ఆయుష్
రక్షణ, రైల్వే ఆసుపత్రుల్లో కొత్త ఆయుష్ విభాగాలు
Posted On:
05 AUG 2022 5:41PM by PIB Hyderabad
దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, గౌహతిలోని 5 రైల్వే జోనల్ ఆసుపత్రులలో ఆయుష్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖతో ఆయుష్ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి 12 ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రులు, 37 కంటోన్మెంట్ బోర్డ్ హాస్పిటల్స్లో ఆయుర్వేద ఓపీడీలను ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యాలు 2022 జూన్ 1వ వారం నుండి విజయవంతంగా సేవలందిస్తున్నాయి.
ఆయుష్ మంత్రిత్వ శాఖ మెడికల్ వాల్యూ ట్రావెల్ కోసం ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్ స్కీమ్ అనే కేంద్ర పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో మూడు భాగాలు ఉన్నాయి (1) ఆయుష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్/ డేకేర్ సెంటర్లు (2) ఆయుష్ రంగంలో నైపుణ్యాభివృద్ధి (3) ఆయుష్ గ్రిడ్ స్థాపన.
ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్ పథకంలోని మొదటి భాగంలో ఆయుష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్/ డేకేర్ సెంటర్ల స్థాపన, ఇందులో గుర్తింపు పొందిన సిస్టమ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్/డే కేర్ సెంటర్ల స్థాపన కోసం ప్రైవేట్ పెట్టుబడిదారులకు వడ్డీ రాయితీ రూపంలో నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చట్టం, 2020 లేదా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి (NCH) చట్టం, 2020 పాన్ ఇండియా ప్రాతిపదికన ఆర్థిక సహాయం అందించబడుతుంది. పథకం వ్యవధి 31 మార్చి 2022తో ముగిసింది. ఈ కాంపోనెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద దేశవ్యాప్తంగా ఆయుష్ ఆసుపత్రులు/కేంద్రాల ఏర్పాటు కోసం 81 ప్రతిపాదనలు అందాయి. 81 ప్రతిపాదనల్లో 03 ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి.
ఆయుష్ మంత్రిత్వ శాఖ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ను అభివృద్ధి చేసింది. అదే ఆయుర్వాస్థ్య యోజన, దీనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి సౌకర్యాల నవీకరణ అనే భాగం ఉంది. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆయుష్ ప్రమోషన్ కోసం అవసరమైన విద్య, సాంకేతికత, పరిశోధన & ఆవిష్కరణలు మరియు ఇతర రంగాలలో ఆయుష్ నిపుణులను బలోపేతం చేయడానికి ప్రసిద్ధ సంస్థల యొక్క విధులు మరియు సౌకర్యాల స్థాపన మరియు అప్గ్రేడేషన్కు మద్దతు ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ & రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ITRA)-జామ్నగర్కు ఐటీఆర్ఏ చట్టం 2020 కింద అక్టోబరు, 2020లో మూడు వేర్వేరు సంస్థలను కలపడం ద్వారా జాతీయ ప్రాముఖ్యత హోదా ఇవ్వబడింది. అవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, జామ్నగర్, శ్రీ గులాబ్కున్వెర్బా ఆయుర్వేద మహావిద్యాలయ, జామ్నగర్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జామ్నగర్. 22 సెప్టెంబర్, 2020 నుంచి ఐటీఆర్ఏ చట్టం, 2020 అమలులోకి వచ్చింది.
ఈ విషయాన్ని ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు లోక్సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
***
(Release ID: 1848966)