ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలపై - తాజా సమాచారం


జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని 738 జిల్లాల్లో అమలుకు మంజూరు చేశారు

34 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో 46 టెలీ మానస్ కేంద్రాలు ఏర్పాటు చేయగా హెల్ప్-లైన్ లో 4,81,000 మందికి పైగా సమాచారం అందించడం జరిగింది.

Posted On: 08 DEC 2023 4:47PM by PIB Hyderabad

దేశంలో సరసమైన, అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడానికి, దేశంలో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం (ఎన్.ఎం.హెచ్.పి) ని ప్రభుత్వం అమలు చేస్తోంది.  ఎన్.ఎం.హెచ్.పి. లో భాగంగా జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డీ.ఎం.హెచ్.పీ) 738 జిల్లాల్లో అమలుకు మంజూరు చేయడం జరిగింది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మద్దతు అందిస్తున్నారు.  సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సి.హెచ్.సి), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీ.హెచ్.సీ) స్థాయిలో డీ.ఎం.హెచ్.పీ. ఆధ్వర్యంలో -  అవుట్ పేషెంట్ సేవలు, అంచనా, కౌన్సిలింగ్ / మానసిక-సామాజిక జోక్యం, తీవ్ర మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తులకు నిరంతర సంరక్షణ, మద్దతు, మందులు, ఔట్రీచ్ సేవలు, అంబులెన్స్ సేవలు మొదలైన సౌకర్యాలు అందుబాటులో ఉంచడం జరిగింది.  వీటికి అదనంగా జిల్లా స్థాయిలో 10 పడకల ఇన్-పేషెంట్ సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతోంది.

పైన పేర్కొన్న సేవలతో పాటు, దేశంలో నాణ్యమైన మానసిక ఆరోగ్య సలహాలు, సంరక్షణ సేవలను మెరుగుపరచడం కోసం, కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్, 10వ తేదీన “జాతీయ టెలీ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని” ప్రారంభించింది.  ఇందులో భాగంగా, 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 46 టెలీ మానస్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2023 డిసెంబర్, 4వ తేదీ నాటికి హెల్ప్-లైన్ ద్వారా 4,81,000 మందికి అవసరమైన సమాచారం అందించడం జరిగింది.

ఎన్.ఎం.హెచ్.పి. కి చెందిన తృతీయ సంరక్షణ కాంపోనెంట్ కింద మానసిక ఆరోగ్య స్పెషాలిటీల్లో పీ.జీ. విభాగాల్లో తీసుకునే విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు తృతీయ స్థాయి చికిత్స సౌకర్యాలు కల్పించేందుకు 25 ప్రతిభా కేంద్రాలను కూడా మంజూరు చేయడం జరిగింది. వీటితో పాటు, మానసిక ఆరోగ్య ప్రత్యేకతల్లో 47 పీ.జీ. విభాగాలను బలోపేతం చేసేందుకు 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు/సంస్థలకు కూడా ప్రభుత్వం మద్దతు తెలిపింది.  అలాగే 22 ఎయిమ్స్ సంస్థల్లో మానసిక ఆరోగ్య సేవల సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ సేవలు పి.ఎం.జె.ఏ.వై. కింద కూడా అందుబాటులో ఉన్నాయి.

కౌమార జనాభా సంపూర్ణ అభివృద్ధి జరిగేలా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2014 నుంచి రాష్ట్రీయ కిశోర్ స్వస్త్య కార్యక్రామాన్ని (ఆర్.కె.ఎస్.కే) అమలు చేస్తోంది.  పాఠశాలలకు వెళ్ళే వారితో పాటు పాఠశాలలకు వెళ్ళని కౌమార దశ పిల్లలు కూడా ఆర్.కె.ఎస్.కే. పరిధిలోకి వస్తారు.  క్లినిక్-ఆధారిత సేవల నుంచి అభివృద్ధి, నివారణ, పాఠశాలలు, కుటుంబాలు, సంఘాల వంటి వారి స్వంత వాతావరణంలో కౌమారదశకు చేరుకోవడానికి ఇది ఒక నమూనా మార్పుగా పనిచేస్తుంది.  లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం (ఎస్.ఆర్.హెచ్), పోషణ, గాయాలు, హింస (లింగ-ఆధారిత హింస తో సహా), సంక్రమణేతర వ్యాధులు, పదార్థాల దుర్వినియోగం కాకుండా దృష్టి పెట్టే ఆర్.కె.ఎస్.కే. ముఖ్య నేపథ్య రంగాల్లో మానసిక ఆరోగ్యం కూడా ఒకటి.

కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్ (ఏ.ఎఫ్.హెచ్.సి), పీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తో పాటు, కౌమార ఆరోగ్య, శ్రేయస్సు రోజులు (ఏ.హెచ్ & డబ్ల్యూ.డి) వంటి కార్యక్రమాలతో పాటు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, కౌమార దశ వ్యక్తులను కూడా కీలక భాగస్వాములను చేయడం ద్వారా కౌన్సిలింగ్ సేవల్లో పాల్గొనే విధంగా మానసిక ఆరోగ్య సమస్యలపై వారికి అవగాహన కల్పించడం పై ఆర్.కె.ఎస్.కె. దృష్టి సారిస్తోంది. 

ఆయుష్మాన్ భారత్ పాఠశాల ఆరోగ్యం, శ్రేయస్సు కార్యక్రమంలో భాగంగా  “భావోద్వేగ శ్రేయస్సు, మానసిక ఆరోగ్యం” అనే అంశాన్ని ఒక అంకితమైన మాడ్యూల్ గా  పొందుపరచడం జరిగింది.  మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు పై పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి, అవగాహన కల్పించడానికి, ఈ కార్యక్రమంలోని ఇతర నేపథ్య రంగాలతో పాటు మానసిక ఆరోగ్యంపై ఆరోగ్య, శ్రేయస్సు రాయబారులు (ఉపాధ్యాయులు) శిక్షణ ఇస్తారు.  స్వీయ మరియు ఇతరులలో క్షోభ యొక్క స్వీయ-భావోద్వేగ సంకేతాలను గుర్తించడంతో పాటు, 'మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు' అనేవి ఒకదాని వెంట ఒకటిగా ఉండే నిరంతర ప్రక్రియగా గుర్తించడం పై ఈ శిక్షణ దృష్టి పెడుతుంది.  ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన రాయబారులు విద్యార్థులతో పరస్పరం స్పందించే విధంగా మాట్లాడతారు.  ఆనందకరమైన అభ్యాసాన్ని ప్రోత్సహించే వారాంతపు సదస్సుల ద్వారా సందేశాలను ప్రసారం చేస్తారు.

ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలోని పాఠశాల ఆరోగ్య కార్యక్రమం కింద, “శిక్షణ, రిసోర్స్ మెటీరియల్: పాఠశాలలకు వెళ్ళే పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు” పేరుతో ఎన్.సి.ఈ.ఆర్.టి. ఒక సమగ్ర ప్యాకేజీని అభివృద్ధి చేసింది.   విద్యార్థులు, ఉపాధ్యాయుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన కార్యకలాపాలను కలిగి ఉన్న “భావోద్వేగ క్షేమం, మానసిక ఆరోగ్యం” పై ఒక నిర్దిష్ట అంశాన్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది.  

పాఠశాలలకు వెళ్ళే పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యల ప్రారంభ గుర్తింపు, జోక్యం కోసం మార్గదర్శకాలతో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పి.హెచ్.ఎఫ్.ఐ) సహకారంతో ఒక చిన్న పుస్తకాన్ని రూపొందించడం జరిగింది.  ఇది పాఠశాలకు వెళుతున్న పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలను (ఒత్తిడి/అనారోగ్యం) ప్రారంభ దశలోనే గుర్తించడం, జోక్యం కోసం ఉపాధ్యాయులు, సలహాదారులు, ఇతర వాటాదారుల శిక్షణకు అవసరమైన మార్గదర్శకాలను కలిగి ఉంది.  కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ చిన్న పుస్తకాన్ని 2022 సెప్టెంబర్, 6వ తేదీన విడుదల చేసింది. 

కోవిడ్ వ్యాప్తి సమయంలో మరియు అంతకు మించి మానసిక ఆరోగ్యం మరియు భావోద్వేగ క్షేమం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు కుటుంబాలకు మానసిక మద్దతు అందించడానికి విస్తృత శ్రేణి కార్యకలాపాలను కవర్ చేస్తూ విద్యా మంత్రిత్వ శాఖ 'మనో దర్పన్' అనే పేరుతో ఒక క్రియాశీల కార్యక్రమాన్ని చేపట్టింది.  మనో దర్పన్ కార్యక్రమం కింద, సలహా మార్గదర్శకాలతో ఒక వెబ్ పేజీ (URL: http://manodarpan.education.gov.in) రూపొందించడం జరిగింది. మానసిక, సామాజిక మద్దతు కోసం తరచూ అడిగే ప్రశ్నలు (ఎఫ్.ఎ.క్యూ), ప్రాక్టికల్ టిప్స్, పోస్టర్లు, వీడియోలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు/అధ్యాపకులు, కుటుంబాలకు చేయవలసిన పనులు ఈ వెబ్-పేజీలో పొందుపరచడం జరిగింది.  కోవిడ్-19 సమయంలో, ఆ తర్వాత, వారి మానసిక ఆరోగ్యం, మానసిక, సామాజిక సమస్యలను పరిష్కరించడానికి వారికి టెలి-కౌన్సిలింగ్ అందించడానికి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే విధంగా ఒక జాతీయ స్థాయి టోల్-ఫ్రీ-హెల్ప్-లైన్ (8448440632) ఏర్పాటు చేయడం జరిగింది. 

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు తమ ఆందోళనలను పంచుకోవడానికి, సహాయపడటానికి ఎన్.సి.ఈ.ఆర్.టి. 2020 ఏప్రిల్, నెలలో 'స్కూల్ పిల్లల కోసం ఎన్.సి.ఈ.ఆర్.టి. కౌన్సిలింగ్ సేవలు' ప్రారంభించింది.   దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 270 మంది కౌన్సిలర్లు ఈ సేవను ఉచితంగా అందిస్తున్నారు.  'సహయోగ్: గైడెన్స్ ఫర్ మెంటల్ వెల్బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్' పై ప్రత్యక్ష ఇంటరాక్టివ్ సెషన్లు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మధ్యాహ్నం 12 గంటలకు ఈ-విద్య డి.టి.హెచ్-టి.వి. ఛానళ్లలో ప్రసారమవుతున్నాయి.   ఒత్తిడి, ఆందోళనలను నిర్వహించడానికి, యోగా పై రికార్డ్ చేసిన వీడియోలను 12 డి.టి.హెచ్. టి.వి. TV ఛానెళ్ళ ద్వారా 2020 సెప్టెంబర్, 1వ తేదీ నుంచి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రసారం చేస్తున్నారు.  కేంద్రీకృత టోల్-ఫ్రీ-హెల్ప్ లైన్ ద్వారా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ - సి.బి.ఎస్.ఈ. ప్రీ, పోస్ట్ ఎగ్జామినేషన్ టెలీ కౌన్సిలింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది. 

మానసిక అనారోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సమాచారం, విద్య, వర్తమానం (ఐ.ఈ.సీ)తో కూడిన కార్యకలాపాలు ఎన్.ఎం.హెచ్.పి. లో అంతర్భాగంగా ఉన్నాయి.  జిల్లా స్థాయిలో ఐ.ఈ.సీ. కోసం నేషనల్ హెల్త్ మిషన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఫ్లెక్సీ-పూల్ కింద డీ.ఎం.హెచ్.పి. ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు తగిన నిధులు సమకూర్చడం, పాఠశాలలు, కార్యాలయాలు, సమాజ ప్రమేయంతో సమాజానికి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  డీ.ఎం.హెచ్.పి. ఆధ్వర్యంలో స్థానిక వార్తా పత్రికలు, రేడియో కార్యక్రమాల్లో అవగాహన సందేశాలు, వీధి నాటకాలు, గోడల మీద బొమ్మలు వేయడం వంటి వివిధ ఐ.ఈ.సీ కార్యకలాపాలు రాష్ట్రాలు/యూటీలు చేపడుతున్నాయి.

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పి.ఎం.జె.ఏ.వై) కింద 60 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ద్వితీయ, తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేర్చేందుకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు.  ఏ.బి-పి.ఎం.జె.ఏ.వై. కింద చికిత్స ప్యాకేజీలు, మందులు, డయాగ్నోస్టిక్ సేవలు వంటి వివిధ చికిత్స సంబంధిత అంశాలతో పాటు, మానసిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. 

వివిధ వర్గాల సాధారణ ఆరోగ్య వైద్య, పారా మెడికల్ నిపుణులకు ఆన్-లైన్ శిక్షణా కోర్సులను అందించడం ద్వారా దేశంలో తక్కువ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి - బెంగళూరు లో "జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరో సైన్సెస్ సంస్థ"; అసోంలోని తేజ్ పూర్ లో "లోకో ప్రియ గోపినాథ్ బోర్డోలోయి ప్రాంతీయ మానసిక ఆరోగ్య సంస్థ; రాంచీలో "కేంద్ర సైకియాట్రీ సంస్థ" అనే పేర్లతో - 2018 నుంచీ ఏర్పాటుచేసిన మూడు కేంద్ర మానసిక సంస్థలకు  చెందిన డిజిటల్ అకాడమీల ద్వారా కేంద్ర ప్రభుత్వం మానవశక్తి లభ్యతను పెంచుతోంది.

బెంగళూరులోని జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరో సైన్సెస్ సంస్థ (ఎన్.ఐ.ఎం.హెచ్.ఎ.ఎన్.ఎస్) ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని 12 రాష్ట్రాల్లో నిర్వహించిన భారతదేశానికి చెందిన 2016 జాతీయ మానసిక ఆరోగ్య సర్వే (ఎన్.ఎం.హెచ్.ఎస్) ప్రకారం 18 ఏళ్లు పైబడిన పెద్దల్లో మానసిక రుగ్మతల ప్రాబల్యం 10.6 శాతంగా ఉంది.  ఇంకా, ఈ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాలు (6.9 శాతం); మెట్రో కాని పట్టణ ప్రాంతాలతో (4.3శాతం) పోలిస్తే పట్టణ మెట్రో ప్రాంతాలలో (13.5 శాతం) మానసిక వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా ఉంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ భాగెల్ ఈ రోజు లోక్ సభకు లిఖితపూర్వకంగా అందజేసిన సమాధానంలో ఈ విషయాలు పేర్కొన్నారు.

 

*****



(Release ID: 1984420) Visitor Counter : 61


Read this release in: English