సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఆంధ్రప్రదేశ్ నుంచి మచిలీపట్నం సంప్రదాయాన్ని 2022, రిపబ్లిక్ డే వేడుకల్లో ‘ఆర్ట్ వర్క్ స్క్రోల్స్’ లో ప్రదర్శించనున్నారు


రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న 10 స్క్రోల్స్

భారతదేశ సంస్కృతి మరియు స్వాతంత్ర్య సమరంలోని ధీరుల కథలను ప్రదర్శించనున్న కళాకారులు

Posted On: 10 DEC 2021 6:01PM by PIB Hyderabad

విజయవాడ, డిసెంబర్ 10, 2021.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం, అందులోని ప్రజలు, సంస్కృతి మరియు విజయాల యొక్క అద్భుతమైన చరిత్రను జరుపుకోవడానికి మరియు స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది. ఇది భారతదేశం యొక్క సామాజిక-సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక గుర్తింపు గురించిన ప్రగతిశీలమైన వాటన్నింటి నైసర్గిక స్వరూపం అని చెప్పచ్చు.

అమృత్ మహోత్సవ్ యొక్క గొప్ప వేడుకల్లో భాగంగా, రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ భౌగోళిక ప్రదేశాల నుండి కళాకారులచే చిత్రించిన కళాకృతులతో కూడిన స్క్రోల్ పెయింటింగ్‌లను ప్రదర్శిస్తుంది. ఈ కళాకృతుల యొక్క ప్రధాన ఇతివృత్తం స్వాతంత్ర్య పోరాటంలో ధీరులైన హీరోలపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగంలోని దృష్టాంతాల నుంచి కూడా స్ఫూర్తి పొందుతాం. గణతంత్ర దినోత్సవం, 2022 వేడుకల్లో భాగంగా ఈ స్క్రోల్‌లను రాజ్‌పథ్‌లో ప్రదర్శించాలని ప్రతిపాదించారు.

డెబ్బై ఐదు మీటర్ల (సుమారుగా. 14-15 అడుగుల ఎత్తు) పాటు పది స్క్రోల్‌లు ఏర్పాటు చేయబడతాయి.ఇవి మన ధీరులైన హీరోలతో పాటు గొప్ప భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తాయి.. అలాగే ప్రదర్శిస్తాయి కూడా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క గొప్ప వేడుకలకు సంబంధించిన స్వాభావిక కళాత్మక విలువలను ఈ స్క్రోల్స్ ప్రతిబింబిస్తాయి మరియు మన జాతీయ గర్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి.

రాజ్‌పథ్ వెంబడి ఉన్న ఈ స్క్రోల్స్ యొక్క వ్యూహాత్మక ప్రదేశం దేశంలోని పౌరులందరికీ బహిరంగ గ్యాలరీగా ఉపయోగపడుతుంది మరియు భారతదేశం యొక్క గొప్ప జాతీయ వారసత్వం మరియు దాని నిజమైన అర్థంలో వారసత్వం గురించి ప్రజల్లో ప్రేరణ కలిగించడానికి  ఉద్దేశించబడింది. ఈ పెయింట్ చేయబడిన స్క్రోల్స్ యొక్క బహిరంగ ప్రదర్శన జాతీయ రాజధాని పట్టణ ప్రకృతి దృశ్యం యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.మన దేశం గర్వించేలా మరియు మన ప్రతిభ ఉట్టిపడేలా కళారూపాలను ఉపయోగిస్తుంది.

భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు కళాత్మక వారసత్వం యొక్క సారాంశాన్ని ప్రతిబింబించే కళ యొక్క సాంప్రదాయ రూపాలు మరియు సమకాలీన వ్యక్తీకరణలను ప్రతిబింబించేలా ఈ స్క్రోల్స్ ప్రతిపాదించబడ్డాయి.


డైరెక్టర్ జనరల్, NGMA  మరియు NGMA యొక్క అడ్వైజరీ బోర్డ్ (ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్‌లతో సహా ప్రముఖ కళాకారులు ఉన్నారు) స్క్రోల్ పెయింటింగ్‌లకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు.


స్క్రోల్స్ ఎక్కడ ప్రింట్ అవుతాయంటే;

క్ర. సం               ప్రదేశం                             తేదీలు                                  కళాకారుల సంఖ్య
    1           భువనేశ్వర్ (5 స్క్రోల్స్)          11-16th  డిసెంబర్ 2021                200-250
    2           చండీఘర్ (5 స్క్రోల్స్)           26th – 30th డిసెంబర్ 2021           200-250

వేదికల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి;
(a)    కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, భువనేశ్వర్ (ఒడిషా)

సిలికాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భువనేశ్వర్ (ఒడిషా)
(b)    ఛిత్కార యూనివర్సిటీ, చండీఘర్– డిసెంబర్ 26, 2021 నుంచి

స్క్రోల్ పెయింటింగ్ ఈవెంట్‌కు “కలా కుంభ్-ఆజాదికాఅమృత మహోత్సవ్” అని పేరు పెట్టారు.

భువనేశ్వర్‌లోని వర్క్‌షాప్‌లలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మరియు బెంగాల్ నుండి వచ్చిన కళాకారులు పాల్గొంటారు. సుమారు 270 మంది కళాకారులు స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను డాక్యుమెంట్ చేయడానికి పాల్గొంటారు.స్క్రోల్ పెయింటింగ్స్ ద్వారా మన ధీరులైన హీరోల కథలను చిత్రీకరిస్తారు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగాఓ మెటా-కథనాన్ని రూపొందించారు. భువనేశ్వర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో భాగమైన కొందరు ప్రముఖ కళాకారులు:


శ్రీ హర్షవర్ధన్ శర్మ, సీనియర్ మరియు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రముఖ కళాకారుడు, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని డీన్ సెంట్రల్ యూనివర్శిటీ కూడా NGMA యొక్క సలహా కమిటీ చైర్‌పర్సన్.

1.    శ్రీ రామహరి జేన, సీనియర్ కళాకారుడు, ప్రింట్ మేకింగ్ జాతీయ అవార్డు గ్రహీత

2.    శ్రీ విజ్యాంత్ దాశ్, ప్రొఫెసర్, పైన్ ఆర్ట్స్ విభాగం, KIIT, భువనేశ్వర్.

3.    శ్రీ శుభ్రత్ మాలిక్, ప్రఖ్యాత కళాకారుడు మరియు పెయింటింగ్ విభాగం హెడ్, బీకే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, భువనేశ్వర్.

4.    మిస్టర్ మానస్ రంజన్ జేన, కళాకారుడు మరియు బీకే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లో అధ్యాపకులు

5.    శ్రీ మనోజ్ పండిట్, మంజూషా పెయింటింగ్లో ప్రఖ్యాత కళాకారుడు, బీహార్.

పైన పేర్కొన్న వారితో పాటు, అనేక మంది సంప్రదాయ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరంతా సంబంధిత కళారూపాలలో నైపుణ్యం కలిగి ఉన్నారు మరియు సుదీర్ఘమైన కళా వంశం నుంచి వచ్చినవారు.

భువనేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో స్క్రోల్స్‌లో చిత్రీకరించబడే కొన్ని సాంప్రదాయక కళారూపాలు ఒడిశా, మేదినీపూర్ మరియు కాళీఘాట్‌లోని సాంప్రదాయ పట్టచిత్ర, జోతి-చిత్ర కళాకారులు. బెంగాల్‌కు చెందిన పటచిత్ర కళాకారులు, హుగ్లీ మరియు బీర్భూమ్, బంకురా మరియు బుర్ద్వాన్ రూపాంతరాలు, బీహార్‌కు చెందిన మంజుసా మరియు మధుబని కళాకారులు, జార్ఖండ్‌కు చెందిన జాదూ-పాటియా కళాకారులు మరియు సంతాలా, ముండా, ఒరాన్ మరియు ప్రజాపతి కళాకారులు అభ్యసిస్తున్న సాంప్రదాయిక పంట సోహ్రై కళను ముందుకు తీసుకువస్తున్నారు. అంతేకాకుండా, జనవరి 2022లో జరిగే గణతంత్ర వేడుకల సందర్భంగా మన ధీరులైన హీరోల కథను అల్లడానికి సమకాలీన కళారూపాలు కూడా ఉపయోగించబడతాయి.

***
 



(Release ID: 1780292) Visitor Counter : 222


Read this release in: English