ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం
प्रविष्टि तिथि:
25 JUL 2023 5:53PM by PIB Hyderabad
"ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం" (PLISFPI)" కేంద్ర మంత్రివర్గం సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని 31 మార్చి 2021న ఆమోదించింది. 2021-22 నుండి 2026-27 వరకు రూ. 10,900 కోట్లు అందజేయబడతాయి. ఈ పథకం లో మూడు భాగాలు ఉంటాయి . నాలుగు ప్రధాన ఆహార ఉత్పత్తుల విభాగాల్లో తయారీని ప్రోత్సహించడం (వండడానికి సిద్ధంగా ఉన్న/ తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన పండ్లు & కూరగాయలు, సముద్ర ఉత్పత్తులు మరియు మొజారెల్లా చీజ్), ఎస్ ఎం ఈ ల వినూత్న/సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం మరియు భారతీయ బ్రాండింగ్ మరియు విదేశాలలో మార్కెటింగ్కు మద్దతు ఇవ్వడం. అదనంగా, మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల కోసం పీ ఎల్ ఐ పథకం (PLISMBP) ఎఫ్ వై 2022-23లో ₹800 కోట్లతో ప్రారంభించబడింది, దీనికి పీ ఎల్ ఐ ఎస్ ఎఫ్ పీ ఐ కింద వచ్చిన పొదుపును ఉపయోగించుకుంది.
ఈ పథకం కింద, ప్రోత్సాహకాలు పొందేందుకు 158 దరఖాస్తులు ఆమోదించబడ్డాయి. అందిన సమాచారం ప్రకారం, పథకం లబ్ధిదారులు 7,427.22 కోట్లు (31 మార్చి 2023 నాటికి) పెట్టుబడి పెట్టారు. ఇప్పటివరకు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి 517.604 కోట్ల ప్రోత్సాహకాలు పంపిణీ చేయబడ్డాయి.
పీ ఎల్ ఐ ఎస్ ఎఫ్ పీ ఐ పథకం నుండి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. దాని ప్రభావం మరియు సరసతను నిర్ధారించడానికి, పథకం సూత్రీకరణ దశలో చురుకైన చర్యలు తీసుకోబడ్డాయి. వివిధ వాటాదారులు చురుగ్గా రూపకల్పన దశలో పాల్గొన్నారు. తయారీదారులు, ఎస్ ఎం ఈ లు మొదలైన వారితో పెద్ద ఎత్తున విస్తృతమైన సంప్రదింపుల ప్రక్రియను అనుసరించారు. ఫలితంగా, పథకం మార్గదర్శకాలు రైతులతో సహా వాటాదారులందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిర్ధారిస్తాయి.
నూతన ఆవిష్కరణలు మరియు సహజ ఆహార ఉత్పత్తులపై నిర్దిష్ట దృష్టితో పీ ఎల్ ఐ పథకం యొక్క కేటగిరీ-II ప్రత్యేకంగా అర్హత కలిగిన ఎం ఎస్ ఎం ఈల కోసం ఉద్దేశించబడింది. ఈ ప్రత్యేక కేటగిరీ కింద 16 దరఖాస్తులు ఎంపిక చేయబడ్డాయి. అదనంగా, మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల కోసం పీ ఎల్ ఐ పథకం కింద పాల్గొనడానికి ఎంపికైన 22 మంది దరఖాస్తుదారులు (ఎంపిక చేసిన 30 మంది దరఖాస్తుదారులలో) ఎం ఎస్ ఎం ఈ లు. పీ ఎల్ ఐ పథకం కాకుండా, మొత్తం ఆహార విలువ వ్యవస్థ గొలుసులో మద్దతును అందించడానికి ప్రభుత్వం అనేక ఇతర పథకాలను ప్రవేశపెట్టింది, ఇది ఎస్ ఎం ఈలకు వారి ఆహార ఉత్పత్తులు అంతర్జాతీయ నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.
పథకం కింద కవరేజీకి అర్హత ఉన్న ఆహార ఉత్పత్తుల ప్రాథమిక ప్రాసెసింగ్తో సహా సంకలితాలు, రుచులు మరియు నూనెలు మినహా మొత్తం తయారీ ప్రక్రియ తప్పనిసరిగా భారతదేశంలో జరగాలని పథకం మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఈ విధానం రైతులకు ప్రయోజనం చేకూర్చే మరియు దేశీయ ఉత్పత్తికి మద్దతు ఇచ్చే బలమైన ఆహార పరిశ్రమ విలువ గొలుసు వ్యవస్థ ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్గదర్శకాలు వ్యవసాయ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు మరియు అధిక ఆదాయానికి హామీ ఇవ్వడం ద్వారా రైతుల ముఖ్యంగా చిన్న తరహా రైతుల సమ్మిళితాన్ని నిర్ధారిస్తాయి
ఈ విషయాన్ని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి తెలిపారు.
శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు
***
(रिलीज़ आईडी: 1943022)
आगंतुक पटल : 183