ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులపై కోవిడ్ ప్రభావం

प्रविष्टि तिथि: 05 FEB 2021 6:41PM by PIB Hyderabad

ప్రభుత్వం వెల్లడించిన తాజా సంకలక్: స్టేటస్ ఆఫ్ నేషనల్ ఎయిడ్స్ రెస్పాన్స్ (2020) నివేదిక ప్రకారం, దేశంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం యొక్క హెచ్ఐవి పరీక్ష మరియు కౌన్సెలింగ్ సేవల క్రింద గత మూడేళ్ళలో సుమారు 5.56 లక్షల హెచ్ఐవి / ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి.

సంవత్సరాల వారీగా వివరాలు క్రింద ఉన్నాయి:

 

ఆర్థిక సంవత్సరం  

నమోదైన కేసులు

2017-18

191,947

2018-19

187,382

2019-20

177,236


జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో)  కార్యక్రమం కింద నమోదు చేసుకున్న వ్యక్తులందరికీ కొవిడ్ -19 మహమ్మారి సమయంలో HIV / AIDS మరియు క్షయవ్యాధి వంటి సంబంధిత అనారోగ్యాలకు సేవలను అందించడానికి సదుపాయం కల్పించింది.


యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ (ఏఆర్‌టీ) యొక్క బహుళ నెలల పంపిణీ, హెచ్‌ఐవి కోసం కమ్యూనిటీ ఆధారిత స్క్రీనింగ్ మరియు విభిన్న పద్ధతుల ద్వారా సాధ్యమైనంతవరకు సేవా నిబంధనల కొనసాగింపును నిర్ధారించడానికి ఎన్‌ఏసివో అన్ని రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల ఎయిడ్స్‌ నియంత్రణ సంఘాలకు (ఎస్‌ఏసిఎస్‌) మార్గదర్శకాలను జారీ చేసింది. హెచ్‌ఐవి / ఎయిడ్స్‌తో బాధపడే ప్రజలకు అత్యవసర పునరావాసం మరియు మందుల పంపిణీ వైపు ఫ్రంట్ లైన్ కార్మికులు మరియు వాహనాల అడ్డంకులు లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.

మహమ్మారి సమయంలో హెచ్ఐవి పాజిటివ్ రోగులు ఇతర రాష్ట్రాలు / జిల్లాల్లో చిక్కుకుంటే వారికి మందులను తిరస్కరించవద్దని రాష్ట్రాలకు సూచించబడింది.

ఈ సూచనలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి మరియు పునరుద్ఘాటించడానికి కమ్యూనిటీ ప్రతినిధులతో సహా అందరు ప్రతినిధులతో నాకో అనేక వర్చువల్ సమావేశాలను ఏర్పాటు చేసింది.

పిఎల్‌హెచ్‌వి మరియు ఇతర సంబంధిత జనాభాను సామాజిక రక్షణ పథకాలలో చేర్చడానికి నాకో అన్ని ఎస్‌ఐసిఎస్‌లతో పాటు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

హెచ్‌ఐవి / ఎయిడ్స్‌తో బాధపడుతున్న వ్యక్తులపై కోవిడ్ -19 ప్రభావంపై నాకో ఎటువంటి అధ్యయనం చేయలేదు.

సహాయ మంత్రి (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం), శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

***


(रिलीज़ आईडी: 1695667) आगंतुक पटल : 277
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English