రక్షణ మంత్రిత్వ శాఖ
కేంద్ర రక్షణశాఖ మంత్రి శ్రీ అజయ్ భట్ రాణిఖేత్లోని కేఆర్సి వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు
శ్రీమతి పుష్పా భట్ వీర నారీలను సత్కరించారు
నాడు పోస్టు చేయడమైనది:
27 DEC 2021 3:02PM by PIB Hyderabad
కేంద్ర రక్షణ మరియు పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ డిసెంబర్ 27, 2021న ఉత్తరాఖండ్లోని రాణిఖేట్ కుమావోన్ రెజిమెంటల్ సెంటర్ (కేఆర్సి) వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. అలాగే వీర నారీలను కూడా సత్కరించారు. వారిని శ్రీ అజయ్ భట్ భార్య శ్రీమతి పుష్పా భట్ సత్కరించారు.
ఈ దంపతులు 1976 నుండి కేఆర్సి వీర్ నారీస్ నిర్వహిస్తున్న పునరావాస ప్రాజెక్ట్ అయిన కేఆర్సి వూలెన్స్ను కూడా సందర్శించారు. రక్షణ శాఖ సహాయమంత్రి 26 డిసెంబర్ 2021 నుండి ప్రారంభమైన విజయ్ సంకల్ప్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో అధికారిక పర్యటనలో ఉన్నారు.
శ్రీ అజయ్ భట్ మాట్లాడుతూ సైనికుల కుటుంబాల అత్యున్నత త్యాగం ఎల్లప్పుడూ యుద్ధాలను గెలవడానికి మరియు దేశం యొక్క భద్రతకు హామీ ఇచ్చిందని అన్నారు. మన వీర సైనికులు చేసిన అత్యున్నత త్యాగాలకు దేశం మొత్తం రుణపడి ఉంటుందని, వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.
కుమావోన్ రెజిమెంట్ సెంటర్ డిప్యూటీ కమాండెంట్ కల్నల్ సంజయ్ కుమార్ యాదవ్ కూడా రాణిఖేట్లోని కేఆర్సి వార్ మెమోరియల్ వద్ద నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు.



****
(రిలీజ్ ఐడి: 1785547)
సందర్శకుల సూచీ సంఖ్య : : 212