ఉక్కు మంత్రిత్వ శాఖ
పరిశోధనా, అభివృద్ధి ప్రాజెక్ట్ల కోసం చేతులు కలిపిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఎస్ఐఆర్
Posted On:
28 SEP 2021 2:28PM by PIB Hyderabad
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) పరిశోధనా, అభివృద్ధి సెంటర్ , సీఎస్ఐఆర్-ఐ–ఎంఎంటీలు... జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ల కోసం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎన్ఎండీసీ, సీఎండీ సుమిత్ దేబ్ , సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. బసు సమక్షంలో ఈ ఎంఓయూ కుదిరింది. ఎన్ఎండీసీ , సీఎస్ఐఆర్-ఐ–ఎంఎంటీ మధ్య సహకారం వల్ల భారతీయ ఖనిజ పరిశ్రమను స్వయం ఆధారితంగా మార్చడానికి వీలవుతుంది. రెండు సంస్థలు కలిసి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాయి. సీఎస్ఐఆర్ -ఐఎంఎంటీ , ఎన్ఎండీసీ పరిశోధనా, అభివృద్ధి సెంటర్ అపారమైన పరిజ్ఞానాన్ని , అనుభవాన్ని.. తక్కువ & లీన్ గ్రేడ్ ఇనుప ఖనిజం ప్రాసెసింగ్, బొగ్గు లబ్ధి, గనుల వ్యర్థాల వినియోగం, మురికి రవాణా , టంగ్స్టన్ రికవరీలో పరిశోధన కోసం జాయింట్ వెంచర్ ఉపయోగించుకుంటుంది. ఈ ఎమ్ఒయుపై ఎస్కె చౌరసియా, జిఎమ్ (ఆర్ అండ్ డి), ఎన్ఎండిసి , డాక్టర్ అశోక్ సాహు, చీఫ్ సైంటిస్ట్ & హెడ్ ఎస్పీబీడీ, సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ, భువనేశ్వర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా సిఎండి ఎన్ఎండిసి సుమిత్ దేబ్ మాట్లాడుతూ, "భారత మైనింగ్ రంగం స్వయం ఆధారిత యుగంలోకి ప్రవేశిస్తున్నది. మైనింగ్లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడానికి ఎన్ఎండిసి పెట్టుబడులు పెడుతోంది. సీఎస్ఐఆర్-ఐ–ఎంఎంటీ తో ఈ సహకారం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు" అని అన్నారు.
***
(Release ID: 1759105)
Visitor Counter : 147