సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి సుపరిపాలన అవార్డు-గెలుచుకున్న కార్యక్రమాల యొక్క ఉత్తమ అభ్యాసాలను మరియు అనుభవాలను పంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు/జిల్లాల ద్వారా ప్రతిరూపాల వ్యాప్తి ని సులభతరం చేయడానికి ప్రధానమంత్రి అవార్డు అందుకున్న ఇనిషియేటివ్‌లపై జాతీయ సుపరిపాలన వెబ్‌నార్‌లను డీ ఏ ఆర్ పీ జీ సేకరణ చేస్తుంది.


అన్ని రాష్ట్రాలు/యుటిల డీ సీ లు/ డీ ఎం లు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు మరియు రాష్ట్రాలు/ యూ టీ లు మరియు అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ట్రైనీల భాగస్వామ్యంతో డిసెంబరు, 2022 వరకు జరిగిన 9 వెబ్‌నార్‌లు

Posted On: 30 DEC 2022 4:30PM by PIB Hyderabad

'పౌర సేవల బట్వాడా ను మెరుగుపరచడం' అనే అంశంపై అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్  28.04.2022 న మొదటి వెబ్‌నార్‌తో ప్రారంభించి, 2022-2023 సంవత్సరంలో  ప్రతి నెలా చివరి శుక్రవారం వివిధ అంశాలపై  13 జాతీయ సుపరిపాలన వెబ్‌నార్‌ల సిరీస్ ను నిర్వహిస్తోంది, .

 

ఉత్తమమైన సుపరిపాలన కార్యాచరణలు ను ప్రచారం చేయడానికి అవార్డు విజేతలను ప్రధాన ఉపన్యాసకులు గా 1-1.5 గంటల పరోక్ష సదస్సు లు నిర్వహించాలని గౌరవ ప్రధాన మంత్రి 2022 సివిల్ సర్వీసెస్ డే   సందర్భంగా చేసినప్రసంగానికి అనుగుణంగా వెబ్‌నార్‌లు ప్రణాళిక చేయబడ్డాయి.

 

ప్రధానమంత్రి సుపరిపాలన అవార్డు-గెలుచుకున్న కార్యక్రమాల యొక్క ఉత్తమ అభ్యాసాలను మరియు అనుభవాలను పంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు/జిల్లాల ద్వారా ప్రతిరూపాల వ్యాప్తి ని సులభతరం చేయడం వెబ్‌నార్‌ల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అన్ని రాష్ట్రాలు/ యూ టీ ల డీ సీ లు/ డీ ఎం లు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు మరియు రాష్ట్ర మరియు అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ట్రైనీలు వెబ్‌నార్లలో పాల్గొంటారు.

 

ప్రతి నెలలో ఒక నిర్దిష్ట అంశం / రంగం తీసుకోబడుతుంది, ఇందులో ఇద్దరు అవార్డు విజేతలు తమ అనుభవాలను ప్రదర్శించడానికి ఆహ్వానించబడ్డారు.  ‘మెరుగైన పౌర సేవల బట్వాడా ను మెరుగుపరచడం ’ 28.04.2022 ‘ఆరోగ్యం’ (27.05.2022); ‘ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్’ (24.06.2022); ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కారం’(29.07.2022), ‘పర్యావరణం’ (26.08.2022), ‘పౌర సేవల బట్వాడా’ (30.09.2022), ‘ప్రజల భాగస్వామ్యం ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్   (జన భగీదరి)’ (28.210); ‘ఇన్నోవేషన్’ (25.11.2022) మరియు ‘జల్/ నీటి యాజమాన్యం ’ (30.12.2022) తొమ్మిది వెబ్‌నార్లు డిసెంబర్, 2022 వరకు నిర్వహించబడ్డాయి.

 

వివిధ వెబ్‌నార్‌లలో 700-1200 మంది పాల్గొనే ఈ వెబినార్ సిరీస్  డీ ఏ ఆర్ పీ జీ  యొక్క చాలా విజయవంతమైన కార్యక్రమం.  భారతదేశం అంతటా ఉత్తమ పాలనా పద్ధతులను  మరియు ప్రతిరూపాలను వ్యాప్తి చేయడం లో సహాయపడుతుందని భావిస్తున్నారు.

 

***


(Release ID: 1887762)
Read this release in: English , Urdu , Hindi