సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022’ రాజమండ్రి నగరంలో ప్రారంభమైంది


భారతదేశపు ఘన, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం, ప్రాచుర్యం లోకి తీసుకురావడం లక్ష్యంగా ఏర్పాటైన కార్యక్రమం ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022’: కిషన్ రెడ్డి


దేశ సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని ఉత్సవంగా జరుపుకునేట్టు ప్రత్యేక పండుగగా తెలుగు రాష్ట్రాలకు అందించినందుకు గౌరవ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి.

Posted On: 26 MAR 2022 7:30PM by PIB Hyderabad

కేంద్ర సాంస్కృతికపర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి   మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్’ అనేది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే భారతదేశ ప్రధాన వేడుక అనిఇది గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంప్రోత్సహించడం ప్రాచుర్యంలోకి తేవడం  లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు.

 

RSM-2022  12వ సందర్భపు  ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌’ను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించారుఅయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దీనిని  ఆ వ్యవధిలో నిర్వహించలేకపోయారు.

RSM-2022 భారతదేశ విభిన్న సాంస్కృతిక వారసత్వ   వేడుక అని పునరుద్ఘాటిస్తూ ఇది మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 వరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో జరుపుకుంటున్నామని తెలిపారు.

 కార్యక్రమ వివరాలు  క్రింది విధంగా ఉన్నాయి:

 

1. రాజమండ్రి- 2 రోజులు ( 26.3.22 ,  27.3.22) - శని ,  ఆదివారం

2. వరంగల్- 2 రోజులు ( 29.3.22 ,  30.3.22) - మంగళవారం,  బుధవారం

3. హైదరాబాద్- 3 రోజులు (01.04.22 నుంచి 03.04.22 వరకు) - శుక్రవారం నుంచి ఆదివారం వరకు

 

హైదరాబాద్ కార్యక్రమంలో ఐదు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొంటారని కేంద్ర మంత్రి తెలిపారు.

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ   ప్రతిష్టాత్మక  ఏక్ భారత్ శ్రేష్ఠ” లక్ష్యాన్ని బలోపేతం చేస్తూ, ఒక రాష్ట్రానికి చెందిన జానపద, గిరిజన కళలునృత్యంసంగీతంవంటకాలు, సంస్కృతిని ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించడంలో ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం’ కీలకపాత్ర పోషించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’  - "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" దక్షిణాది రాష్ట్రాల గొప్ప సంస్కృతిని ప్రదర్షించే కార్యక్రమాలు.   భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోని విభిన్న సంస్కృతులను  స్థానిక జనాభాకు పరిచయం చేస్తున్నాయి అన్నారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా అరకులో ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం ఏర్పాటు చేయనున్నామనిఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరవుతారని ఆయన ప్రకటించారు.

 శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వం,  కళలను సుసంపన్నం చేయడానికి కృషి చేసిన వారందరినీ భారత ప్రభుత్వం తరపున సత్కరిస్తామని అన్నారు.

 జూన్ 21న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమం  విజయవంతం అయ్యే   సందర్భంగా జరుపుకునే యోగా దినోత్సవంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

 గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రారంభ ప్రసంగంలో, "ఈ పండుగలు మన సంస్కృతి  సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయి" అని అన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ ఉత్సవాలు నిర్వహిస్తోందనిదేశ ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయన్నారు. దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించిన జాతీయవాద నాయకులలో సుభాష్ చంద్రబోస్ ఒకరని మంత్రి కొనియాడారు.

రాష్ట్ర మంత్రులు శ్రీ వేణుగోపాల కృష్ణ,   ఆంధ్రప్రదేశ్ పర్యాటక   సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ రాయబారి శ్రీ M. మోహన్ బాబు   పార్లమెంట్ సభ్యుడు (రాజమండ్రి) శ్రీ మార్గాని భరత్ రామ్  సాంస్కృతిక ఉత్సవానికి హాజరయ్యారు.

రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్ కళాశాల మైదానంలో రెండు రోజుల రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 మార్చి 26 నుంచి 27 వరకు జరగనుంది.

 

నేపథ్య సమాచారం:

 మొదటి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2015లో నిర్వహించారు, ఆ కార్యక్రమం ప్రసార మాధ్యమాల,  ప్రజల విశేష     స్పందనను పొందిందిఇది ఈ  పండుగల శ్రేణిని నిర్వహించడానికి ప్రేరేపించింది.

 రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ కార్యక్రమంలో  భారతదేశంలోని   సుమారు 1000 మంది కి పైబడిన  కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉన్న సందర్భంలో ప్రసిద్ధ  జానపదసాంప్రదాయగిరిజనశాస్త్రీయ   కళారూపాలను ఒకే ఒకేచోట  చూసేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.

 ప్రాంతీయ సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే రంగురంగుల ప్రాంగణాలలో  సంప్రదాయ కళలు ,  చేతిపనుల ఉత్పత్తులను ప్రదర్శిస్తారుఇక్కడ కళాకారులు తమ వస్తువులను విక్రయించడానికి   వారి అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు  అంగళ్లు ఏర్పాటు చేశారు.

 జానపద కళాకారులు వేదికపై,  ప్రజల మధ్య రోజంతా ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. ప్రధాన సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమ తేదీల్లో  రోజు  సాయంత్రం 5.30 నుంచి 10.30 గంటల మధ్య జరుగుతుంది.

 జానపద బృందాలతో పాటు ప్రముఖ పద్మ ,  సంగీత నాటక అకాడమీ అవార్డ్ పొందిన శాస్త్రీయ కళాకారులు ప్రతి సంవత్సరం మహోత్సవ్‌లో ప్రదర్శనలు ఇస్తున్నారు. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం నిర్వహిస్తున్న  రాష్ట్రంలో ప్రాంతీయ అభిరుచులను ప్రతిబింబించే కళాకారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

 

 

 

#


(Release ID: 1810890)
Read this release in: English