ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేపు హైదరాబాద్‌లో జరిగే 8వ ఉపాధి మేళాను ఉద్దేశించి ఎంఓఎస్ రాజీవ్ చంద్రశేఖర్ ప్రసంగించనున్నారు

Posted On: 27 AUG 2023 4:02PM by PIB Hyderabad

2023 - రేపు సిఆర్‌పిఎఫ్ హైదరాబాద్‌లోని పురుషుల క్లబ్, గ్రూప్ సెంటర్‌లో జరగనున్న 8వ విడత ఉపాధి మేళా లో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామిక వ్యవస్థాపకత మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి రాష్ట్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రసంగించనున్నారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించే ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు. 51,000 పైగా ఇటీవల నియమితులైన వారికి  అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయబోతున్నారు.

జూలైలో చెన్నైలో జరిగిన ఉపాధి మేళాలో, ఎం ఓ ఎస్ రాజీవ్ చంద్రశేఖర్, ప్రభుత్వ ఉద్యోగాలలో కొత్త పని సంస్కృతి "సేవ" లేదా పౌర సేవను పరిచయం చేయాలనే ప్రధాని మోడీ సందేశాన్ని పునరుద్ఘాటించారు. ప్రజలు పాలన మరియు ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా భావిస్తున్నారు అనే విషయంలో మార్పు గురించి ఆయన మాట్లాడారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉపాధి మేళాలో ప్రసంగించిన ప్రధాని మోదీ  కొత్తగా నియమితులైన 5800 మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ప్రశంసించారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో వారి పాత్ర ఎలా కీలకంగా ఉంటుందో వివరించారు.

 

ప్రాథమిక విద్యలో కొత్త పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం ద్వారా సాంప్రదాయ విజ్ఞానం మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సమానమైన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

 

దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో ఉపాధి మేళా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో  రిక్రూట్‌మెంట్ ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనే నిబద్ధతకు అనుగుణంగా కొనసాగుతుంది. గత ఏడాది అక్టోబర్ 22న 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘రోజ్‌గార్ మేళా’ ప్రచారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.

 

***



(Release ID: 1952699) Visitor Counter : 166