 2023న పార్లమెంట్ ఆమోదం లభించింది. అలాగే గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము డిసెంబర్ 25, 2023న సమ్మతిని ఇవ్వడం జరిగింది.

ఈ వర్క్‌షాప్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ రాజిందర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన తన పరిచయ సందేశంలో, పత్రికా సమాచార కార్యాలయం మరియు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు అందించడంలో దాని పాత్రను సంక్షిప్తంగా పరిచయం చేశారు. బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం, నేరాల విచారణ మరియు విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా అవసరమైన మెరుగులు దిద్దడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ IPS (రిటైర్డ్), మరియు మాజీ IG ఆఫ్ పోలీస్ అయిన శ్రీ. E. దామోదర్ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ సవరించిన క్రిమినల్ చట్టాలు మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా నవీకరించబడ్డాయని అన్నారు. క్రిమినల్ చట్టాల సూక్ష్మ నైపుణ్యాలను మరియు కొత్త మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సమాజానికి వాటి ఆచరణాత్మక ఉపయోగం మరియు చుట్టూ జరుగుతున్న నేరాల గురించి ఆయన క్లుప్తంగా అందరికీ వివరించారు. తాజా మరియు సవరించిన చట్టాలను అమల్లోకి తీసుకురావడం ప్రభుత్వం చేసిన మంచి ప్రారంభమని ఆయన అన్నారు. కొత్త చట్టాలలో పేర్కొన్న కమ్యూనిటీ సర్విస్ శిక్షలు మనకు ఇంతకు ముందు పూర్తిగా తెలియనివి. కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై "జోన్ వారీ" విధానంలో న్యాయవ్యవస్థ మరియు పోలీసు శాఖలకు చెందిన పలువురు అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్, డా. నందిని సి.పి., మహిళలు మరియు పిల్లల పై జరుగుతున్న నేరాలు, వాటి దర్యాప్తు ప్రక్రియ, ఎఫ్‌ఐఆర్‌లు మరియు ఇతర ఫిర్యాదుల ద్వారా నేరాల నమోదు, అరెస్టులు మరియు కస్టడీ, బెయిల్, శిక్షకు సంబంధించిన విధానం, బాధితులు, ప్రకటిత నేరస్థుల పాత్ర గురించి హైలైట్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు; అలాగే  కంప్యూటర్ మరియు కమ్యూనికేషన్ పరికరాల యొక్క ప్రధాన అంశాలలో, నేరాన్ని నిర్ణయించే సమయంలో మరియు రుజువుల ప్రమాణంగా తీర్పును ఆమోదించే సమయంలో ఒప్పుకోలు రికార్డ్ చేయడంతో పాటు ఇది చాలా ప్రాధాన్యతనిస్తుంది అని అన్నారు. భారతీయ సాక్ష్యా అధినీయం, దీని పూర్వ సంస్కరణ భారతీయ సాక్ష్యాధారాల చట్టం గురించి నొక్కిచెప్పిన డాక్టర్ నందిని, కొత్త క్రిమినల్ చట్టాల ప్రవేశంతో మారిన దృష్టాంతంలో ప్రాదేశిక మరియు ఎక్స్‌ట్రాటెరిటోరియల్ స్వభావం యొక్క సాక్ష్యాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

 

 

 

 

 

#



(Release ID: 2021351) Visitor Counter : 337


Read this release in: English