పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

విపత్తు నిర్వహణలో ముందస్తు హెచ్చరిక, సంసిద్ధత, నివారణ, ప్రతిస్పందన, పునరుద్ధరణ, నష్టాన్ని తగ్గించడం మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంపై సమగ్ర విధానాన్ని తెలిపిన ప్రభుత్వం


రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రెస్పాన్స్ ఏజెన్సీల సహకారంతో విపత్తులలో సున్నా మరణాలను సాధించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం

Posted On: 13 MAR 2023 4:15PM by PIB Hyderabad


పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ..ప్రపంచవ్యాప్తంగా  వాతావరణ ప్రమాద సూచికలు మరియు ప్రమాద అంచనాల రూపకల్పన ప్రైవేట్ మరియు పబ్లిక్ యాజమాన్యంలోని సంస్థలు వాణిజ్య సలహా కార్యకలాపాల్లో పెరుగుతున్న సంఖ్య ద్వారా చేపట్టబడిందన్నారు.రిస్క్ అనాలిసిస్ మరియు రిస్క్ అసెస్‌మెంట్‌ల తయారీలో ప్రభుత్వం శాస్త్రీయంగా ధృవీకరించబడిన డేటా, మెథడాలజీలు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ శాస్త్రీయ సంస్థలు మరియు బహుపాక్షిక ఏజెన్సీలు మరియు ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన నైపుణ్యం కలిగిన సంస్థలచే అందించబడిన విశ్లేషణలపై ఆధారపడుతుంది.అయితే, పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న అన్ని విశ్లేషణలు మరియు మదింపులపై ప్రభుత్వ వీక్షణ సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గాలలో పెరుగుతున్న వాతావరణ మార్పుల అవగాహనకు అటువంటి కార్యకలాపాల యొక్క పెరుగుతున్న స్థాయి నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది.

ఈ అంశాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తన వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని కొత్త డేటాతో మరియు ఈ అంశంపై పెరిగిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అంచనా వేస్తూనే ఉంది. ఇటువంటి డేటా మరియు విశ్లేషణలు మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల  సాధారణ పనిలో మామూలుగా నిర్వహించబడతాయి మరియు ఎప్పటికప్పుడు నోటిఫై చేయబడిన ప్రభుత్వం యొక్క తదుపరి పథకాలు, ప్రణాళికలు మరియు కార్యక్రమాలలో చేర్చబడతాయి. ఈ విషయాలపై అవసరమైనప్పుడు అకాడెమియా మరియు థింక్‌ట్యాంక్‌లలోని నిపుణులు మరియు శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు సంప్రదించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఏఆర్) తన ఫ్లాగ్‌షిప్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ (ఎన్‌ఐసిఆర్‌ఏ) కింద 'భారత వ్యవసాయానికి సంబంధించిన రిస్క్ అండ్ వల్నరబిలిటీ అసెస్‌మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్' అనే అధ్యయనాన్ని చేపట్టింది. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్విస్ ఏజెన్సీ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ కోఆపరేషన్‌తో కలిసి మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు నుండి పరిశోధన బృందాలు దేశ వ్యాప్త  అంచనా మరియు 'క్లైమేట్ వల్నరబిలిటీ అసెస్‌మెంట్ ఫర్ అడాప్టేషన్ ప్లానింగ్ ఇన్ ఇండియా యూజింగ్ ఎ కామన్ ఫ్రేమ్‌వర్క్' పేరుతో ఒక నివేదికను విడుదల చేశాయి.

సౌరశక్తి, ఇంధన సామర్థ్యం, నీరు, స్థిరమైన వ్యవసాయం, ఆరోగ్యం, హిమాలయన్ పర్యావరణ వ్యవస్థ, స్థిరమైన ఆవాసాలు, హరిత భారతదేశం మరియు వాతావరణ మార్పుల కోసం వ్యూహాత్మక పరిజ్ఞానం వంటి నిర్దిష్ట రంగాలలో మిషన్‌లను కలిగి ఉన్న వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఏపిసిసి) సహా అనేక కార్యక్రమాలు మరియు పథకాల ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నివేదిక పేర్కొంది. అన్ని వాతావరణ చర్యల కోసం విస్తృతమైన ఫ్రేమ్‌వర్క్‌ను
ఎన్‌ఏపిసిసి అందిస్తుంది.34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీలు) వాతావరణ మార్పులకు సంబంధించిన రాష్ట్ర నిర్దిష్ట సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఎన్‌ఏపిసిసికి అనుగుణంగా వాతావరణ మార్పులపై రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను (ఎస్‌ఏపిసిసి) సిద్ధం చేశాయి. విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం అంతర్జాతీయ సౌర కూటమి మరియు కూటమి ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడంలో భారతదేశం ముందస్తుగా ముందుంది మరియు ఈ ఏర్పాట్ల ద్వారా వివిధ కార్యకలాపాలను చేపట్టింది. అలాగే వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాలకు ముఖ్యంగా హాని కలిగించే ప్రాంతాలలో రాష్ట్రాలు/యుటిలలో అనుసరణ చర్యలకు మద్దతు ఇవ్వడానికి, ప్రభుత్వం వాతావరణ మార్పుల కోసం జాతీయ అనుసరణ నిధి (ఎన్ఏఎఫ్‌సిసి)ని అమలు చేస్తోంది. ఎన్ఏఎఫ్‌సిసి కింద 27 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 30 ప్రాజెక్టులు వ్యవసాయం, నీరు, అటవీ రంగం మొదలైనవాటిలో అనుసరణ కోసం మంజూరు చేయబడ్డాయి.

విపత్తు రిస్క్ తగ్గింపు మరియు విపత్తు నిర్వహణ ప్రాముఖ్యతపై స్వాగతించదగిన పెరుగుదల దృష్ట్యా మీడియాలో సంబంధిత సమస్యల కవరేజీ పెరుగుతోందని వ్రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. అందువల్ల, వ్యక్తిగత మీడియా  కంటెంట్‌పై సాధారణ వ్యాఖ్యానం సాధ్యం కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ భారత ప్రభుత్వం తన నిరంతర ప్రయత్నాలతో దేశంలో విపత్తు నిర్వహణ పట్ల తన విధానాన్ని కేంద్రీకృతం చేసి ముందస్తు హెచ్చరిక, సంసిద్ధత, నివారణ, ప్రతిస్పందన, పునరుద్ధరణ, తగ్గించడం వంటి సమగ్ర విధానం వరకు గణనీయంగా మెరుగుపరిచిందని గమనించవచ్చు.

విపత్తు నిర్వహణ చట్టం, 2005 అభివృద్ధి ప్రణాళికలో విపత్తు ప్రమాద తగ్గింపు (డిఆర్‌ఆర్‌)ని ప్రధాన స్రవంతిలో చేర్చవలసిన అవసరాన్ని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణపై జాతీయ విధానం మరియు జాతీయ ప్రణాళిక సురక్షితమైన మరియు విపత్తు తట్టుకునే భారతదేశాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. దేశంలో జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో సంస్థాగత యంత్రాంగాలు ఉన్నాయి. అవి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఏ), రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు (ఎస్‌డిఎంఏ) మరియు జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు (డిడిఎంలు)గా ఉన్నాయి. తగిన సన్నద్ధత, సహాయక చర్యలు ప్రకృతి వైపరీత్యాల సమర్థవంతమైన నిర్వహణ కోసం డైనేషన్ మరియు ప్రాంప్ట్ రెస్పాన్స్ మెకానిజమ్స్‌ ఉన్నాయి. విపత్తు పరిస్థితులు లేదా విపత్తుల పట్ల ప్రత్యేక ప్రతిస్పందనను అందించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్‌డిఆర్‌ఎఫ్) కూడా ఏర్పాటు చేసింది.

విపత్తు నిర్వహణలో ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రెస్పాన్స్ ఏజెన్సీల సహకారంతో  విపత్తులలో జీరో మరణాలను సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా విపత్తు నిర్వహణను బలోపేతం చేయడం అనేది పాలనకు సంబంధించి నిరంతర మరియు అభివృద్ధి చెందుతున్న ప్రక్రియ.



 

*****



(Release ID: 1906755) Visitor Counter : 377


Read this release in: English