వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ మార్కెటింగ్ను మెరుగుపరచడానికి చర్యలు
Posted On:
08 DEC 2023 5:15PM by PIB Hyderabad
ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు, రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడానికి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ను మెరుగుపరచడానికి వివిధ చర్యలు చేపట్టడం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. ఇది రాష్ట్ర అంశం అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల మార్కెటింగ్ చట్టాలు మరియు విధానాలలో సంస్కరణల ద్వారా నేరుగా మార్కెటింగ్, ప్రైవేట్ మార్కెట్లు మొదలైన చర్యల ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న పోటీ మార్కెట్ల అభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ మార్కెటింగ్ను మరింత మెరుగుపరచడానికి, రైతులకు తమ ఉత్పత్తులను ఎలక్ట్రానిక్గా బహుళ మార్కెట్ల అందుబాటు ద్వారా పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులకు పారదర్శకంగా విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్)ను 2016లో ప్రారంభించింది. అదనంగా, రైతుల మార్కెటింగ్ సవాళ్లను పరిష్కరించడానికి, ప్రత్యేకించి చిన్న మరియు సన్నకారు రైతులకు, ప్రభుత్వం మార్కెట్ అనుసంధానాన్ని 2020లో ప్రారంభించడం ద్వారా “10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (FPOs) స్కీమ్ ఏర్పాటు మరియు ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకుంది.
రూ. 1,00,000 కోట్లు వడ్డీ రాయితీ మరియు ఆర్థిక సహాయం ద్వారా గిడ్డంగులు మరియు కమ్యూనిటీ వ్యవసాయ ఆస్తులతో సహా పంటకోత అనంతర మార్కెట్ మౌలిక సదుపాయాల కోసం ఆచరణీయ ప్రాజెక్టులలో పెట్టుబడి కోసం మధ్యస్థ దీర్ఘకాలిక రుణ సౌకర్యాన్ని అందించడానికి ప్రభుత్వం కేంద్ర రంగ పథకం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎ ఐ ఎఫ్) ని ప్రారంభించింది. పైవి కాకుండా, ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను (ఏ ఎం ఐ) అమలు చేస్తోంది, ఇది వ్యవసాయ మార్కెటింగ్ కోసం సమీకృత పథకం (ఐ ఎస్ ఎ ఎం) యొక్క ఉప-పథకం, దీని కింద వ్యవసాయ ఉత్పత్తుల సామర్థ్యం, అలాగే నిల్వను మెరుగుపరచడానికి రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో గోడౌన్లు / గిడ్డంగుల నిర్మాణానికి సహాయం అందించబడుతుంది. ఈ పథకం కింద, ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ప్రాజెక్ట్ మూలధన వ్యయంపై 25% మరియు 33.33% చొప్పున సబ్సిడీని అందిస్తుంది.
ప్రభుత్వ చర్యలు ఫలితంగా:
దేశంలో 120 కంటే ఎక్కువ ప్రైవేట్ మార్కెట్ల ఏర్పాటు, రైతులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడానికి పోటీ ప్రత్యామ్నాయ మార్కెటింగ్ ఛానెల్ని అందించడం;
రైతుల ఉత్పత్తులకు అధిక గిరాకీ అధిక రేటు ద్వారా డబ్బు ఆర్జించడానికి వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏ పీ ఎం సి) మార్కెట్ యార్డుల వెలుపల రైతు పొలంలోనే వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి ప్రత్యక్ష విక్రయదారులకు (ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, వ్యవస్థీకృత చిల్లర వ్యాపారులు మొదలైనవారు) లైసెన్సు ఇవ్వడం;
రైతులు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు మరియు మార్కెట్లను డిజిటల్గా అందుకోవటానికి ఉత్తమమైన ధరను పొందడానికి వీలు కల్పిస్తుంది.
సామూహిక బేరసారాల శక్తి మరియు విలువ జోడించిన ఉత్పత్తుల విక్రయం యొక్క ప్రయోజనాలతో పాటుగా ఇ-మార్కెట్లు, ఫ్యూచర్స్ మార్కెట్, ఎగుమతి మార్కెట్ను అందుకోవడంలో ఎఫ్ పీ ఓ ల రూపంలో రైతులకు వీలు కల్పిస్తుంది.
విలువ గొలుసును మెరుగుపరచడానికి మరియు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటుంది.
వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1984331)
Visitor Counter : 172