ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ టీకాల లభ్యతపై తాజా సమాచారం


రాష్ట్రాలు, యూటీలకు ఇప్పటివరకు 196.64 కోట్లకు పైగా డోసులు పంపిణీ

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో 7.29 కోట్లకు పైగా డోసులు

Posted On: 04 AUG 2022 9:38AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 2021 జనవరి 16న ప్రారంభమైంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ 2021 జూన్‌ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, టీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికి, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి దీనిని ప్రారంభించారు.

సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. టీకా సార్వత్రీకరణ కొత్త దశలో, దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది.

 

టీకా డోసులు

 

(ఆగస్టు 04, 2022 నాటికి)

 

పంపిణీ చేసినవి

 

1,96,64,39,625

 

అందుబాటులోని నిల్వలు

 

 

7,29,66,750

 

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా (ఉచితంగా), ప్రత్యక్ష సేకరణ పద్ధతిలో 196.64 కోట్లకు పైగా ( 1,96,64,39,625 ) టీకా డోసులు అందాయి.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 7.29 కోట్లకు పైగా ( 7,29,66,750 ) డోసులు అందుబాటులో ఉన్నాయి.

 

****



(Release ID: 1848246) Visitor Counter : 109